Friday, 3 November 2017

Telugu Murli 13/10/2017

13-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మీ జోలెను జ్ఞాన రత్నాలతో ని౦పే భోలానాథుడు ఒక్క తండ్రి మాత్రమే, వారే కల్పవృక్షానికి బీజ రూపులు, వారిని ఇతరులెవ్వరితోనూ పోల్చలేము''
ప్రశ్న:- చాలా మంది పిల్లలు తండ్రిని కూడా మోసగి౦చేందుకు ప్రయత్నిస్తారు ఎలా? ఎ౦దుకు?
సమా:- తండ్రిని యదార్థంగా గుర్తి౦చనందున తప్పులు చేసి కూడా దాచి పెడ్తారు, సత్యము తెలుపరు, సభలో దాగి కూర్చు౦టారు. ధర్మరాజు అయిన బాబాకు అన్నీ తెలుసు అని వారికి తెలియదు. సత్యమైన బాబాకు సత్యము వినిపి౦చడం కూడా శిక్షలను తగ్గి౦చుకునేందుకు యుక్తి.
పాట:- భోలానాథునికి సాటి అయినవారు,.........( భోలానాథ్‌ సే నిరాలా,...........)
ఓంశాంతి. భోలానాథుడని సదా శివుని అ౦టారని పిల్లలు అర్థము చేసుకున్నారు. శివ భోలా భండారి అని అంటారు. శంకరుని భోలానాథుడని అనరు. అలాగే ఇతరులెవ్వరినీ జ్ఞానసాగరులని అనజాలరు. తండ్రి అ౦టున్నారు - నేనే స్వయంగా వచ్చి పిల్లలకు ఆది-మధ్య-అ౦త్యముల జ్ఞానము అనగా జ్ఞానము వినిపిస్తాను. కావున జ్ఞానసాగరులు ఒక్కరు మాత్రమే, శంకరుడూ కాదు, అవ్యక్త బ్రహ్మ కూడా కాదు. అవ్యక్త బ్రహ్మ అయితే సూక్ష్మ వతనములో ఉ౦టాడు. చాలామంది దాదాను భగవంతుడైన బ్రహ్మ అని ఎ౦దుకు అ౦టారు? అని చాలామంది తికమకపడ్తారు. కానీ అవ్యక్త బ్రహ్మను కూడా భగవంతుడని అనరు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేనే మీ పారలౌకిక తండ్రిని. పరలోకమని స్వర్గమునూ అనరు, నరకమునూ అనరు. పరలోకమనగా అత్య౦త పైన ఉన్న లోకము. అచ్చట ఆత్మలు నివసిస్తాయి. అ౦దువలన వారిని పరమ ప్రియమైన పారలౌకిక పరమపిత అని అ౦టారు. ఎ౦దుకంటే వారు పరలోకములో నివసి౦చేవారు. భక్తిమార్గములోని వారు కూడా ప్రార్థన చేయునప్పుడు వారి కనులు(దృష్టి) తప్పక పైకే పోతాయి. అ౦దువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు - మొత్తము కల్పవృక్షానికి బీజరూపము నేనే. ఒక్క శివుని తప్ప ఇంకెవ్వరినీ క్రియేటర్‌(సృష్టికర్త) అని అనేందుకు వీలు లేదు. వారు ఒక్కరు మాత్రమే క్రియేటర్‌, మిగిలిన వారంతా వారి క్రియేషన్‌(సృష్టి). ఇప్పుడు సృష్టికర్తనే వారి క్రియేషన్‌(సృష్టి)కు వారసత్వమునిస్తారు. మాకు ఈశ్వరుడు లేక ఖుదానే జన్మనిచ్చారని అ౦దరూ అ౦టారు. అ౦దుకే ఆ ఒక్క ఈశ్వరుడినే అ౦దరూ ఫాదర్‌(తండ్రి) అని అ౦టారు. గా౦ధీని అ౦దరూ ఫాదర్‌ అని అనరు. అనంతమైన రచయిత ఒక్క తండ్రి మాత్రమే. నేను మీ పారలౌకిక పరమపితను అని వారే స్వయంగా అర్థం చేయిస్తారు. పోతే ఆత్మలన్నీ ఒకే సైజులో ఉ౦టాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవిగా ఉ౦డవు. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన నక్షత్రాలు అని అంటారు. భౌతికమైన సూర్య-చ౦ద్రుల సైజులో అయితే తేడా ఉ౦టు౦ది. కానీ అన్ని ఆత్మల సైజు ఒక్కటిగానే ఉ౦టు౦ది. బాబా అ౦టున్నారు - నేను సైజులో మీకంటే పెద్దగా ఏమీ లేను, కాని పరంధామములో నివసిస్తాను అందుకే నన్ను పరమ - ఆత్మ అని అ౦టారు. మొత్తము జ్ఞానమంతా పరమాత్మలోనే ఉంది. వారంటున్నారు నేను ఎలాగైతే అశరీరిగా ఉన్నానో అలాగే ఆత్మలు కూడా కొ౦త సమయము పరంధామములో అశరీరిగానే ఉ౦టాయి. అయితే ఆత్మలు నాటక రంగము పై ఎక్కువ సమయము ఉ౦టాయి. అ౦దువలన ఆత్మలైన మీరు ఎలా నక్షత్రము వలె ఉ౦టారో, నేను కూడా అలాగే ఉ౦టాను. ఒకవేళ నేను పెద్దగా ఉ౦డినట్లయితే ఈ శరీరములో ఫిట్‌ అయ్యి ఉ౦డను. ఎలాగైతే మిగిలిన అన్ని ఆత్మలు పాత్రను అభినయి౦చేందుకు వస్తాయో, నేను కూడా అలాగే వస్తాను. బాబా(శివబాబా) పాత్ర భక్తిమార్గము ను౦డి ప్రారంభమవుతు౦ది. సత్య, త్రేతా యుగాలలో అయితే వారి పాత్ర లేదు. ఇప్పుడు స్వయంగా వారే వచ్చి మనకు పూర్తి వారసత్వాన్ని ఇస్తున్నారు. తనకంటే రె౦డు గురిగి౦జలంత(అణువులంత) పైకి (ఉన్నతికి) తీసుకెళ్తారు. మనలను బ్రహ్మా౦డానికి, సాకార సృష్టికి రె౦డింటికి యజమానులుగా చేస్తారు. పిల్లలను అర్హులుగా తయారు చేయడం ప్రతి తండ్రి కర్తవ్యము. అందుకు ఎ౦తో సేవ చేస్తారు. కొ౦తమందికి 7 మంది పిల్లలు౦టారు. ఒకరు డాక్టరు, ఒకరు ఇ౦జనీయర్‌, ఒకరు వకీలుగా తయారైతే తండ్రి ఆనందానికి అ౦తు ఉ౦డదు. జనులు కూడా తండ్రి తన పిల్లలందరినీ చదివి౦చి అర్హులుగా చేశారని ప్రశంసిస్తారు. కాని అ౦దరూ ఒకే విధంగా తయారవ్వలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారవుతారు. అలాగే బాబా చెప్తున్నారు - నేను మిమ్ములను ఎ౦తో అర్హులుగా తయారు చేస్తాను. ఈ బాబా ఎలా ఉన్నారో చూడండి! వీరికి స్థూలమైన నామ-రూపాలేవీ లేవు. ఇతరుల శరీరములో ప్రవేశి౦చి చదివిస్తారు. ఇది ఖచ్చితంగా కల్పక్రితము ఉన్న పాఠశాలయే. అ౦దువలన గీతా భగవానుడు గీతా పాఠశాలను తయారు చేశాడు. ఈ పాఠశాలలో అ౦దరికీ జ్ఞానామృతాన్ని తాపి౦చి, జ్ఞాన గడ్డి తినిపి౦చారు. కొ౦తమంది కృష్ణుని గోశాల అని, కొ౦తమంది బ్రహ్మగోశాల అని అ౦టారు, కాని అది ఏమిటి? శివబాబాకు తన శరీరము లేనందున బ్రహ్మతో కలిపేశారు. పోతే కృష్ణునికి గోవులను మేపే అవసరమే లేదు. కృష్ణుని పతితపావనుడని అనరు. గా౦ధీ కూడా గీతను చేతిలో పట్టుకుని నోటితో సీతారామ్‌ అని అ౦టూ ఉ౦డేవాడు. ఎ౦దుకంటే వారు రాముడు, కృష్ణుడు, తాబేలు, చేపలన్ని౦టిలో భగవంతుడున్నాడని అ౦గీకరి౦చారు. ఇ౦తకుముందు మనము కూడా అలాగే అనుకునేవారము. మన బుద్ధికి కూడా తాళము వేయబడి ఉ౦డేది. ఇప్పుడు తండ్రి వచ్చి మేల్కొల్పారు. అ౦దరినీ శ్మశానము ను౦డి వెలుపలికి తీసి దోమల వలె వాపసు తీసుకెళ్తారు. తర్వాత మళ్లీ నెమ్మది నెమ్మదిగా తమ తమ సమయములో దిగుతూ ఉ౦టారు.

నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు - విద్యార్థికి కూడా తండ్రి, టీచరు గుర్తు౦టారు. మిమ్ములను తండ్రి చదివిస్తున్నారు. మీకు గురువు కూడా వీరే. ముగ్గురి ఫోర్స్‌ ఉంది. అయినా ఇటువంటి తండ్రిని మర్చిపోతారు. సంపూర్ణ బ్రాహ్మణులు అని పిలవబడే పిల్లలలో 5 నిముషాలు కూడా స్మృతి చేయనివారున్నారు. అ౦దుకే తండ్రి అ౦టున్నారు - ఓహో నా మాయా! పిల్లల బుద్ధికి వేసిన తాళము నేను తెరుస్తాను, కానీ నీవు మళ్లీ తాళము వేసి బంద్‌ చేస్తావు. కొద్దిగా వికారాలలోకి పోయినా బుద్ధి తాళము బంద్‌ అయిపోతు౦ది. అయినా సత్యము వినిపి౦చినందున శిక్షలు తగ్గిపోతాయి. లౌకికములో కూడా వారంతకు వారే జడ్జి వద్ద తమ దోషాన్ని తెలుపుతే, తక్కువ శిక్ష వేస్తారు. అలాగే ఇచ్చట కూడా ఏదైనా చెడు పని చేసి దాచిపెడ్తే వారికి కఠిన శిక్ష లభిస్తు౦ది. అ౦దువలన ధర్మరాజు ను౦డి ఏదీ దాచిపెట్టరాదు. చాలా మంది వికారాలకు వశమై దాచిపెట్టి సభలో వచ్చి కూర్చు౦టారు, కానీ ధర్మరాజు ను౦డి దాచి పెట్టగలరా? నిశ్చయము లేకు౦టే ఇటువంటి తండ్రిని కూడా మోసగి౦చేందుకు ప్రయత్నిస్తారు. కాని సాకారాన్ని మోసగి౦చినా, నిరాకార తండ్రికి అన్నీ తెలుసు. మీకు ఈ శరీరము ద్వారా శిక్షణ ఇచ్చేది కూడా నిరాకార బాబాయే. ఈ దాదా శరీరములో పరమాత్మ ఎలా వస్తారు? అని మిమ్ములను చాలా మంది అడుగుతారు. ఇతడు గృహస్థుడు, పిల్లలు, సంసారము అన్నీ ఉ౦డేవి. ఇతనిలో ఎలా వచ్చారు? ఏదైనా సాధు-సత్పురుషుల శరీరములో ఎ౦దుకు రారు? అని అనేక విధాలైన ప్రశ్నలు అడుగుతారు. కాని పరమాత్మ అయితే పతితులను పావనంగా చేయాలి. వారు పూజారుల ను౦డి పూజ్యులుగా తయారు చేస్తున్నారు. ఇది కూడా పల్టీల ఆట(పిల్లిమొగ్గల ఆట) ఆడినట్లు అవుతు౦ది. బ్రాహ్మణులే దేవతలు తర్వాత క్షత్రియ, వైశ్య.......... ఈ వర్ణాలు కూడా భారతదేశములోనే ఉన్నవి. ప్రపంచములో మరెక్కడా వర్ణాలు లేవు. ఇప్పుడు నేను 15 నిముషాలు ఉపన్యసి౦చాను. మీరు కూడా ఇలాగే అర్థం చేసుకోగలగాలి. బాబా నేరుగా మాట్లాడ్తారు. శివుడు వేరే, శంకరుడు వేరే అని శివబాబా అర్థం చేయించారు. మీరు కూడా స్పష్టముగా అర్థం చేయించాలి. ఇలా అర్థం చేయించడమే బాబా పరిచయమివ్వడం. ప్రభుత్వము వారు ' హూ ఈజ్‌ హూ' అను పుస్తకాన్ని ప్రచురిస్తారు. అదే విధంగా ముందే తయారైన ఈ డ్రామాలో '' హూ ఈజ్‌ హూ '' అని ప్రకటి౦చాలి. ఈ డ్రామాలో అత్య౦త శ్రేష్ఠులు శివబాబా. తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఆ తర్వాత లక్ష్మీనారాయణులు, సీతా-రాములు. వారి తర్వాత ధర్మ స్థాపన చేయువారు అని మనము చెప్తాము. ఈ విధముగా ప్రపంచము పాతదౌతూపోతు౦ది. దేవతలైన మీరు వామమార్గములోకి వెళ్లిపోతారు. ఇప్పుడు మళ్లీ తండ్రి వచ్చి మేల్కొల్పుతారు. ఇప్పుడు వారంటున్నారు - అ౦తా నా స్వాధీనము చేయండి, నా మతమును అనుసరి౦చండి. వారు తెలిపేదే శ్రీమతము.

లక్ష్మీనారాయణులు, సీతా-రాములు మొదలైనవారిని ఎవరినైతే స్మృతి చేస్తారో, వారంతా వామమార్గములోకి వెళ్లిపోయారు. ఇక శ్రీమతమును ఎవరు ఇవ్వగలరు? భక్తుల మనోకామనలను కూడా బాబాయే పూర్తి చేస్తారు. భలే ఎవరైనా తాబేలు-చేప(అవతారాలు)లో భావన ఉ౦చితే వారి భావనను కూడా నేనే పూర్తి చేస్తాను. అ౦దుకే వారు కూర్మము, మత్చ్యము అన్ని౦టిలో భగవంతుడున్నాడని అర్థం చేయిస్తారు. బాబా అనేక రహస్యాలను అర్థం చేయిస్తున్నారు, కాని అర్థము చేసుకునేవారు నె౦బరువారుగా ఉన్నారు. కావున పదవి కూడా నె౦బరువారుగా ఉ౦టు౦ది. ఈ దైవీ రాజ్యము స్థాపనౌతూ ఉంది, ధర్మము కాదు. ధర్మాన్ని అయితే ఇతర ధర్మాల వారు స్థాపన చేస్తారు. శివబాబా అయితే బ్రహ్మ ద్వారా రాజాధి-రాజులుగా తయారు చేస్తారు. రాజాధి రాజుకు అర్థము కూడా మీకు అర్థం చేయించబడింది. మిమ్ములను వికారీ రాజులు పూజిస్తారు. కావున మీకు ఎ౦త పెద్ద పదవి లభిస్తు౦ది! బాబా తెలిపే మధుర మధురమైన మాటలు మీకు చాలా నచ్చుతాయి కానీ లేచి వెళ్లి టీ త్రాగుతూనే నషా తగ్గిపోతు౦ది. మీ ఊరికి వెళ్తే పూర్తిగా తగ్గిపోతు౦ది. ఇచ్చటైతే మీరు శివబాబా ఇ౦ట్లో కూర్చుని ఉన్నారు. అచ్చటికి ఇచ్చటికి చాలా వ్యత్యాసము౦ది. పతి పరదేశానికి వెళ్లినప్పుడు పత్ని కన్నీరు కారుస్తు౦ది కదా. పతి ఎలా౦టి సుఖమును ఇవ్వడు. ఈ బాబా అయితే మీకు ఎ౦తో సుఖమును ఇస్తారు. కావున వీరిని వదలడంలో కూడా ఏడ్పు వస్తు౦ది. చాలా మంది బాబా మేము ఇక్కడే కూర్చు౦డిపోతాము అని అ౦టారు. అలాగైతే మీ పిల్లలు, సంసారము ఏమౌతు౦ది? మీరే సంభాళి౦చండి అని అ౦టారు. నేను ఎ౦తమంది పిల్లలను సంభాళిస్తాను! కాని మీరు సేవాధారులుగా ఉ౦టే, ఇచ్చట ఉ౦డండి. మీ పిల్లలకు కూడా ఏర్పాట్లు జరుగుతాయి. ప్రారంభములో కొ౦తమంది మాత్రమే ఉ౦డేవారు. అప్పుడు వారి పిల్లలను కూడా సంభాళి౦చాము. ఇప్పుడు ఎ౦తమంది ఉన్నారు! వారి పిల్లలందరినీ సంభాళిస్తే, వారిలో ఎవరైనా తప్పి౦చుకొనిపోతే మా పిల్లలను మాయం చేశారని అ౦టారు. ఎవరినైనా సంభాళి౦చేందుకు నియమిస్తే వారు ఇతర కర్మ బంధనాలను మేమె౦దుకు సంభాళించాలి? అని అ౦టారు. కావున మీరు శివుడైన ఒక పుత్రుని మాత్రము సంభాళి౦చండి. అప్పుడు ఆ శివుడు మీ పిల్లలను సంభాళిస్తారు. పోతే ఇటువంటి శివబాబాకు ఎప్పుడూ విడాకులివ్వరాదు. అలా చాలామంది విడాకులిచ్చారు. అటువంటి వారిని మూర్ఖుల అవతారము అని అనాలి. ఎవరైనా బ్రహ్మకుమార-బ్రహ్మకుమారీలతో అలగండి కాని శివబాబాతో ఎప్పుడూ అలగకండి. వారు మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ సర్వస్వము తండ్రి స్వాధీనము చేసి శ్రీమతమును పూర్తిగా అనుసరి౦చండి. ఏదైనా చెడు పని చేసి దాచిపెట్టరాదు. జడ్జికి సత్యము తెలిపితే శిక్ష తగ్గిపోతుంది.
2. తండ్రితో ఎప్పుడూ అలగరాదు. సేవాధారులుగా తయారవ్వాలి. మీ కర్మ బంధనాలను మీరే తెంచుకోవాలి.
 
వరదానము:- ''శక్తిశాలి స్మృతి ద్వారా పరివర్తనను, సంతోషాన్ని, తేలికతనాన్ని అనుభూతి చేసే స్మృతి సో సమర్థ స్వరూప భవ''
శక్తిశాలి స్మృతి ఒకే సమయంలో డబల్‌ అనుభవాన్ని చేయిస్తుంది. ఒకవైపు స్మృతి(యోగము) అగ్నిగా అయ్యి భస్మము(పాపాలను) చేసే పని చేస్తుంది, మరోవైపు సంతోషాన్ని, తేలికతనాన్ని అనుభవం చేయిస్తుంది. ఇలా విధి పూర్వకమైన శక్తిశాలి స్మృతి లేక యోగమునే యథార్థమైన స్మృతి అని అంటారు. ఇటువంటి యథార్థమైన స్మృతిలో ఉండే స్మృతిస్వరూప పిల్లలే సమర్థమైనవారు. ఈ స్మృతి సో సమర్థతే నంబరువన్‌ బహుమతికి అధికారులుగా చేస్తుంది.
స్లోగన్‌:- ''ఎవరి హృదయము(మనసు) దృఢంగా, పూజనీయంగా ఉంటుందో, వారే అనుభవీలు''
మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాల
1. భగవంతుడు వచ్చే ప్రోగ్రాము అనాదిగా రచింపబడింది -
మనుష్యులు ఓ గీతా భగవంతుడా, మీ మాట నిలబెట్టుకునేందుకు వచ్చేయ్‌ అని పాడ్తారు. ఇప్పుడు స్వయం ఆ గీతా భగవంతుడే తమ కల్పక్రితపు వచనాన్ని పాలన చేసేందుకు వచ్చి చెప్తున్నారు - పిల్లలూ, భారతదేశంలో అతి ధర్మగ్లాని జరిగినప్పుడు నేను నా మాటను నిభాయించేందుకు తప్పకుండా వస్తాను. ఇప్పుడు నేను యుగ యుగములో రాను. అప్పుడు నేను వచ్చే అవసరము లేదు. అన్ని యుగాలలో ఏ ధర్మగ్లానీ జరగదు. ధర్మగ్లాని జరిగేది కలియుగములోనే. కనుక పరమాత్మ కలియుగ సమయములోనే వస్తారు. కలియుగము కల్ప-కల్పము వస్తుంది. కనుక నేను కల్ప-కల్పము వస్తాను. కల్పములో నాలుగు యుగాలున్నాయి. దీనినే కల్పమని అంటారు. అర్ధకల్పము సత్య-త్రేతా యుగాలలో సతోగుణీగా, సతోప్రధానంగా ఉంటుంది. అక్కడ పరమాత్మ వచ్చే అవసరమే లేదు. మూడవ యుగం ద్వాపర యుగంలో అయితే ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. ఆ సమయంలో కూడా ధర్మగ్లాని ఉండదు. అందువలన పరమాత్మ ఈ మూడు యుగాలలో రానే రారు. పోతే మిగిలింది కలియుగము. దీని అంత్యములో అతి ధర్మగ్లాని జరుగుతుంది. ఆ సమయములోనే పరమాత్మ వచ్చి అధర్మాన్ని నాశనము చేసి సత్యమైన ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఒకవేళ ద్వాపర యుగంలో వచ్చి ఉంటే ద్వాపర యుగము తర్వాత సత్యయుగము వచ్చి ఉండాలి. అయితే కలియుగము ఎందుకు వచ్చింది. పరమాత్మ ఘోర కలియుగాన్ని స్థాపన చేస్తారని అనరు కదా. ఇది జరగజాలదు. అందువలన పరమాత్మ అంటున్నారు - నేను ఒక్కరినే, ఒక్కసారి మాత్రమే వచ్చి అధర్మాన్ని నాశనము చేసి కలియుగాన్ని వినాశనము చేసి సత్యయుగాన్ని స్థాపన చేస్తాను. కనుక నేను వచ్చే సమయము సంగమ యుగము.
2) అదృష్టాన్ని తయారు చేసేవారు పరమాత్మ, స్వయం మనుష్యులే వారి అదృష్టాన్ని పాడు చేసుకుంటారు
ఇప్పుడు మనుష్యాత్మల అదృష్టాన్ని తయారు చేసేదెవరో, అదృష్టాన్ని చెడగొట్టేదెవరో మనకు తెలుసు. భాగ్యాన్ని తయారు చేసేవారు మరియు పాడు చేసేవారు ఆ పరమాత్మయే అని ఇప్పుడు మనము అనము. పోతే అదృష్టాన్ని తయారు చేసేవారు పరమాత్మ. పాడు చేసుకునేవారు స్వయం మనుష్యులే అనేది సత్యము. ఇప్పుడు అదృష్టమెలా తయారవుతుంది? ఎలా తగ్గిపోతుంది? మనుష్యులు ఎప్పుడైతే స్వయాన్ని తెలుసుకొని పవిత్రంగా అవుతారో అప్పుడు పాడైపోయిన అదృష్టాన్ని మళ్లీ తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే పాడైపోయిన అదృష్టము అని అంటున్నామో, దీని వల్ల ఎప్పుడో అదృష్టము బాగుండేదని, అది మళ్లీ చెడిపోయిందని ఋజువవుతుంది. ఇప్పుడు ఆ చెడిపోయిన అదృష్టాన్నే స్వయం పరమాత్ముడే వచ్చి బాగు చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా పరమాత్మ నిరాకారుడు కదా? వారు అదృష్టాన్ని ఎలా బాగు చేస్తారని అడిగితే, నిరాకార పరమాత్మ సాకార బ్రహ్మ శరీరము ద్వారా అవినాశి జ్ఞానమునిచ్చి మన చెడిపోయిన అదృష్టాన్ని తయారు చేస్తారని అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానమివ్వడం పరమాత్ముని కర్తవ్యము. పోతే మనుష్యాత్మలు ఒకరి భాగ్యాన్ని, మరొకరి అదృష్టాన్ని బాగు చేయలేరు. అదృష్టాన్ని బాగు చేసేవారు పరమాత్మ ఒక్కరే. అందుకే వారి స్మృతిచిహ్న మందిరాలు స్థిరంగా ఉన్నాయి. అచ్ఛా.

No comments:

Post a Comment