22-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం
'' మధురమైన పిల్లలారా - మిమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు, మీ వద్ద జ్ఞాన రత్నాలున్నాయి. మీరు ఈ జ్ఞాన రత్నాల వ్యాపారమే చేయాలి. ఇక్కడ మీరు జ్ఞానము నేర్చుకుంటారు, భక్తి కాదు. ''
ప్రశ్న:- డ్రామాలో నిశ్చయింపబడిన ఏ అద్భుతాన్ని చూసి అది భగవంతుని లీల అని భావించి వారిని పొగుడ్తారు?
జవాబు:- ఎవరు ఎవరిలో భావనను ఉంచుతారో వారికి వారి సాక్షాత్కారము అవుతుంది. కనుక భగవంతుడే నాకు సాక్షాత్కారము చేయించారని భావిస్తారు. కాని ఇదంతా డ్రామానుసారము జరుగుతుంది. ఒకవైపు భగవంతుని మహిమ చేస్తారు, మరోవైపు వారిని సర్వవ్యాపి అని గ్లాని కూడా చేస్తారు.
ఓంశాంతి. భగవవానువాచ - మనుష్యులను గానీ, దేవతలను గానీ భగవంతుడని అనరని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. బ్రహ్మ దేవతాయ నమ:, శంకర దేవతాయ నమ: అని అంటూ శివ పరమాత్మాయ నమ: అని అంటారు. శివునికి తమ స్వంత శరీరము లేదని మీకు తెలుసు. శివబాబా మరియు సాలిగ్రామాలు మూలవతనంలో ఉంటాయి. పిల్లలైన మనలను తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇతర సత్సంగాలేవీ వాస్తవానికి సత్యముతో సాంగత్యము లేనివని కూడా పిల్లలైన మీకు తెలుసు. అవన్నీ మాయా సాంగత్యాలని తండ్రి చెప్తున్నారు. మనలను చదివించేది భగవంతుడని వారెవ్వరూ భావించరు. గీత కూడా కృష్ణ భగవానువాచ అని భావించి వింటారు. రోజురోజుకు గీతా అభ్యాసము తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారికి తమ స్వంత ధర్మము కూడా తెలియదు. అందరికీ కృష్ణుడంటే చాలా ప్రీతి. కృష్ణుడినే అందరూ ఊయలలో ఊపుతారు. అయితే ఇప్పుడు మనము ఊయలలో ఎవరిని ఊపాలో మీకు తెలుసు. తండ్రిని ఊపరు కాని పిల్లలను ఊయలలో ఊపుతారు. మీరు శివబాబాను ఊపుతారా? వారు బాలునిగా అవ్వరు, పునర్జన్మ తీసుకోరు. వారొక బిందువు. కనుక వారినెలా ఊపుతారు? చాలామందికి కృష్ణుని సాక్షాత్కారము అవుతుంది. మొత్తం విశ్వమంతా కృష్ణుని నోటిలో ఉంది ఎందుకంటే అతను విశ్వానికి అధికారిగా అవుతారు. అందువలన కృష్ణుని నోటిలో విశ్వమనే వెన్న ఉంది. వారు యుద్ధము చేసేది కూడా సృష్టి రూపి వెన్న కొరకే. గెలుపొందాలని వారు భావిస్తారు. కృష్ణుని నోటిలో వెన్న ముద్దను చూపిస్తారు. ఇది కూడా అనేక విధాలుగా సాక్షాత్కారము అవుతూ ఉంటుంది. అయితే దీని అర్థము ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మీకు సాక్షాత్కారమంటే ఏమిటో అర్థం చేయించబడ్తుంది. భగవంతుడే మాకు సాక్షాత్కారము చేయించారని మనుష్యులు భావిస్తారు. ఎవరిని స్మృతి చేస్తారో కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఉదాహరణానికి ఎవరైనా కృష్ణుని గురించి తీవ్రమైన భక్తి చేస్తే అల్పకాలము కొరకు వారి మనోకామన పూర్తి అవుతుంది అనగా కృష్ణుని సాక్షాత్కారమవుతుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. అంతేకాని ఈ సాక్షాత్కారాలు భగవంతుడు చేయించినవి కావు. ఎవరు ఏ భావముతో ఎవరిని పూజిస్తారో వారికి ఆ సాక్షాత్కారము అవుతుంది. ఇది డ్రామాలో నిశ్చయింపబడింది. అయితే ఇది భగవంతుడు చేయించిన సాక్షాత్కారమని వారిని మహిమ చేస్తారు. ఒకవైపు ఇంత మహిమ కూడా చేస్తారు, మరోవైపు రాయి, రప్పలలో భగవంతుడున్నాడని కూడా అంటారు. ఇది చాలా మూఢ నమ్మకముతో చేయు భక్తి. కృష్ణుని సాక్షాత్కారమయింది కనుక తప్పకుండా కృష్ణపురానికి వెళ్లిపోతామని భావిస్తారు. కాని ఇక్కడ కృష్ణపురము ఎక్కడ ఉంది? ఈ రహస్యాలన్నీ ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తారు. కృష్ణపురము స్థాపన అవుతూ ఉంది. ఇది కంసపురము. కంసుడు, అకాసురుడు, బకాసురుడు, కుంభకర్ణుడు, రావణుడు ఇవన్నీ అసురుల పేర్లు. శాస్త్రాలలో ఏదేదో వ్రాసేశారు.
గురువులు రెండు రకాలని కూడా తెలిపించాలి. ఒకటేమో భక్తిమార్గములోని గురువులు. వీరు భక్తి చేయడం మాత్రమే నేర్పిస్తారు. ఈ తండ్రి జ్ఞానసాగరులు. వీరిని సద్గురువని అంటారు. వీరు ఎప్పుడూ భక్తి నేర్పించరు. జ్ఞానము మాత్రమే నేర్పిస్తారు. మనుష్యులు భక్తి చేస్తూ ఎంతో సంతోషిస్తారు. తాళాలు, ఢక్కీ మ్రోగించి భజనలు చేస్తారు. బనారస్లో దేవతలందరికీ మందిరాలు కట్టించారు. ఇవన్నీ భక్తిమార్గపు దుకాణాలు. భక్తికి సంబంధించిన వ్యాపారాలు. పిల్లలైన మీది జ్ఞానరత్నాల వ్యాపారము. దీనిని కూడా వ్యాపారమని అంటారు. తండ్రి కూడా రత్నాల వ్యాపారులే. ఇవి ఎటువంటి రత్నాలో మీకు తెలుసు. ఈ విషయాలను కల్పక్రితము ఎవరు అర్థము చేసుకున్నారో ఇప్పుడు కూడా వారే అర్థము చేసుకుంటారు. ఇతరులు అర్థము చేసుకోలేరు. ఎవరైతే చాలా గొప్పవారిగా ఉన్నారో, వారు చివరిలో వచ్చి అర్థము చేసుకుంటారు. కొంతమంది ఇతర మతాలలోకి పరివర్తన కూడా అయ్యారు కదా. జనక మహారాజు కథ కూడా వినిపిస్తారు. జనకుడు మళ్లీ అనుజనకుడుగా అవుతాడు. ఉదాహరణానికి ఎవరి పేరైనా కృష్ణుడైతే నీవు దైవీ కృష్ణునిగా అవుతావని అంటారు. సర్వ గుణ సంపన్నమైన ఆ కృష్ణుడు ఎక్కడ, ఈ కృష్ణుడు ఎక్కడ! ఎవరి పేరైనా లక్ష్మి అయితే, ఆమె ఈ లక్ష్మీనారాయణుల ఎదుటకు వెళ్లి వారిని మహిమ చేస్తుంది. ఆ లక్ష్మికి, నాకు ఇంత వ్యత్యాసము ఎందుకుందో ఆమెకు అర్థము కాదు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది. మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. ఈ చక్రము అనేకసార్లు తిరుగుతూ వచ్చింది. ఎప్పుడూ ఆగిపోదు, తిరుగుతూనే ఉంటుంది. మీరు ఈ నాటకములోని పాత్రధారులు. మనము ఈ నాటకములో పాత్రను అభినయించేందుకు వచ్చామని మాత్రం మనుష్యులకు తెలుసు. అయితే ఈ డ్రామా అదిమధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు.
ఆత్మల నివాస స్థానము అత్యంత పై భాగంలో ఉందని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ సూర్య, చంద్రుల ప్రకాశము కూడా ఉండదు. ఈ విషయాలన్నీ అర్థము చేసుకునే పిల్లలు చాలా వరకు సాధారణంగా పేదవారుగానే ఉంటారు. ఎందుకంటే భారతదేశమే అన్నిటికంటే ధనవంతముగా ఉండేది, ఇప్పుడు భారతదేశమే అన్నిటికంటే నిరుపేద దేశంగా అయింది. డ్రామా అంతా భారతదేశము పైనే ఆధారపడి ఉంది. భారతదేశము వంటి పవిత్రమైన ఖండము మరొకటేదీ ఉండదు. పావన ప్రపంచంలో పావన ఖండము మాత్రమే ఉంటుంది. ఇక ఏ ఇతర ఖండమూ అక్కడ ఉండదు. ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన ద్వీపమని బాబా అర్థం చేయించారు. లంక(సిలోన్) ఎలాగైతే ఒక ద్వీపమో అలా ఈ ప్రపంచమంతా ఒక ద్వీపమే. రావణుడు లంకలో ఉండేవాడని అంటారు. ఇప్పుడు రావణరాజ్యము ఈ పూర్తి బేహద్ లంక పై ఉందని మీకు తెలుసు. ఈ సృష్టి అంతా సముద్రము పై ఉంది. ఇదంతా ఒక ద్వీపమే. దీని పై రావణ రాజ్యముంది. ఈ సీతలందరూ రావణుని జైలులో ఉన్నారు. అయితే వారు హద్దులోని కథలు తయారు చేసేశారు. వాస్తవానికి ఇవన్నీ అనంతమైన విషయాలు. ఇది అనంతమైన నాటకము. అందులోనే చిన్న-చిన్న నాటకాలు కూర్చుని తయారు చేశారు. ఈ సినిమాలు మొదలైనవి కూడా ఇప్పుడు తయారైనవి. వీటి ద్వారా అర్థము చేయించేందుకు తండ్రికి కూడా సులభంగా ఉంటుంది. ఈ అనంతమైన నాటకమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనాల గురించి ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఆత్మలైన మనమంతా మూలవతన వాసులమని మీకు తెలుసు. దేవతలు సూక్ష్మవతన వాసులు, వారిని ఫరిస్తాలని కూడా అంటారు. అక్కడ రక్తమాంసాల అస్తిపంజరముండదు. సూక్ష్మవతనములో పాత్ర కూడా కొద్ది సమయము మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు సూక్ష్మవతనములోకి వస్తూ, పోతూ ఉంటారు. తర్వాత ఎప్పుడూ వెళ్లరు. ఆత్మలైన మీరు మూలవతనము నుండి వచ్చునప్పుడు వయా సూక్ష్మవతనము ద్వారా రారు, నేరుగా వచ్చేస్తారు. ఇప్పుడు వెళ్లేటప్పుడు సూక్ష్మవతనము ద్వారానే వెళ్తారు. ఇప్పుడు మాత్రమే సూక్ష్మవతన పాత్ర ఉంటుంది. ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మలైన మనకు అర్థము చేయిస్తున్నానని తండ్రికి తెలుసు. సాధు-సత్పురుషులు ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు. వారెప్పుడూ ఇటువంటి విషయాలు మాట్లాడలేరు. అనంతమైన తండ్రియే పిల్లలతో ఈ విషయాలు మాట్లాడ్తారు. అవయవాలు లేకుంటే మాట్లాడలేరు కదా. నేను ఈ శరీరము ఆధారంగా తీసుకొని పిల్లలైన మిమ్ములను చదివిస్తానని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీ దృష్టి కూడా తండ్రి వైపుకు వెళ్తుంది. ఇవన్నీ కొత్త విషయాలు. నిరాకార తండ్రి మాత్రమే ఈ విషయాలు తెలుపుతారు. వారి పేరు శివబాబా. ఆత్మలైన మీ పేరు ఆత్మలే. మీ శరీరము పేర్లు మారిపోతూ ఉంటాయి. పరమాత్మ నామ-రూపాలకు భిన్నమని అంటారు. కాని వారి పేరు శివుడని అంటారు కదా. శివుని పూజ కూడా చేస్తారు. ఒకటి అర్థము చేసుకుంటారు, మరొకటి చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నామ-రూప-దేశ-కాలాదులన్నీ తెలుసుకున్నారు. ఏ వస్తువు కూడా నామ-రూపాలు లేకుండా ఉండదని మీకు తెలుసు. ఇది కూడా చాలా సూక్ష్మముగా అర్థము చేసుకునే విషయము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - సెకండులో జీవన్ముక్తి అనే గాయనం కూడా ఉంది. అనగా మనుష్యులు నరుని నుండి నారాయణునిగా అవ్వగలరు. మన తండ్రి హెవన్లీ గాడ్ఫాదర్. మనము వారి పిల్లలుగా అయ్యాము కనుక మనము స్వర్గానికి అధికారులము. అయితే ఈ విషయము కూడా అర్థము చేసుకోరు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! నరుని నుండి నారాయణునిగా అవ్వడమే మీ లక్ష్యము. ఇది రాజయోగము కదా. చాలామందికి చతుర్భుజుని సాక్షాత్కారమవుతుంది. అందువలన మనము విష్ణుపురానికి అధికారులుగా అయ్యేవారమని ఋజువవుతుంది. స్వర్గములో కూడా లక్ష్మీనారాయణుల సింహాసనము వెనుక విష్ణువు చిత్రము ఉంటుందని మీకు తెలుసు అనగా విష్ణుపురములో లక్ష్మినారాయణుల రాజ్యము ఉందని అర్థమవుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విష్ణుపురమునకు యజమానులు. అది కృష్ణపురము, ఇది కంసపురము. డ్రామానుసారము ఈ పేర్లు పెట్టబడినవి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నా రూపము చాలా సూక్ష్మమైనది. ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆత్మ ఒక నక్షత్రమని అంటారు కాని మళ్లీ లింగ రూపాన్ని తయారుచేస్తారు. లేకుంటే ఎలా పూజిస్తారు? రుద్ర యజ్ఞమును రచిస్తే బొటనవ్రేలు వంటి సాలిగ్రామాలను తయారు చేస్తారు. మరోవైపు ఆత్మలు నక్షత్రాల వలె ఉంటాయని అంటారు. ఆత్మను చూచేందుకు చాలా ప్రయత్నిస్తారు. కాని ఎవ్వరూ చూడలేరు. రామకృష్ణుడు, వివేకానందుల ఉదాహరణ కూడా చూపిస్తారు కదా. రామకృష్ణుని నుండి ఆత్మ వెలువడి తనలో ప్రవేశించినట్లు వివేకానందుడు చూస్తాడు. అయితే అతనికి ఎవరి సాక్షాత్కారము జరిగి ఉంటుంది? ఆత్మ-పరమాత్మల రూపమేమో ఒక్కటే. బిందువును చూస్తే ఏమీ అర్థము కాదు. ఆత్మను సాక్షాత్కారములో చూడాలని ఎవ్వరూ కోరుకోరు. అందరూ పరమాత్మ సాక్షాత్కారమవ్వాలని కోరుకుంటారు. గురువు ద్వారా పరమాత్ముని సాక్షాత్కారమవ్వాలని వివేకానందుడు కూర్చున్నప్పుడు ఒక జ్యోతి కనిపించింది. అది నాలోకి వచ్చి ప్రవేశించిందని అనేశాడు. దీనికే అతను చాలా సంతోషించాడు. ఇదే పరమాత్ముని రూపమని భావించాడు. గురువు ద్వారా భగవంతుని సాక్షాత్కారమవ్వాలనే భావము ఉంటుంది. అయితే ఏమీ అర్థము కాదు. భక్తిమార్గములో ఎవరు అర్థము చేయిస్తారు? ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఏ ఏ రూపములో ఎటువంటి భావన ఉంచుకుంటారో, ఏ రూపమును చూస్తారో వారికి అది సాక్షాత్కామైపోతుంది. ఉదాహరణానికి గణేశుని చాలా ఎక్కువగా పూజిస్తే వారికి చైతన్య రూపములో గణేశుడు సాక్షాత్కారమవుతాడు. అలా కాకుంటే వారికి నిశ్చయమెలా కలగాలి? తేజోమయ రూపాన్ని చూసి మేము భగవంతుని సాక్షాత్కారము చేసుకున్నామని భావిస్తారు. అందులోనే సంతోషపడ్తూ ఉంటారు. ఇదంతా భక్తిమార్గము. క్రిందికి దిగే కళ. మొదటి జన్మ బాగుంటుంది తర్వాత తగ్గుతూ-తగ్గుతూ అంత్యము వచ్చేస్తుంది. ఈ విషయాలన్నీ పిల్లలు మాత్రమే అర్థము చేసుకుంటారు. కల్పక్రితము ఈ జ్ఞానము ఎవరికి అర్థం చేయించానో వారికే ఇప్పుడు అర్థం చేయిస్తున్నాను. కల్పక్రితము వచ్చినవారే వస్తారు. మిగిలిన వారి ధర్మాలే వేరుగా ఉంటాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఒక్కొక్క చిత్రములో భగవానువాచ అని వ్రాసేయండి. చాలా యుక్తిగా అర్థం చేయించాలి. భగవానువాచ కదా - యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేశారో ఈ చిత్రాలలో చూపించారు. మీ తండ్రి ఎవరో మీకు తెలుసా? అని అడగండి. తెలియకుంటే తండ్రి పై ప్రీతి లేదని అర్థము అనగా విపరీత బుద్ధి గలవారు అయ్యారు కదా. తండ్రి పై ప్రీతి లేకుంటే వినాశనమైపోతారు. ప్రీతి బుద్ధి గలవారు విజయులుగా అవుతారు. సత్యమేవ జయతే - దీని అర్థము కూడా బాగుంది. తండ్రి స్మృతి లేకుంటే విజయము పొందలేరు.
గీతను శివభగవానుడు వినిపించారని ఇప్పుడు మీరు నిరూపించి చెప్పగలరు. వారే బ్రహ్మ ద్వారా రాజయోగమును నేర్పించారు. కాని కృష్ణభగవానుని గీతగా భావించి ప్రమాణము చేస్తారు. సమక్షములో ఉన్నారని భావించవలసింది కృష్ణుడినా లేక భగవంతుడినా? అని అడగాలి. ఈశ్వరుని సమక్షములో ఉన్నారని భావించి సత్యము చెప్పమని అంటారు. ఇది ఒక సంప్రదాయంగా అయిపోయింది. కనుక ప్రమాణము కూడా అసత్యమైపోతుంది. సేవ చేసే పిల్లలకు గుప్త నషా ఉండాలి. నషాతో అర్థం చేయిస్తే సఫలత ఉంటుంది. మీ చదువు కూడా గుప్తమే. చదివించేవారు కూడా గుప్తమే. మనము నూతన ప్రపంచములో ఇలా(లక్ష్మినారాయణులుగా) అవుతామని మీకు తెలుసు. మహాభారత యుద్ధము తర్వాత నూతన ప్రపంచము స్థాపనవుతుంది. పిల్లలకిప్పుడు జ్ఞానము లభించింది. అది కూడా నంబరువారుగా ధారణ చేస్తారు. యోగములో కూడా నంబరువారుగా ఉంటారు. మేము ఎంత సమయము స్మృతిలో ఉంటున్నాము? అని కూడా చెక్ చేసుకోవాలి. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మీరు చేసే ఈ పురుషార్థము భవిష్య 21 జన్మలకు ప్రాలబ్ధమునిస్తుంది. ఇప్పుడు ఫెయిల్ అయితే కల్ప-కల్పాంతరాలు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఉన్నతపదవి పొందలేరు. ఉన్నతపదవి పొందేందుకు పురుషార్థము చేయాలి. వికారాలకు వశమైనవారు కూడా కొన్ని సేవాకేంద్రాలకు వస్తూ ఉంటారు. ఈశ్వరుడు అన్నీ చూస్తూ ఉంటారు, వారికి అన్నీ తెలుసని భావిస్తారు. ఇవన్నీ చూచేందుకు తండ్రికి ఏం అవసరము? మీరు అసత్యము చెప్పి వికర్మలు చేస్తూ ఉంటే మీ అంతకు మీరే నష్టపోతారు. ముఖము నల్లగా చేసుకుంటే(అపవిత్రమౌతే) ఉన్నతపదవి పొందలేమని మీకు కూడా తెలుసు. కనుక తండ్రికి తెలిసినా ఫలితమొక్కటే కదా. తెలుసుకునే అవసరం వారికేముంది? ఇటువంటి కర్మలు చేస్తే దుర్గతి పాలవుతామని మీ మనసు తింటూ ఉండాలి. బాబా ఎందుకు అర్థం చేయించాలి? అయితే డ్రామాలో ఉంటే బాబా ఇది కూడా తెలుపుతారు. బాబా నుండి దాచిపెట్టడమంటే మీ అంతకు మీరే సర్వ నాశనము చేసుకోవడం. పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. బాగా చదువుకొని ఉన్నతపదవి పొందాలనే తపన మీకుండాలి. ఎవరు మరణించినా, ఎవరు జీవించినా దాని చింత మీకెందుకు? తండ్రి నుండి వారసత్వము ఎలా తీసుకోవాలనే చింత మీకుండాలి. ఎవరికైనా క్లుప్తంగా అర్థం చేయించాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. గుప్త నషాలో ఉండి సేవ చేయాలి. మనసు తినే పని ఏదీ చేయరాదు. ఎంత సమయము స్మృతిలో ఉంటున్నామని స్వయాన్ని చెక్ చేసుకోవాలి.
2. బాగా చదువుకొని ఉన్నత పదవి పొందాలనే చింత మీలో సదా ఉండాలి. వికర్మలు చేసి అసత్యము చెప్పి మిమ్ములను మీరు నష్టపరచుకోరాదు.
వరదానము:- '' విశేషతల దానం ద్వారా మహాన్గా తయారయ్యే మహాదాని భవ
జ్ఞాన దానాన్ని అయితే అందరూ చేస్తారు కాని విశేష ఆత్మలైన మీరు మీ విశేషతలను దానం చేయాలి. మీ ముందుకు ఎవరు వచ్చినా వారికి మీ నుండి తండ్రి స్నేహము అనుభవమవ్వాలి. మీ ముఖము ద్వారా తండ్రి చిత్రము, మీ నడవడిక ద్వారా తండ్రి చరిత్ర కనిపించాలి. మీ విశేషతలను చూసి వారు విశేష ఆత్మలుగా అయ్యేందుకు ప్రేరణను ప్రాప్తి చేసుకోవాలి. ఇటువంటి మహాదానులుగా అయితే ఆది నుండి అంత్యము వరకు పూజ్యులలోనూ, పూజారులలోనూ మహాన్గా (గొప్పవారిగా) ఉంటారు.
స్లోగన్:- '' సదా ఆత్మ - అభిమానులుగా ఉండేవారే అందరికంటే గొప్ప జ్ఞానులు ''
This is how my acquaintance Wesley Virgin's biography launches in this SHOCKING AND CONTROVERSIAL video.
ReplyDeleteAs a matter of fact, Wesley was in the military-and shortly after leaving-he discovered hidden, "mind control" tactics that the CIA and others used to get everything they want.
As it turns out, these are the exact same methods lots of celebrities (notably those who "became famous out of nowhere") and elite business people used to become wealthy and successful.
You've heard that you use only 10% of your brain.
That's mostly because the majority of your brainpower is UNCONSCIOUS.
Perhaps that expression has even taken place IN YOUR own brain... as it did in my good friend Wesley Virgin's brain seven years back, while driving a non-registered, garbage bucket of a car with a suspended driver's license and with $3 in his pocket.
"I'm absolutely frustrated with living paycheck to paycheck! When will I finally make it?"
You've been a part of those those conversations, am I right?
Your very own success story is going to start. You need to start believing in YOURSELF.
Watch Wesley Virgin's Video Now!