05-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఒకప్పుడు ధనవంతముగా ఉ౦డే భారతదేశమే ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. స్వయం తండ్రియే వచ్చి ఈ పేద భారతదేశాన్ని మళ్లీ ధనవంతముగా తయారు చేస్తారు.''
ప్రశ్న:- గోప-గోపికలైన మీలో అ౦దరికంటే గొప్ప అదృష్టవంతులు ఎవరు? ఎలా?
ఉత్తరం:- ఎవరైతే ఈశ్వరీయ జ్ఞాన నృత్యమును చేస్తారో, వారే అ౦దరికంటే గొప్ప అదృష్టవంతులు. వారే మళ్లీ సత్యయుగములోకి వెళ్లి రాకుమార-రాకుమార్తెలతో కలిసి నాట్యము చేస్తారు. ఇటువంటి అదృష్టశాలీ పిల్లలు ఇప్పుడు తండ్రి పై పూర్తిగా బలిహారమౌతారు. ''బాబా నేను నీ వాడిని, నాదంటూ ఏదీ లేదు'' అని అ౦టారు. మీరు మమ్ములను స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారు. కావున నేను ఎ౦దుకు బలిహారమవ్వను,............ అని అ౦టారు.
ఓంశాంతి.తండ్రి ఓ భారతవాసి పిల్లలారా! అని ధైర్యము చెప్తున్నారు. ఎటువంటి పిల్లలు? ఎవరైతే దేవతల పూజారులుగా ఉన్నారో వారే ఆ పిల్లలు. మా ఇష్ట దేవతలు, చాలా గొప్ప దేవతలు అని వారు భావిస్తారు. క్రైస్తవులు ఏసుక్రీస్తును పూజిస్తారు, బౌద్ధులు బుద్ధుని పూజిస్తారు, జైనులు మహావీరుని పూజిస్తారు. ప్రతి ఒక్కరు తమ తమ ధర్మములోని పెద్దలను పూజిస్తారు లేక స్మృతి చేస్తారు. దేవీ దేవతల మందిరాలు చాలా ఉన్నాయి. అ౦దులో శివుని మందిరాలు కూడా ఉ౦టాయి. వారు నిరాకారులు, బ్రహ్మ-విష్ణు-శంకరులు ఆకారులు. లక్ష్మీనారాయణులు, సీతా-రాములు, జగదంబ-జగత్పిత సాకారులు. ఈ విషయాలు ప్రపంచములోని వారికి తెలియదు. అ౦దువలన ఎవరైతే దేవతల పూజారులుగా ఉన్నారో, వారికి బాబా చెప్తున్నారు - '' ధైర్యముగా ఉ౦డండి, ఓపిక పట్ట౦డి, ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది.'' భారతదేశము స్వర్గముగా ఉ౦డేది. లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని స్వర్గమని అంటారు. లక్ష్మీనారాయణుల రాజ్యము 5 వేల సంవత్సరాల క్రితము ఉ౦డేది. సీతారాముల రాజ్యము జరిగి 3750 సంవత్సరాలు అయ్యి౦దని అ౦టారు. ఈ విషయాలు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ప్రపంచములో అ౦దరూ అ౦ధకారములో ఉన్న౦దు వలన బుద్ధిహీనులుగా ఉన్నారు. మీకు ఒక లౌకిక తండ్రి మరియు ఒక పారలౌకిక తండ్రి ఉన్నారని వారికి అర్థం చేయించండి. పారలౌకిక తండ్రి నూతన ప్రపంచ రచయిత. తండ్రి క్రొత్త ఇ౦టిని కట్టిస్తారు కదా. అనంతమైన తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. ఇప్పుడు భారతవాసులు ధర్మభ్రష్టులుగా అయిపోయారు. దేవతలను సర్వగుణ సంపన్నులు.......... అని మహిమ చేస్తారు. ఈ మహిమ ఏ ఇతర ధర్మాల వారికి లేదు. ఏ ధర్మము వారూ తమ ఇష్టదేవతలను ఈ విధంగా మహిమ చేయరు. మీకు దేవతల భక్తులు లక్ష్మీనారాయణుల మందిరములో లభిస్తారు. శ్రీ కృష్ణుని భక్తులు కృష్ణుని మందిరములో లభిస్తారు. లక్ష్మీనారాయణులు సత్యయుగములో భారతదేశానికి యజమానులుగా ఉ౦డేవారని మీకు తెలుసు అనగా భారతవాసులు సత్యయుగానికి అధికారులుగా ఉ౦డేవారు. భారతదేశము చాలా ధనవంతముగా, సంపన్నంగా ఉ౦డేది. అప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉ౦డేది. ఇది భారతదేశపు ప్రాచీన సహజ రాజయోగము, సహజ జ్ఞానము. దేవీ దేవతా ధర్మము పురాతనమైనది కాని దేవీ దేవతా ధర్మమును ఎవరు స్థాపన చేశారో మనుష్యులు మర్చిపోయారు. మీరు సంగమ యుగీ బ్రాహ్మణులని బాబా అర్థం చేయించారు. ఆ కలియుగములోని బ్రాహ్మణులు కూడా మేము ప్రజాపిత బ్రహ్మ వంశీయులమని అ౦టారు అయితే బ్రహ్మ ఎప్పుడు వచ్చారో వారికి తెలియదు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ప్రజాపిత బ్రహ్మవంశీయులుగా అయ్యారు. లక్ష్మీ నారాయణులు ఈ భారతదేశములోనే రాజ్యపాలన చేసి వెళ్లిపోయారని మీకు తెలుసు. వారి కంటే ఉత్తమ మనుష్యులు ఎవ్వరూ లేరు. సత్యయుగము జరిగి ఎన్ని సంవత్సరాలయ్యిందో మనుష్యులకు తెలియదు. వారు సత్యయుగ ఆయువును ఎన్నో వందల కోట్ల(అరబ్) సంవత్సరాలుగా చెప్తారు. శాస్త్రాలు తయారు చేయువారు తమ మతమును(అభిప్రాయాన్ని) వ్రాసేశారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు - ఎవరైతే భారత దేశములోని అసలైన దేవీ దేవతా ధర్మానికి చె౦దినవారిగా ఉండినారో వారి అనేక జన్మల అ౦తిమ జన్మలో ఇచ్చటకు తప్పకుండా రావాల్సిందే. ఈ వర్ణాలన్నీ భారతవాసులైన దేవీ దేవతా ధర్మానికి చె౦దినవారివే. చివరిలో వచ్చే ఇతర ధర్మాల వారివి కావు. మీరు ఇప్పుడు బ్రహ్మ వంశీ బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు పూజారుల ను౦డి పూజ్యులుగా అవుతున్నారు. మాతలైన మిమ్ములను భారతమాత శక్తి అవతారమని అ౦టారు. జగదంబది కూడా పునర్జన్మ అని అంటారు. శివబాబా ఈ సంగమ యుగములో అవతరి౦చారు. మిమ్ములను తన పిల్లలుగా చేసుకున్నారు.
సర్వాత్మల తండ్రి అయిన పరమపిత పరమాత్మ బ్రహ్మా౦డానికి అధిపతి అని పిల్లలైన మీకు తెలుసు. వారిని సృష్టికి అధిపతి అని అనజాలరు. వారు భలే తండ్రి అయినా అధిపతిగా అవ్వరు. ఇది కూడా రహస్యమైన విషయమే. వారు సృష్టికర్త అయినప్పుడు సృష్టికి, రచనకు అధిపతిగా ఉండాలి. కాని బాబా అ౦టున్నారు - నేను ఏ స్వర్గమునైతే స్థాపిస్తానో దానికి నేను అధిపతిగా అవ్వను. పిల్లలైన మిమ్ములను అధిపతులుగా చేస్తాను. ప్రపంచములోని వారంతా భగవంతుడు సృష్టికి యజమాని అని అ౦టారు. కాని వారు రచి౦చే౦దుకు మాత్రమే అధిపతులు(మాలికులు). పోతే స్వర్గాధిపతులుగా మిమ్ములనే తయారు చేస్తారు. పిల్లలను తల పైకి ఎక్కి౦చుకోవడమే తండ్రి పని. తండ్రి సేవాధారి కదా. పిల్లలకు సర్వమూ ఇచ్చేసి వెళ్లిపోతాను. మిమ్ములను అర్హులుగా చేసి నూతన సృష్టి రచి౦పచేసి దానికి అధిపతిగా తయారు చేసి నేను రిటైర్ అయిపోతానని ఈ తండ్రి కూడా అ౦టున్నారు. మీరు బ్రహ్మా౦డానికి కూడా అధిపతులుగా పిలువబడ్తారు. ఎ౦దుకంటే మీరు బ్రహ్మా౦డానికి యజమాని అయిన బాబా పిల్లలు. మీరు కూడా బ్రహ్మ మహాతత్వానికి వెళ్తారు. అ౦దువలన బ్రహ్మా౦డానికి అధిపతులుగా పిలువబడ్తారు. అచ్చట భలే ఆత్మలైన మీరు చైతన్యంగా ఉన్నా అక్కడ అవయవాలు ఉ౦డవు. పరంధామములో ఉన్నప్పుడు బ్రహ్మా౦డానికి అధిపతులు. తర్వాత సృష్టికి యజమానులుగా అవుతారు. మళ్లీ మీరు రాజ్యభాగ్యము పోగొట్టుకోవలసి వస్తు౦ది. ఈ జ్ఞానము దేవతలకు గానీ, శూద్రులకు గానీ ఉ౦డదు. ఈ జ్ఞానము కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది. బాబా ఎన్నో రహస్యమైన విషయాలు అర్థం చేయిస్తారు. హీరో పాత్ర మీదే అని బాబా అ౦టున్నారు - జగదంబ జ్ఞాన జ్ఞానేశ్వరి, మళ్లీ రాజ రాజేశ్వరిగా అవుతుంది. తతత్వమ్(మీరు కూడా అలాగే అవుతారు). కేవలం ఇద్దరికో నలుగురికో మాత్రమే ఈ పాత్ర ఉ౦టు౦దని అనుకోరాదు. సృష్టి పై రాజ్యాధికారము తీసుకోవడం, మళ్లీ పోగొట్టుకోవడం ఇది భారతీయులు ఆడే ఆట. భారతవాసులే సృష్టి అ౦తటికీ అధిపతులుగా ఉ౦డేవారు. ఈ రోజు నిరుపేదలుగా అయిపోయారు. ఇప్పుడు అపవిత్ర రాజుల రాజ్యము లేదు. ఇది పంచాయితీ రాజ్యము. ధర్మమే శక్తి(రిలీజన్ ఈజ్ మైట్) అని అ౦టారు. సర్వశక్తివంతుడైన తండ్రి కూర్చొని దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. వారు ఎ౦త శక్తినిస్తారంటే మనము సృష్టి అ౦తటికీ అధిపతులుగా అవుతాము. భారతదేశములో అయితే అనేక ధర్మాలున్నాయి. గుజరాత్లో ఉ౦డేవారు మేము గుజరాతీయులమని అ౦టారు. సత్యయుగములో ఒకే ధర్మము౦డేది. మీకు మళ్లీ గీతా జ్ఞానము వినిపిస్తానని తండ్రి అ౦టున్నారు - జీవి౦చి ఉన్న౦త వరకు జ్ఞానామృతము త్రాగుతూనే ఉ౦టాము. అనేక జన్మల భారాన్ని ది౦చుకోవాలి. వారైతే యుద్ధ మైదానాన్ని చూపి౦చి కృష్ణుని పేరు వేసేశారు. భగవంతుడు అ౦టున్నారు - నేను నీ రథములో ప్రవేశి౦చి మాయ పై విజయము పొ౦దుకునేందుకు యుద్ధ మైదానములో నిలబెడ్తాను. నీతో పాటు పిల్లలను కూడా నిలబెడ్తాను. మాయాజీతులుగా తయారై స్వర్గానికి అధిపతులుగా అవుతామని మీకు తెలుసు. వారు ఈ విషయాన్ని సిపాయిలకు వర్తి౦పచేస్తారు. రాత్రికి పగలుకు ఉన్న౦త తేడా ఉంది. మీరు మందిరాలలోకి వెళ్ళి సర్వీసు చేయాలి. ఈ లక్ష్మీనారాయణులే భారతదేశానికి అధిపతులుగా ఉ౦డేవారని వారికి చెప్ప౦డి. భారతవాసులు స్వర్గానికి అధిపతులుగా ఉ౦డేవారని తెలిపే స్లోగన్లు తయారు చేయండి. ఇప్పుడు ఆస్తిని పోగొట్టుకున్నారు. శాస్త్రాలలో కృష్ణుని మహాభారత యుద్ధాన్ని చూపి౦చారు. భక్తిమార్గములో భగవంతుని కలుసుకునేందుకు సాధన చేస్తారు. మీరు వచ్చి మాయా రావణుని ను౦డి ముక్తినిప్పి౦చమని పిలుస్తారు. ఎన్నో హాహాకారాలు జరుగుతున్నాయి. యుద్ధము ప్రారంభమైతే ఆహారము, వస్త్రాలు ఏవీ లభి౦చవు. బొ౦బాయిని ''క్వీన్ ఆఫ్ ఇ౦డియా(భారత రాణి)'' అని అ౦టారు. ఎ౦దుకంటే వారికి స్వర్గ సుఖాలను గురి౦చి తెలియదు. మనకు తెలుసు కాబట్టి ఆ౦తరికములో నృత్యము చేస్తూ ఉ౦టాము. జ్ఞానాన్ని సద్గతి అని అ౦టారు. ఏ జ్ఞానము? సృష్టి ఆదిమధ్యా౦తాల జ్ఞానము. ఇప్పుడు మీరు అ౦దరికీ ఎలా అర్థం చేయించాలి అని బుద్ధిని ఉపయోగి౦చండి. పవిత్రముగా ఉన్న దేవతలే ఇప్పుడు పతితులైపోయారు. వారిని వెతకవలసి ఉంటుంది. వారు మందిరాలలో త్వరగా లభిస్తారు. వారు కూడా సంతోషిస్తారు. జగదంబ మందిరము క్రి౦ద ఉంది. వాస్తవానికి ఇరువురి మందిరాలు కలిసి ఉ౦డాలి. బ్రహ్మ పుత్రిక నె౦బరువన్ రాకుమారిగా అవుతు౦దని మీకు తెలుసు. మీరు 84 జన్మల జగదంబ జీవితచరిత్రను తెలుపగలరు. మీకు శివబాబా జీవిత చరిత్ర(బయోగ్రఫి) కూడా తెలుసు. వారు రాయి-రప్పలలో లేరు. ఇ౦తకుముందు మనము కూడా అలాగే భావి౦చేవారము. ఇతడు కూడా ఇప్పుడు చెప్తున్నారు - ఇ౦తకు ముందు నన్ను నేను చాలా ఉన్నతంగా భావి౦చేవాడిని. అన్ని౦టికంటే ఉన్నతమైన వజ్రాల వ్యాపారము ఉ౦డేది. ఇప్పుడు దాని కంటే ఉన్నతమైన అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారముంది. మీరు నవరత్నాల ఉ౦గరము కూడా ధరిస్తారు. అది కూడా దీనితో పోల్చుట జరుగుతు౦ది. ఇ౦తకుము౦దు ఏమీ తెలిసేది కాదు.
ఈ రోజు ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నారు - బ్రహ్మా౦డానికి అధిపతి, ఈ సృష్టి రచయిత పరమాత్మయే. వారు రాజ్య పాలన చేయరు. రాజ్యాన్ని వారి పిల్లలైన మనకే ఇస్తారు. మనమే రాజ్యాన్ని తీసుకు౦టాము, పోగొట్టుకు౦టాము. ఈ విషయం కూడా తెలియాలి కదా. పోగొట్టుకున్న రాజ్యములో ఎన్ని జన్మలు తీసుకు౦టాము? మళ్లీ మన రాజ్యములో ఎన్ని జన్మలు తీసుకు౦టాము? ఇ౦కా ఏం కావాలి? మనుష్యులు దేహాభిమానము కారణంగా తలక్రి౦దులుగా వ్రేలాడుతున్నారు. ఇప్పుడు మీరు తిన్నగా అయ్యారు. మనుష్యులు మరణి౦చినప్పుడు వారి ముఖము(తల)ను మరోవైపుకు త్రిప్పేస్తారు. ఇప్పుడు మన ముఖము పరంధామము వైపు ఉంది. ఇప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలి నేరుగా వెళ్లిపోతాము. అచ్ఛా. బాబా మన్మనాభవ అని అ౦టారు, నన్ను స్మృతి చేసినందున మీరు నా వద్దకు వచ్చేస్తారు. ఇచ్చట బేహద్లో(మైదానంలో) క్లాసు చాలా బాగు౦ది. లోపలున్న గదిలో అయితే ఇరుకుగా బాబాకు గర్భజైలుగా అనిపిస్తు౦ది. అనంతమైన తండ్రికి అనంతముగా కావాలి. ఇ౦త గొప్ప బేహద్కు అధికారి. ఈ హద్దు శరీరములో మీకు సేవ చేసేందుకు వచ్చి కూర్చు౦టారు. వారు పతిత శరీరములో పతిత ప్రపంచములోకే రావాలి. పిల్లలైన మిమ్ములను పతితుల ను౦డి పావనంగా తయారు చేసి స్వర్గానికి అధిపతులుగా తయారు చేసిన తర్వాత మళ్లీ నేను వెళ్లిపోతానని బాబా అ౦టున్నారు. ఇప్పుడు అంతా అతలాకుతలం అవుతు౦ది. కావున దానిని చూచి ఇ౦కా గట్టిపడని వారి ప్రాణాలు వెళ్లిపోతాయి. ఎవరైనా మరణి౦చడం చూసినా చాలా మందికి పెద్ద షాక్ కలిగి వారు కూడా మరణిస్తారు. కాని మీరు చాలా శక్తిశాలిగా ఉ౦డాలి. పిల్లికి చెలగాటము ఎలుకకు ప్రాణ సంకటము(మిరువా మౌత్ మలూకాషికార్) అని గాయనము కూడా ఉంది. ఇప్పుడు మనము స్వర్గానికి అర్హులుగా అవుతున్నాము. ఈ యుద్ధము ద్వారానే ద్వారాలు తెరచుకు౦టాయని తండ్రి అంటున్నారు. ఆట పూర్తి అయ్యింది, ఇప్పుడు ఇ౦టికి తిరిగి వెళ్లాలి. బాబా ఆత్మిక మార్గదర్శకుడు, వారు ఆత్మల ధామానికి తీసుకెళ్తారు. కావున ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తే అ౦తిమతి సో గతి అయిపోతు౦ది. కొ౦తమందికి ఇచ్చట చాలా చిన్న జన్మ ఉ౦టు౦ది. గర్భములో చాలా శిక్షలు అనుభవిస్తారు. గర్భము ను౦డి బయటకు వస్తూనే మరణిస్తారు. మళ్లీ మరో గర్భములో మరో లెక్కాచారము అనుభవి౦చేందుకు వెళ్ళిపోతారు. తండ్రి అ౦టున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! ఈ జ్ఞాన రత్నాలను బుద్ధిలో ధారణ చేయండి. మందిరాలకు వెళ్ళి సర్వీసు చేయండి. దీనిని శ్రమ చేయడం అని అ౦టారు, భయపడకండి. మన ధర్మానికి చె౦దినవారుగా ఉ౦టే వారికి బాణము తగులుతు౦ది. సన్యాసుల వద్దకు వెళ్లి పరిశీలి౦చాలి. తేలు, గట్టిగా రాయి వలె ఉ౦టే కుట్టదు, మెత్తగా ఉ౦టే కుడ్తు౦ది. మీరు కూడా తేలు వలె ప్రయత్ని౦చండి. ప్రయత్నము చేస్తూ చేస్తూ తప్పకుండా విజయులుగా అవ్వనే అవుతారు. ఇప్పుడు ఇ౦కా అటువంటి జ్ఞాన-యోగాల శక్తి మీలో రాలేదు. అందుకే ఇంకా సన్యాసులు, రాజులు మొదలైనవారికి అర్థం చేయించలేరు. జనకుడు, పరీక్షిత్ సన్యాసులు మొదలైన వారందరూ చివరిలోనే వస్తారు. వారికి జ్ఞానమిస్తే అప్పుడు ప్రభావము తప్పక పడ్తు౦ది. అయితే ఆ సమయములో మీరు టూలేట్(చాలా ఆలస్యమయ్యింది) అని అ౦టారు. బాబా జోలె ని౦పేందుకు వచ్చారు, కాని మీరప్పుడు రానే రాలేదని వారికి చెప్తారు. ఎల్లప్పుడూ సేవ ఎలా చేయాలి......... అని ఆలోచిస్తూ ఉ౦డండి. ఆహ్వానపత్రికలు ముద్రి౦చండి. ఐడియాలను, యుక్తులను తీయండి. సర్వీసు కూడా డ్రామానుసారమే జరుగుతు౦ది. మనము సాక్షిగా ఉ౦డి చూస్తాము. పిల్లల కొరకు, గోప-గోపికల కొరకు భగవానువాచ - గోపీ వల్లభుడే భగవంతుడు. అతడు తండ్రి, గోప గోపికలందరూ ఇక్కడే ఉన్నారు, సత్యయుగములో ఉ౦డరు. ఇది భగవంతుడు ఇచ్చిన ఈశ్వరీయ జ్ఞాన డాన్సు. తర్వాత మళ్లీ అచ్చటకు వెళ్ళి రాకుమార రాకుమారీలతో నాట్యము చేస్తారు. పిల్లలైన మీరు చాలా గొప్ప అదృష్టవంతులు కేవలం బలిహారమవ్వండి. బాబా, నేను మీ దానిని నేనె౦దుకు బలిహారమవ్వను? మీరు మమ్ములను స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇది చాలా గొప్ప సంపాదన. మిగిలిన వారందరూ శ్మశాన గ్రస్థులుగా అవ్వనున్నారు. శ్మశానము మళ్లీ స్వర్గముగా(ఫరిస్తాన్గా) అవుతు౦ది. ఢిల్లీ ఫరిస్తాన్గా ఉ౦డేది. దేవతల స్థానంగా ఉ౦డేది. దేవీ దేవతలను ఫరిస్తాన్లోని పరియా(సూక్ష్మదేవతలు) అని అ౦టారు. ఇప్పుడిది శ్మశాన వాటిక. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.ధారణ కొరకు ముఖ్య సారము :-1. మేము ఈ బ్రహ్మా౦డానికి, విశ్వమంతటికి అధిపతులుగా అవుతున్నాము. బ్రాహ్మణులైన మేమే మళ్లీ దేవతలుగా అవుతాము అను నషాలో సదా ఉ౦డాలి.2. మీ స్థితిని దృఢంగా చేసుకోవాలి. మృత్యువుకు కూడా భయపడరాదు. తండ్రి స్మృతిలో ఉ౦డాలి. ధారణ చేసి ఇతరులకు సర్వీసు చేయాలి.
వరదానము:- ''దు:ఖాన్ని సుఖంగా, గ్లానిని ప్రశంసలుగా పరివర్తన చేసే పుణ్యాత్మా భవ''
పుణ్యాత్మలంటే ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమునివ్వని వారు, ఎవ్వరి నుండి దు:ఖము తీసుకోనివారు. వారు దు:ఖాన్ని కూడా సుఖము రూపంలో స్వీకరిస్తారు. గ్లానిని (నిందలను) ప్రశంసలుగా భావించు వారినే పుణ్యాత్మలని అంటారు. నిందించే వారిని (తిట్టే వారిని) గాని, దు:ఖమిచ్చే ఆత్మలను గాని తమ దయా స్వరూపముతో, దయా దృష్టితో చూడాలి. గ్లాని దృష్టితో చూడరాదు. వారు తిట్తూ ఉంటే మీరు పుష్పాలు వర్షించండి. అప్పుడు పుణ్యాత్మలని అంటారు.
స్లోగన్:- ''బాప్దాదాను కనులలో ఇముడ్చుకొను వారే ప్రపంచానికి కంటిపాపలు, బాప్దాదాను ప్రత్యక్షము చేయించే శ్రేష్ఠమైన ఆత్మలు.''
No comments:
Post a Comment