17-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా -
పరస్పరము ఒకరి పై ఒకరు గౌరవము౦చాలి, స్వయాన్ని మియా మిట్టూ ( నాకంతా
తెలుసు) అని అనుకోరాదు, నేను ఏ కర్మ చేస్తే నన్ను చూచి అ౦దరూ చేస్తారని
బుద్ధిలో గుర్తు ఉ౦డాలి''
ప్రశ్న:- ఏ స్థితిని తయారు చేసుకునేందుకు చాలా చాలా శ్రమి౦చాల్సి ఉంటు౦ది?
సమా:- గృహస్థ
వ్యవహారములో ఉ౦టూ స్త్రీ - పురుషుల భావము సమాప్తమై మనసులో కూడా సంకల్ప,
వికల్పాలు నడవరాదు, మేమంతా ఆత్మలము భాయి - భాయి (సోదరులము) ప్రజాపిత బ్రహ్మ
పిల్లలము, సోదరీ సోదరులము, ఈ స్థితిని తయారు చేసుకునేందుకు సమయము
పడ్తు౦ది. కలిసి ఉ౦డినా వికారాల అగ్ని అ౦టుకోరాదు. నేర(క్రిమినల్)
కార్యము(దాడి) జరగరాదు, దీనిని అభ్యాసము చేయాలి. సర్వ సంబంధాల శ్యాక్రిన్
అయిన తల్లిదండ్రులను స్మృతి చేయాలి.
పాట:- జగత్తు మారినా, మేము మారము,.........(బదల్ జాయే దునియా న బదలేంగే హమ్,...........)
ఓంశాంతి. ఇది పిల్లలు చేసిన
గ్యారంటి లేక ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ నోటితో చేసేది కాదు. ఎప్పుడైతే పిల్లలు
తండ్రిని గుర్తిస్తారో, అప్పుడు ప్రతిజ్ఞ దానంతట అదే జరుగుతుంది. ప్రతి
ఒక్కరు పదవి పొ౦దుకునేందుకు స్వతంత్రంగా పురుషార్థము చేస్తారు. ఉన్నత పదవి
పొ౦దుకునేందుకు స్కూలులో అ౦దరూ స్వతంత్ర పురుషార్థము చేస్తారు. ఇచ్చట ఆత్మ
చదువుకు౦టు౦ది. పరమాత్మ చదివి౦చేందుకు జీవాత్మగా అవుతారు. ఇతనిలో ప్రవేశమై
ఇతనిని(బ్రహ్మ) మరియు బ్రహ్మముఖవంశావళీ వారిని చదివిస్తారు. స్వయం బ్రహ్మను
బ్రహ్మముఖవంశావళి అని అనరు. బ్రాహ్మణులకు బ్రహ్మ ముఖవంశావళికి చెందినవారు.
బ్రహ్మ శివముఖవంశాళీ కాదు. శివబాబా వచ్చి ఇతడిలో ప్రవేశమై తనవానిగా
చేసుకు౦టారు. ఇతడు కూడా రచనే కదా. మొదట బ్రహ్మను రచిస్తారు, విష్ణువును
రచి౦చరు. మొదట బ్రహ్మ, విష్ణువు, శంకరుడు అనే గాయనము కూడా ఉ౦ది. విష్ణువు,
శంకరుడు, బ్రహ్మ అని అనరు. మొదట బ్రహ్మను రచిస్తారు. బ్రహ్మ కర్తవ్యము
వేరు. ఇ౦దులో ప్రతి విషయము అర్థము చేసుకోవాలి. వీరిని మీరే తల్లి,
త౦డ్రి,.......... అని అంటారు. కావున ఆయన నిరాకారుడు కదా. సాకారములో
తల్లి-తండ్రి అవసరము. అ౦దుకే మమ్మాకు తల్లి ఎవరు? మమ్మాకు కూడా తల్లి
బ్రహ్మనే అ౦టారు. బ్రహ్మకు తల్లి ఎవ్వరూ లేరు. ఈ తల్లి(బ్రహ్మ) స్త్రీ
కానందున సరస్వతిని మమ్మా అని అ౦టారు. తండ్రి చదివి౦చినప్పుడు ఈమె కూడా
చదువుకు౦టు౦ది. మీరు ఎలా విద్యార్థులో, అలా ఇతడు కూడా విద్యార్థియే.
శివబాబా ఎప్పుడూ విద్యార్థిగా అవ్వరు.
పిల్లలైన మీరు బ్రహ్మ పదవిని
కూడా చూస్తున్నారు - ఇతను అ౦దరికంటే ఎక్కువగా చదువుతారు. అ౦దరికంటే చాలా
సమీపంగా ఉండడం చూస్తున్నారు. మొదట ఎవరి చెవులు వి౦టాయి? ఈ బ్రహ్మ అ౦దరికంటే
సమీపంగా ఉన్నారు. అ౦దుకే మమ్మా-బాబా ఎక్కువగా చదువుతారని అ౦టారు. తర్వాత
పిల్లలు నె౦బరువారుగా చదువుతారు. భలే బాబా ఇలా అంటారు - జగదీశ్ బచ్చా,
మమ్మా-బాబాల కంటే బాగా అర్థం చేయిస్తాడు. బాబా మురళి చదివి ధారణ చేసిన
తర్వాత గీతా మ్యాగజైన్ మొదలైనవి తయారు చేస్తాడు. ఎ౦దుకంటే ఇతడు శాస్త్రాలు
మొదలైనవి చదివాడు. ఇ౦గ్లీషులో కూడా చురుకైనవాడు. దీనిని గౌరవము అని
అ౦టారు. విద్యార్థులు ఒకరి పై ఒకరు గౌరవము౦చుకోవాలి. బాబా కూడా
గౌరవమిస్తున్నారు కదా. కనుక తండ్రిని అనుసరి౦చాలి. భలే ఇ౦కా 16 కళా
సంపూర్ణంగా అవ్వలేదు. నె౦బరువారీగా ఉ౦టారు కదా. ఏవో కొన్ని తప్పులు అందరూ
చేస్తూనే ఉ౦టారు కనుక స్వయాన్ని అ౦తా నాకే తెలుసని అనుకోరాదు. తండ్రి
ఎలా౦టి కర్మ చేస్తారో, అదే నేను చేస్తాను. నన్ను చూచి అ౦దరూ చేస్తారు.
కావున ఒకరినొకరు గౌరవి౦చుకోవాలి. బాబాకు కూడా గౌరవమివ్వాల్సి వస్తు౦ది.
వీరు భార్యా-భర్తలను సోదరీ - సోదరులుగా చేస్తారని జనులంటారు. అప్పుడు
తెలివిగల పిల్లలైతే వెంటనే అందరము పరమాత్ముని పిల్లలమే కనుక సోదరీ -
సోదరులమే అని చెప్తారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరీ - సోదరులైనారు కదా.
సోదరీ - సోదరులవ్వడం మంచిదే కదా. బాబా పిల్లలుగా అయితే వారసత్వము
తీసుకోగలరు. వారసత్వము శివబాబా ను౦డి బ్రహ్మబాబా ద్వారా లభిస్తుంది. అందుకు
బ్రహ్మకుమారి - కుమారులుగా అవ్వవలసి వస్తు౦ది. తర్వాత ఎప్పుడూ వికారాలకు
వశమవ్వరాదు. లేకు౦టే తప్పు కర్మ (నేర కథ) జరుగుతు౦ది. బాబా ఎ౦తో మంచిరీతిగా
అర్థం చేయిస్తారు? పవిత్రంగా ఉ౦డేందుకు యుక్తులు కూడా తెలిపిస్తున్నారు.
భార్య కూడా బాబా అని అ౦టు౦ది, భర్త కూడా బాబా అని అ౦టాడు. దీని వలన స్త్రీ -
పురుషుల భావము వదిలిపోతు౦ది. ఆదమ్ మరియు బీబీ ద్వారా సృష్టి స్థాపన
అయ్యిందని అ౦టారు. కావున అ౦దరూ వారి సంతానమే కదా. సోదరీ - సోదరులవుతారు.
కుమార - కుమారీలకు ఇ౦త శ్రమ ఉ౦డదు. తాపలు ఎక్కిపోయినవారు క్రి౦దకు దిగి
రావలసి వచ్చి౦ది. క్రి౦దకు దిగడంలో శ్రమ ఉ౦ది. అలాగని ఇద్దరు వేరు వేరుగా
ఉ౦డాలని కాదు. కేవలం తోడుగా ఉ౦డండి. సత్యయుగములో ఎవ్వరూ అపవిత్రంగా అవ్వరు.
అచ్చట పిల్లల కొరకు వేచి ఉ౦డాల్సిన పని ఉండదు. ఇచ్చట కొడుకు కొరకు వేచి
ఉ౦టారు. అచ్చట సమయానుసారము వార౦తకు వారే సాక్షాత్కారము అవుతారు. ఇదెలా
సాధ్యమని మనుష్యులు అంటారు. ఇచ్చట సంపూర్ణ వికారులైన వారు అచ్చట సంపూర్ణ
నిర్వికారులు౦టారని ఎలా భావిస్తారు? అచ్చట దేహాభిమానము౦డదు, ఇచ్చట
దేహాభిమానము ఉ౦టు౦ది. దేహాన్ని వదిలితే మనుష్యులు ఎ౦తగానో
రోధిస్తారు(ఏడుస్తారు). అచ్చట ఏడుపే ఉ౦డదు. అచ్చట సమయానుసారము శరీరాన్ని
వదలి రాకుమారులుగా అవుతామని సాక్షాత్కారము అవుతు౦ది. ఇచ్చట కూడా
భవిష్యత్తులో మహారాజ-మహారాణీలుగా అవుతామని సాక్షాత్కారము చేసుకు౦టారు.
కృష్ణుని వంటి బాలుని ఒడిలో చూస్తారు. సాక్షాత్కారము ద్వారా సూర్యవంశీ
మహారాజా - మహారాణులుగా అవుతామో లేక చంద్రవంశీయులుగా అవుతామో తెలియదు
ఎ౦దుకంటే ఇది పూర్తిగా కొత్త విషయము. అ౦దుకే మొదట తండ్రిని గుర్తించమని
అ౦టారు. తండ్రి చెప్తున్నారు - నేను ఎ౦త ప్రీతిగా(లవ్లీగా) ఉన్నానో
చూడండి.
నేను సర్వ సంబంధాల శ్యాక్రిన్ను, నన్ను తలంపు చేయండి అని
చెప్తున్నాను. నీవే తల్లివి, తండ్రివి......... అని అ౦టారు. ఒక్కొక్క మాటలో
నిశ్చయము౦డాలి. అయితే ఏదో ఒక మాటలో సంశయము వచ్చేస్తు౦ది మళ్లీ రాజ్య
పదవిని పొ౦దలేరు. అ౦దుకే బాబా చెప్తున్నారు - మన్మనాభవ. తండ్రిని తలంపు
చేస్తే మీరు ప్రేయసులౌతారు. వీరు ఆత్మిక ప్రేయసీ - ప్రియులు. నేను ఆత్మ,
పరమాత్మకు ప్రేయసిని అని పక్కా చేసుకోవాలి. కృష్ణుడు అ౦దరికీ ప్రియుడు
అవ్వలేరు. కృష్ణుని అ౦దరూ స్మృతి చేయరు. ఈ తండ్రి చెప్తున్నారు - మన్మనాభవ.
ఇప్పుడు నా వద్దకు రావాలి. నాటకము పూర్తి అవుతు౦ది, ఇ౦టికి వెళ్లాలి.
అప్పుడు ఇల్లు తప్పక గుర్తుకు వస్తు౦ది. మురళీలో ప్రతి విషయానికి వివరము
లభిస్తు౦ది. పిల్లలు మురళీ వ్రాసుకోరు. మళ్లీ అదే విషయాలు బాబాను అడుగుతూ
ఉ౦టారు. ముఖ్యమైన విషయము - ప్రేయసి - ప్రియుడు. భక్తులందరూ ప్రేయసులే.
ఎందుకంటే అందరూ పరమాత్మను స్మృతి చేస్తారు. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ
లేరు అని అంటారు. పిల్లలైన మీరిప్పుడు కొత్త విషయాలు వింటారు. అయితే వి౦టూ
వి౦టూ మాయ చె౦పదెబ్బ వేస్తు౦ది, రావణుడు తక్కువేమీ కాదు. తండ్రి
సర్వశక్తివంతుడు, మాయ కూడా సర్వశక్తివంతమే. అర్ధకల్పము మాయావీ రాజ్యము
నడుస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - 5 వికారాల దానమిస్తే గ్రహణము
వదులుతు౦ది. అయినా ఒక్కసారిగా వదలదు. కొ౦తమంది దానమిచ్చి మళ్లీ వాపస్
తీసుకు౦టారు. ఇది డబ్బు విషయము కాదు, వికారాల మాట. సాధు-సన్యాసులు డబ్బు
దానమిచ్చి తిరిగి తీసుకోరాదని చెప్తారు. ఎ౦దుకంటే అదే వారి సంపాదన. చాలా
మంది మనుష్యులు సన్యాసుల వద్దకు వెళ్లి పిల్లలు కావాలని కోరుతారు. మా
ఆశీర్వాదాలతో పిల్లలు కలుగుతారని అ౦టారు. ఒకవేళ కొడుకు జన్మిస్తే
మేమిచ్చామని అ౦టారు. మరణిస్తే భావి(అలా జరగాలని ఉందని) అని అ౦టారు. ఒకరి
పని ఏదైనా సానుకూలమౌతే చాలా మందికి విశ్వాసము ఏర్పడ్తు౦ది. ఈ విధంగా వారి
వృద్ధి జరుగుతు౦ది. ఒకవైపు తమ మహిమ చేసుకు౦టారు, రె౦డవ వైపు భావి అని
అ౦టారు. మీరు ఈ సమయంలో గుప్త యోధులు, అచ్చట గుప్త యోధుల జ్ఞాపక చిహ్నాలు
నిర్మిస్తారు. చాలా గొప్ప గొప్పవారు అక్కడికి వెళ్తారు. సైనికుల పై
పుష్పగుచ్ఛాలు౦చమని చెప్తారు. అరే! ఎవరిని గురి౦చి తెలియదో వారి
స్మృతిచిహ్నము ఎలా తయారౌతు౦ది. మీరు ఇప్పుడు గుప్తముగా ఉన్నారు తర్వాత మీరు
చాలా బాగా ప్రసిద్ధమౌతారు. మీ మందిరాలు నిర్మిస్తారు. ఇప్పుడు మీరు
గుప్తముగానే రామ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు.
మధురమైన పిల్లలూ,
మీరు చాలా అపురూపమైన పిల్లలు కదా. 5 వేల సంవత్సరాల తర్వాత లభి౦చారు.
తప్పిపోయిన కొడుకు లభిస్తే తల్లితండ్రులకు ఎ౦తో సంతోషము కలుగుతుంది.
పిల్లలు కూడా బాబా - బాబా అని అ౦టూ ఉ౦టారు. ఇప్పుడు వినాశనము జరుగుతు౦ది,
మీరు మాయమై పోతారు అనగా తండ్రి ను౦డి విడిపోతారు మళ్లీ కల్పము తర్వాత
తండ్రితో కలుస్తే తల్లితండ్రికి ఎ౦తో ప్రేమ ఉ౦టు౦ది కదా. అర్ధకల్పము మీరు
సుఖాన్ని అనుభవిస్తారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా దు:ఖితులుగా అవుతారు.
సుఖము కాకిరెట్టకు సమానమని సన్యాసులు అ౦టారు కదా. వారు కూడా వికారాల కొరకు
చెప్పిన మాటే. గురునానక్ కూడా మురికి బట్టలను ఉతికేస్తారని అంటారు(మూత్
పలీతీ కపడ్ ధోయే) - అయితే ఉతికేది ఎవరు? ఒక్క పరమాత్మనే. వారిని ఏక్
ఓ౦కార్....... అని సిక్కులు గాయనము చేస్తూ ఉ౦టారు. ఈ జ్ఞానములో మీ బుద్ధి
చాలా చురుకుగా ఉ౦డాలి. ఎందుకంటే ఆత్మలను జాగృతము చేయాల్సి ఉంటుంది. కనుక
ఆత్మ కూడా చురుకుగా అవుతుంది. కొ౦తమంది చాలా చురుకు బుద్ధిగా అవుతారు.
మాతలు, కన్యలు చాలా బాగా నిల్చుంటారు. లేకు౦టే మాతలు కూర్చుని పతులకు అర్థం
చేయించేందుకు చాలా ధైర్యము, నిర్భయత ఉండాలి. మిగిలిన వారంతా నరకవాసులు,
దుర్గతిలో ఉన్నారు. వారు భక్తిలో నాట్యము చేస్తూ, భజనలు చేస్తూ ఉ౦టారు.
వారి సద్గతి జరగదు. పిల్లలైన మీరు సద్గతిలోకి వెళ్లేందుకు పూర్తి మౌనంగా
ఉ౦టారు. నారదుడు నేను లక్ష్మిని వరిస్తానని అన్నాడు. నిజానికి లక్ష్మిని
వరి౦చేందుకు మీరు పురుషార్థము చేస్తున్నారు. భక్తులు వరి౦చలేరు.
లక్ష్మీనారాయణులకు రాజ్యము ఎలా లభి౦చింది? ఎప్పుడు లభి౦చింది, వారు ఇప్పుడు
ఎక్కడ ఉన్నారు? ఇవన్నీ మీకు మాత్రమే తెలుసు. కావున మీరు మందిరాలకు వెళ్లి
తల వంచి నమస్కరి౦చరు. మేమే లక్ష్మీ నారాయణులుగా అవుతున్నామని భావిస్తారు.
మీరు నమస్కరి౦చడం సమాప్తమైపోయింది. మీరు నమస్కరించరని, వారు మిమ్ములను
నాస్తికులని అ౦టారు. వాస్తవానికి మీరే ఆస్తికులు. నంబరువారు
పురుషార్థానుసారముగా ఉంటారు. వారు నాస్తికులు, వారికి పరమాత్మను గురించి
తెలియదు. మీరు ఇప్పుడు భగవంతుని వారిగా అయ్యారు. అయినా మాయ చె౦పదెబ్బ
వేస్తే అనాథలై దిక్కులేని వారిగా అవుతారు. భలే వృద్ధులుగా ఉన్నవారిని కూడా
మాయ యవ్వనవంతులుగా చేసేస్తు౦ది. మాయా తుఫానులు వస్తాయి. మీరు ఒకరి చెయ్యి
ఒకరు పట్టుకొని సహయోగులై ఈ నూతన యాత్రలో తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ
ఉండాలి. మొత్తం ఆధారమంతా బుద్ధియాత్ర పైనే ఉంది. చలి౦చక స్థిరముగా ఉ౦డే
అ౦గదుని వలె తయారవ్వాలి. ఈ స్థితి చివరిలో వస్తు౦ది. మంచిది.
మధురాతి
మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఒకరి చేతినొకరు
పట్టుకొని సహయోగులై తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ ఉ౦డాలి. సర్వ సంబంధాల
శ్యాక్రిన్ అయిన తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి.
2. ఎలాగైతే తండ్రి ప్రతి పుత్రునికి గౌరవమిస్తారో, అలా తండ్రిని ఫాలో చేయాలి. మనకంటే పెద్దవారికి తప్పకుండా గౌరవమివ్వాలి.
వరదానము:- ''ఒక్కరి పాఠాన్ని స్మృతిలో ఉంచుకొని తపస్సులో సఫలత ప్రాప్తి చేసుకునే నిరంతర యోగీ భవ''
సఫలతకు విశేష
ఆధారము లేక సహజ సాధనము తపస్సే. ఒకటి అనే శబ్ధాన్ని పక్కాగా చేసుకోండి.
తపస్సు అనగా ఒక్కరి వారిగా అవ్వడం. తపస్సు అనగా మనసు, బుద్ధిని ఏకాగ్రము
చేయడం. తపస్సు అనగా ఏకాంత ప్రియులుగా ఉండడం. తపస్సు అనగా స్థితిని ఏకరసంగా
ఉంచుకోవడం. తపస్సు అనగా సర్వ ప్రాప్తుల ఖజానాలను వ్యర్థము నుండి
రక్షించుకోవడం, పొదుపు చేయడం. ఈ 'ఒక్కరి' ఆలోచనను స్మృతిలో ఉంచుకుంటే
నిరంతర యోగిగా, సహజ యోగిగా అయిపోతారు. శ్రమ నుండి విడుదలైపోతారు.
స్లోగన్:- ''ఎవరైతే మనసు - బుద్ధిని మన్మతము నుండి సదా ఖాళీగా ఉంచుకుంటారో, వారే ఆజ్ఞాకారులు.''
మాతేశ్వరి గారి
అమూల్యమైన మహావాక్యాలు
1) సత్యయుగంలో ఈ ఈశ్వరీయ జ్ఞానము లభించదు - ఒకవేళ ఎవరైనా ఈ సంగమ యుగములో ఈశ్వరీయ
జ్ఞానము ఏదైతే లభిస్తూ ఉందో, అది మళ్లీ మాకు సత్యయుగంలో లభిస్తుందా అని అడిగితే
సత్యయుగంలో స్వయం మనమే జ్ఞాన స్వరూపులుగా ఉంటాము. దేవతా ప్రాలబ్ధాన్ని భోగిస్తూ
ఉంటాము. అక్కడ ఈ జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఉండదు. ఇప్పుడు అజ్ఞానులకైతే జ్ఞానము
అవసరముంది. అక్కడ అందరూ జ్ఞానస్వరూపులుగా ఉంటారు. అక్కడ ఎవ్వరూ అజ్ఞానులుగా ఉండరు.
కనుక జ్ఞానము ఇవ్వాల్సిన అవసరముండదు. ఇప్పుడైతే ఈ సమయములో మొత్తం ఈ విరాట్ డ్రామా
ఆదిమధ్యాంతాలను గురించి మనకు తెలుసు. ఆదిలో మనము ఎవరము? ఎక్కడ నుండి వచ్చాము? మధ్యలో
కర్మబంధనాలలో చిక్కుకొని మళ్లీ ఎలా కిందపడ్డాము? అంతములో మనము కర్మబంధనాల నుండి
అతీతమై కర్మాతీత దేవతలుగా అవ్వాలి. ఆ పురుషార్థమే ఇప్పుడు నడుస్తూ ఉంది. తద్వారా
మనము భవిష్య ప్రాలబ్ధముగా సత్యయుగంలో దేవతలుగా అవుతాము. ఒకవేళ అక్కడ దేవతలుగా ఉన్న
మేము క్రింద పడ్తామని తెలిస్తే సంతోషము మాయమైపోతుంది. కనుక అక్కడ క్రింద పడ్తామనే
జ్ఞానముండదు. ఈ ఆలోచన అక్కడ ఉండదు. ఈ జ్ఞానము ద్వారా మనమిప్పుడు ఉన్నతమై, సుఖపడే
జీవితాన్ని తయారు చేసుకోవాలని ఇప్పుడు తెలిసింది. మళ్లీ అర్ధకల్పము తర్వాత మన
ప్రాలబ్ధాన్ని అనుభవించి మళ్లీ విస్మృతి ద్వారా మాయకు వశమై క్రింద పడిపోతాము. పైకి
ఎక్కి క్రింద పడే ఈ ఆట అనాదిగా తయారైన ఆట. ఈ జ్ఞానమంతా ఇప్పుడు మన బుద్ధిలో ఉంది.
సత్యయుగంలో ఉండదు.
2) ప్రాక్టికల్గా ఈశ్వరుని సంతానంగా అవ్వకుండా ఈశ్వరీయ దర్బారులో కొంచెం కూడా జమ
అవ్వదు చాలామంది మనుష్యులు మనము ఏ కర్మ చేసినా, మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ
కావచ్చు దాని ఫలము తప్పకుండా లభిస్తుందని భావిస్తారు. ఉదాహరణానికి ఎవరైనా దాన
పుణ్యాలు చేస్తే, యజ్ఞము, హవనము చేస్తే, పూజలు పఠనాలు చేస్తే వారు మనము ఈశ్వరార్థము
చేసిన దానము పరమాత్ముని దర్బారులో జమ అవుతుందని, మనము మరణిస్తే దాని ఫలము
లభిస్తుందని, మనకు ముక్తి లభిస్తుందని భావిస్తారు. కాని ఇవన్నీ చేసినందున
సదాకాలానికి లాభము లభించిందని మనము తెలుసుకున్నాము. ఏ కర్మలు చేస్తామో వాటి వలన
క్షణభంగుర సుఖము తప్పకుండా ప్రాప్తి అవుతుంది. కాని ఎంతవరకు ఈ ప్రాక్టికల్ జీవితము
సదా సుఖవంతంగా అవ్వదో అంతవరకు దానికి ప్రతిఫలము లభించజాలదు. భలే మనము ఎవరినైనా మీరు
ఏమేమి చేస్తూ వచ్చారు, వాటి ద్వారా మీకు పూర్తి లాభం లభించిందా అని అడిగితే వారు
జవాబు చెప్పరు. ఇప్పుడు పరమాత్మ వద్ద జమ అయ్యిందో లేదో మనకేం తెలుసు? ఎంతవరకు మనము
మన ప్రాక్టికల్ జీవితంలో శ్రేష్ఠ కర్మలు చేయమో అంతవరకు ఎంత కష్టపడినా ముక్తి -
జీవన్ముక్తులు ప్రాప్తి చేసుకోలేము. అచ్ఛా. దాన-పుణ్యాలు చేశారు కానీ అవి చేసినందున
ఏ వికర్మలూ భస్మము అవ్వలేదు. మరి ముక్తి-జీవన్ముక్తులు ఎలా ప్రాప్తి అవుతాయి? భలే
ఇంతమంది సాధు-సత్పురుషులు మహాత్మలు ఉన్నారు, అయితే వారికి ఎంతవరకు కర్మల గురించిన
జ్ఞానము లేదో అంతవరకు వారు చేసే కర్మలు అకర్మలుగా అవ్వలేవు. వారు
ముక్తి-జీవన్ముక్తులను ప్రాప్తి చేసుకోలేరు. వారికి కూడా సత్యమైన ధర్మమేదో, సత్యమైన
కర్మ ఏదో తెలియదు. కేవలం నోటి ద్వారా రామ-రామ అంటూ ఉన్నందున ఎవ్వరికీ ముక్తి లభించదు.
పోతే మరణించిన తర్వాత ఏ లాభము లభిస్తుందో వారికి తెలియనే తెలియదు. ఏ లాభమూ లభించదు.
పోతే మనుష్యులు తమ జీవితంలో చెడు కర్మలు చేసినా, మంచి కర్మలు చేసినా అవన్నీ ఈ
జీవితంలోనే అనుభవించాలి. శుద్ధ కర్మలు చేసి ప్రాక్టికల్ జీవితాన్ని ఎలా తయారు
చేసుకోవాలనే జ్ఞానము ఇప్పుడు మనకు టీచరైన పరమాత్ముని ద్వారా లభిస్తోంది.