19-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - తండ్రికి సహాయకులై నూతన ప్రపంచము కొరకు అందరిచే పురుషార్థము
చేయించండి - ఎలాగైతే స్వయం నాలెడ్జ్ఫుల్గా తయారయ్యారో, అలా ఇతరులను కూడా
తయారు చేస్తూ ఉండండి ''
ప్రశ్న:- పిల్లలైన మీరు ఇప్పుడు ఏ స్మృతిలో ఉండాలి? స్మృతి చేసే అద్భుతము ఏది?
సమా:- ఇప్పుడు
మీకు లభించిన బీజము, వృక్షముల జ్ఞానము ఏదైతే ఉందో, ఆ జ్ఞానము స్మృతిలో
ఉండాలి. ఈ స్మృతి ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అయిపోతారు - స్మృతి చేసే
చమత్కారము ఇదే. తండ్రి పిల్లలకు స్మృతిని ఇప్పిస్తున్నారు - పిల్లలూ!
జ్ఞాపకం వచ్చిందా మీరు అర్ధకల్పము చాలా భక్తి చేశారు. ఇప్పుడు నేను మీకు
భక్తికి ఫలం ఇచ్చేందుకు వచ్చాను. మీరు మళ్లీ వైకుంఠానికి యజమానిగా అవుతారు.
ఎలాగైతే తండ్రి మధురమో - అలా తండ్రి జ్ఞానము కూడా మధురమే. ఆ జ్ఞానాన్ని
స్మరణ చేసి స్మరిస్తూ - స్మరిస్తూ సుఖం పొందాలి.
పాట:- మేలుకోండి, ప్రేయసులారా! మేలుకోండి,........... ( జాగ్ సజనియా జాగ్,..............)
ఓంశాంతి. మధురాతి
మధురమైన పిల్లలు పాట విన్నారు. నేడు దీపమాల(దీపావళి), దీపమాల అని కొత్త
యుగాన్ని అంటారు. సత్యయుగంలో ఏ దీపావళి పండుగను జరుపుకోరు ఎందుకంటే అక్కడ
అందరి ఆత్మ రూపీ జ్యోతి వెలిగే ఉంటుంది. మనము క్రొత్త ప్రపంచంలో రాజ్య
భాగ్యం తీసుకునే పురుషార్థము శ్రీమతం అనుసారంగా చేస్తున్నామని పిల్లలైన
మీకు తెలుసు. ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. త్రికాలదర్శి అని
పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్(భూత, వర్తమాన, భవిష్యత్తు) తెలిసిన వారిని
అంటారు. మీకిప్పుడు మూడు కాలాల జ్ఞానముంది కనుక మీరు ఇతరులకు కూడా అర్థం
చేయించాలి. స్వయం మీరు కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. అలా ఇతరులను
కూడా తయారు చేయాలి. గత చరిత్ర-భూగోళము గురించి తెలియడం ద్వారా భవిష్యత్తులో
ఏమి జరుగుతుందో కూడా తెలుసుకున్నారు. భవిష్యత్తు తెలియడం ద్వారా భూత,
వర్తమానాలు కూడా తెలుసుకుంటారు - దీనినే నాలెడ్జ్ఫుల్ అని అంటారు.
కలియుగము గతించిపోయింది, ఇప్పుడిది సంగమ యుగము. భవిష్యత్తులో మళ్లీ
సత్యయుగము, త్రేతా యుగము రావాలి. కనుక పిల్లలైన మీరు ఈ చక్రాన్ని అర్థం
చేసుకున్నారు, క్రొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం
చేస్తున్నారు, బాబాకు సహాయకులై ఇతరులతో కూడా పురుషార్థం చేయించే పనిలో
ఉన్నారు. తండ్రి అపురూపమైన వారు. మీరు కూడా అపురూపమైన పిల్లలు ఎందుకంటే 5
వేల సంవత్సరాల తర్వాత కలిశారు. కనుక ప్రేయసులను అలంకరించి క్రొత్త
ప్రపంచములోకి తీసుకెళ్ళేందుకు తండ్రి వచ్చారు. పిల్లల బుద్ధిలో పైన ఉన్న
మూలవతనము, సూక్ష్మవతనాల జ్ఞానముంది. ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడు ఎలా పై
నుండి వచ్చి ధర్మస్థాపన చేస్తారో పిల్లలకు తెలుసు, తండ్రి నాలెడ్జ్ఫుల్గా
చేశారు. వారిని మోస్ట్ బిలవెడ్(అత్యంత ప్రియమైనవారు) అని అంటారు.
మధురాతి మధురమైనవారు ఎంత మధురమో మీకు తెలుసు. వారి మహిమ అపారము, వారి
వారసత్వం కూడా అపరం అపారమే! దాని పేరే స్వర్గము, హెవెన్, పారడైజ్,
బహిశ్త్. పరమాత్మను గాడ్ఫాదర్, దు:ఖహర్త-సుఖకర్త అని అంటారు. కనుక
వారిని ఎంతగా స్మృతి చెయ్యాలి! కానీ డ్రామా అనుసారం వారు గుర్తుకు రారు. ఈ
పాట ఎంత బాగుంది! ఇంట్లో 3-4 రికార్డులు తప్పకుండా ఉండాలి. ఈ రికార్డులు
కూడా తండ్రి గుర్తును తెప్పిస్తాయి. నూతన దైవీ ప్రపంచ స్వరాజ్యం అనగా
ఇప్పుడు ఆత్మకు రాజ్యం లభిస్తోందని బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు. లౌకిక
తండ్రి ద్వారా ఏదైతే వారసత్వం లభిస్తుందో అది పరమాత్మ ద్వారా లభించిందని
అనరు. తండ్రి నుండి రాజ్యం తీసుకొని మళ్లీ పోగొట్టుకున్నామని మీకు తెలుసు.
ఇప్పుడు మళ్లీ తీసుకుంటున్నారు. సత్యయుగంలో తెల్లగా ఉండేవారు మళ్లీ నల్లగా
అయ్యారు. శ్యామ సుందరుడని పాడ్తారు కూడా. శ్యామముగా(నల్లగా) ఉండేవాడు -
ఇప్పుడు సుందరంగా తయారు చేసేందుకు సద్గురువు లభించారు. ఇప్పుడు సద్గురువు
మరియు గోవిందుడు ఇరువురూ నిలబడి ఉన్నారు. మళ్లీ గురువా మీది బలిహారము అని
అంటారు. మీరు కృష్ణునిగా అవుతున్నారు. ఇలా తయారవుతున్న పిల్లలైన మీదే
బలిహారము. కృష్ణుడు గోవులను మేపాడు అని వారంటారు. ఇంకా బ్రహ్మ గురించి కూడా
వారికి గోశాల ఉండేదని అంటారు. అయితే గోశాల కృష్ణునిదీ కాదు, బ్రహ్మదీ
కాదు. గోశాల శివబాబాది.
ఇప్పుడు పిల్లలైన మీరు పండుగల రహస్యం కూడా
అర్థం చేసుకున్నారు. దీపమాల సత్యయుగంలో ఉంటుందని మీకు తెలుసు. అక్కడ జ్యోతి
వెలిగి ఉంటుంది. మీది 21జన్మల దీపమాల. ఇక్కడ ప్రతీ సంవత్సరం జరుపుకుంటారు.
ఈ రోజు జరుపుకుంటారు, రేపు దీపము ఆరిపోతుంది. ఒకవేళ సత్యయుగంలో
జరుపుకున్నా కారొనేషన్(సింహాసనాధిరోహణ రోజును) జరుపుకుంటారు, ఆ రోజున
బాణసంచా కాలుస్తారు. ఇక్కడైతే పైసా విలువ చేసే బాణసంచా కాలుస్తారు. వీటి
ద్వారా ప్రమాదాలు కూడా జరుగుతాయి. అక్కడైతే గొప్ప కారోనేషన్ అవుతుంది.
ఇక్కడ రాజ్యపదవి లభిస్తే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. కాని ఈ రాజ్యపదవిలో
సుఖము లేదు. ఇది భ్రష్ఠాచారీ (అవినీతి) ప్రపంచము, అది శ్రేష్ఠాచారీ
ప్రపంచము. తండ్రి చెప్తారు - చూడండి, మిమ్ములను ఎంత వివేకవంతులుగా
చేస్తున్నానో చూడండి. తండ్రిని త్రిలోకనాథుడని అంటారు. మూడు లోకాలకు
యజమానిగా అవ్వరు. వారిలో మూడు లోకాల జ్ఞానముంది. మిమ్ములను వైకుంఠానికి
యజమానిగా చేస్తారు. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి! మీరు అర్ధకల్పం భక్తి
చేశారు. ఇప్పుడు తండ్రి లభించారు. ఇప్పుడు తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు
- స్మరించండి, స్మరించండి,....... అని అంటారు, ఎవరిని? తండ్రిని, తండ్రి
రచన యొక్క జ్ఞానాన్ని, బీజాన్ని, మరియు వృక్షాన్ని. ఈ స్మృతి ద్వారా మీరు
చక్రవర్తి రాజులుగా అయిపోతారు. చూశారా,...... స్మృతి చేసే చమత్కారము,
ఎటువంటి వారి నుండి ఎటువంటి వారిగా తయారు చేస్తుంది! దీనిని స్పిరిచ్యుయల్
నాలెడ్జ్(ఆధ్యాత్మిక జ్ఞానము) అని అంటారు. ఆత్మలకు తండ్రి ఎవరైతే ఉన్నారో
వారు జ్ఞానాన్ని వినిపిస్తారు. గీతలో కృష్ణుని పేరు వేసేశారు. కాని తండ్రి
మీకు జ్ఞానమునిచ్చి తమ కంటే ఉన్నతంగా తయారుచేస్తారు. మీరు వైకు౦ఠానికి
యజమానిగా అవుతారు. ఎలాగైతే ఆ చదువు చదువుతూ, మేము బ్యారిష్టర్గా అవుతామని
బుద్ధిలో ఉంటుందో, అలాగే మేము భికారుల నుండి రాకుమారులుగా అవుతామని మళ్లీ
మహారాజులుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి టీచరు రూపంలో
చదివిస్తున్నారు, లౌకికంలో కొడుకు 5 సంవత్సరాలు తండ్రి వద్ద ఉంటాడు. తర్వాత
టీచరు వద్దకు వెళ్తాడు, వృద్ధాప్యంలో గురువును ఆశ్రయిస్తాడు. ఇక్కడైతే
తండ్రికి చెందినవారిగా అయ్యారు. తండ్రి, టీచరు రూపంలో శిక్షణనిస్తారు,
అంతేకాక సద్గతినిచ్చేందుకు వెంట తీసుకెళ్తారు. ఆ గురువు తన వెంట
తీసుకెళ్ళడు. తానే ముక్తిలోకి వెళ్ళలేడు. వారు యాత్రకు తీసుకెళ్తారు. మీరూ
మార్గదర్శకులే, వారూ మార్గదర్శకులే. కాని అది పనికిమాలిన రాయి-రప్పల యాత్ర.
ఇప్పుడు మీకు ఈ జ్ఞానం ఉంది. కనుక మీకు సంతోషం ఉండాలి. ఇది విద్యార్థి
జీవితము. మరి ఎందుకు మర్చిపోవాలి? కాని మాయ ఆ సంతోషాన్ని ఉండనీయదు.
ఎందుకంటే కర్మాతీత అవస్థ అంతిమంలో వస్తుంది. స్మృతి లబ్ధా అని అంటారు కదా.
స్మరించి, స్మరించి సుఖం పొందు, అక్కడ క్లేశం(దు:ఖము) ఉండదు. దానిని
జీవన్ముక్తి అని అంటారు. ఎలాగైతే తండ్రి మధురమైన వారో అలా తండ్రి జ్ఞానం
కూడా మధురమైనది. బాబా మహిమ అపరం అపారము అనగా ఆవలి తీరం లభించదు(అంతు
చిక్కదు). ఇలా భక్తిలో అంటారు. మీరు ఇలా అనలేరు ఎందుకంటే మీకు మొత్తం
జ్ఞానమంతా లభించింది. మీరు చాలా మధురంగా తయారవ్వాలి. నాలో ఏ వికారమూ లేదు
కదా, ఎవరి అవగుణాన్ని చూడటం లేదు కదా? అని స్వయాన్ని చూసుకోండి. చాలా
మధురమైన దృష్టి కలిగి ఉండాలి. బాబాకు ఎంతమంది పిల్లలున్నారు! వారికి అందరి
పైనా మధురమైన దృష్టి ఉంది కదా! మీరు కూడా అలా మంచి దృష్టిని ఉంచుకోవాలి.
రాధా-కృష్ణులకు, లక్ష్మీ నారాయణులకు గల సంబంధమేమిటో మనుష్యులకు తెలియదు
కనుక చిత్రాలు కూడా తయారుచేశారు. చిన్నతనంలోని రాధా-కృష్ణులు, స్వయంవరం
తర్వాత లక్ష్మీ నారాయణులుగా అవుతారు. తండ్రి వచ్చి, '' పిల్లలూ, మీరు
దేవతలుగా ఉండేవారు '' అని స్మృతినిప్పిస్తున్నారు. దేవతలుగా ఉండేవారమని
పిల్లలు చెప్తారు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమ: అని అంటారు. బ్రాహ్మణులు ఇలా
అంటారు కాని బ్రాహ్మణ, దేవత, క్షత్రియ అనే మూడు ధర్మాలు స్థాపన చేస్తారని
తెలియదు. కనుక బ్రాహ్మణుల తండ్రి - బ్రహ్మ మరియు శివుడు. తండ్రి సాధారణ
రూపంలో వస్తారు. ఈ రథము నిశ్చితమైనది. ఇది భాగ్యశాలీ రథము.
మనుష్యులు
దీపావళి రోజున లక్ష్మిని ధనం కోరేందుకు ఆహ్వానిస్తారు. ఇంతకుముందు మీరు
కూడా వేడుకునేవారు. ఇప్పుడు మీరు లక్ష్మీ-నారాయణులుగా అవుతున్నారు.
ఇక్కడైతే బిక్షమే భిక్షాన్ని అడుక్కుంటారు. పుత్రుని ఇవ్వు, ధనం ఇవ్వు అంటూ
కేకలు పెడ్తారు. సత్యయుగంలో అలా యాచించరు. శివబాబా పిల్లల భండారాలన్నీ
నిండుగా చేస్తారు. తండ్రి అయితే స్వర్గాన్ని రచిస్తారు. నరకాన్ని ఎంతమాత్రం
రచించరు. మనలను స్వర్గవాసులుగా తయారు చేసేందుకు ఇప్పుడు బాబా నరకంలోకి
వచ్చారు. అందరూ పతితులుగానే ఉన్నారు. మేము నరకవాసులమని వారికి తెలియదు.
ఎవరైతే స్వర్గవాసులుగా ఉండేవారో, వారు ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు.
ఇప్పుడు మళ్లీ స్వర్గవాసులుగా అవుతున్నారు. ఈ బ్రహ్మాబాబా శివబాబాకు
అకాలసింహాసనం ఇతడిలో అకాలమూర్తి అయిన పరమాత్మ వచ్చి కూర్చుంటారు. ఆత్మ కూడా
అకాలమూర్తియే. ఆత్మకు సింహాసనం ఈ భృకుటి. మస్తకం పై తిలకం దిద్దు చిహ్నము
కూడా ఉంది, ఈ రోజుల్లో ఎద్దులకు కూడా తిలకం దిద్దుతారు. కనుక ఈ భృకుటి
బ్రహ్మ మరియు శివబాబా ఇరువురికీ సింహాసనము. నేను జ్ఞానసాగరుడను కనుక వచ్చి
జ్ఞానమునిస్తాను. నాకు ఏమీ అందరి మనసుల గురించి తెలియదు. నేను థాట్
రీడర్ను కాను. హా..... 'మనసుకు యజమాని' అని అనవచ్చు ఎందుకంటే మనసు అని
ఆత్మను అంటారు. కాబట్టి నేను ఆత్మకు యజమానిని, శరీరానికి యజమానిని కాను.
నేను యజమానిని అని సాధువులు అంటారు కదా. అయితే నేను అవినాశీ ఆత్మకు
యజమానిని ఎందుకంటే నేను స్వయం అవినాశిని. మీరు వినాశీ వస్తువులకు యజమానిగా
అవుతారు ఎందుకంటే మీరు ఒక వినాశీ శరీరం వదిలి మరొక శరీరం తీసుకుంటారు.
మీరిప్పుడు వైకుంఠంలోకి వెళ్తారు. అందుకే ఈ చదువు చదువుకుంటున్నారు. ఎప్పటి
వరకు జీవిస్తామో అప్పటి వరకు తాగాలి అని అంటారు కదా! చదువు ఎప్పుడు పూర్తి
అవుతుందో అప్పుడు ఈ శరీరమే విడుదలైపోతుంది. సృష్టిని రచించేందుకు వెళ్ళనా
అని పరమాత్మకు సంకల్పం కలిగింది అని అంటారు. కాని ఎప్పుడైతే సమయం వస్తుందో
అప్పుడే పాత్ర చేయాలనే ఆలోచన వస్తుంది. ఇక వచ్చి పాత్రను అభినయిస్తారు.
తండ్రి చెప్తారు - మీరు మీ పాత్రను ఎలా పోషిస్తారో అలాగే నేను కూడా
పోషిస్తాను. కాని నేను జన్మ- మరణాలలోకి రాను. అందుకే నాకు ఇంత మహిమ ఉంది!
వైకుంఠానికి కూడా మహిమ ఉంది. సన్యాసులకు సత్యయుగ సుఖం గురించి తెలియదు.
అక్కడి సుఖం వారికి లభించనే లభించదు. సత్యయుగం గురించి కూడా అక్కడ కంసుడు
ఉండేవాడని విన్నారు కదా. కనుక అక్కడ కూడా సుఖం ఉండదని భావిస్తారు. అందువలన
సుఖం కాకిరెట్టతో సమానమని ఇతరులకు కూడా అలాగే వినిపిస్తారు. ఈ విధంగా
వినిపించి ఇతరులను కూడా సన్యాసులుగా చేస్తారు. పిల్లలైన మీరైతే స్వర్గ
సుఖాలను పొందుతారు. ఇది అంతిమ జన్మ. అందరూ మరణిస్తారు. నేను వచ్చిందే
తీసుకెళ్ళేందుకు. అయితే మీరు ఇక్కడే కూర్చొని ఉంటారా? దోమల గుంపు వలె
అందరినీ తీసుకెళ్తాను. కనుక మమ్మా-బాబా వలె పురుషార్థం చేసి పదవి
తీసుకోవాలి. మీరు బ్రహ్మముఖవంశావళి వారు కదా. సత్యయుగం, త్రేతా యుగంలో
ఎంతమంది దేవతలు ఉంటారో ఇప్పుడు బ్రహ్మ ముఖ వంశావళిగా అంతమంది తయారవ్వాలి.
అయితే నియమానుసారంగా మాత-పిత కూడా ఉన్నారు మరి సంభాళించేందుకు ఎవరిని
నియమించాలి. కొత్త-కొత్త పిల్లలైతే వస్తూ ఉంటారు, చదువు కొనసాగుతూ ఉంటుంది.
చివరివరకు వృద్ధి అవుతూనే ఉంటారు. పోషణ చాలా బాగా చేయాలి. వారు తోట
యజమాని. సెంటరులో ఉండువారు తోటమాలులు. మాలి మొక్కలను సంభాళించాల్సి
ఉంటుంది. ఏ మాలి అయితే సరిగ్గా ఉండరో వారు మొక్కలను ఏం సంభాళన చేస్తారు?
మంచి-మంచి తోటను తయారుచేయు మాలిని చూస్తే తోట యజమానికి చాలా సంతోషం
కలుగుతుంది. ఎవరెవరు పెద్ద మంచి తోటను తయారు చేశారో చూసేందుకు తోట యజమాని
వెళ్తారు. ఎవరెవరు మంచి మాలి అని మీకు కూడా తెలుసు. మంచి మాలీలుగా
ఎవరుంటారో వారికి బహుమతి కూడా లభిస్తుంది. మాలీలైన మీ వేతనము కూడా పెరుగుతూ
ఉంటుంది.
ఇప్పుడు మీరు మీ గమ్య స్థానాన్ని స్మృతి చేయాలి.
ఎందుకంటే ఇప్పుడు మీరు వాపసు ఇంటికి వెళ్లాలి కనుక ఇంటిని స్మృతి చేయాల్సి
ఉంటుంది. స్మృతి చేయకుండా శాంతిధామానికి వెళ్లలేరు. లేకపోతే చెప్పు
దెబ్బలు(శిక్ష) చాలా తినాల్సి ఉంటుంది. పదవి కూడా మంచిది పొందలేరు. ఈ
సమయంలో ఎవరైతే సూక్ష్మ వతనానికి వెళ్తారో, వారు సేవార్థం వెళ్తారు. మొదటి
నంబరులో బాబా సర్వీస్ చేస్తారు, సెకండ్ నంబరులో మమ్మా, ఎందుకంటే మమ్మా
అయితే సెకండ్ నంబరులో రావాల్సి ఉంది. మరి పిల్లలైన మీరు కూడా మమ్మా-బాబాను
అనుసరించాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత -
పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు
ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి సమానంగా చాలా మధురంగా తయారవ్వాలి. అందరినీ మధుర(మంచి) దృష్టితో చూడాలి. ఎవరి అవగుణాన్ని చూడరాదు.
2. గాడ్లీ స్టూడెంట్ లైఫ్ యొక్క సంతోషంలో ఉండాలి. జీవించినంత కాలం చదువు రోజూ చదువుకోవాలి.
No comments:
Post a Comment