Thursday, 18 January 2018

Telugu Murli 11/01/18

11-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మీరు శాంతిని స్థాపించేందుకు నిమిత్తమైనవారు, అందువలన మీరు చాలా చాలా శాంతిగా ఉండాలి. మేము బాబా ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలము, పరస్పరము సోదరీ-సోదరులము అని బుద్ధిలో ఉండాలి ''

ప్రశ్న :- పూర్తిగా సమర్పణ అయినవారు అని ఎవరిని అంటారు? వారి గుర్తులు ఏవి ?
జవాబు :- ఎవరి బుద్ధిలో అయితే మేము ఈశ్వరీయ మాతా-పితల ద్వారా పాలింపబడుతున్నాము, బాబా, మా సర్వస్వమూ మీదే, మీరే మమ్ములను పాలన చేస్తున్నారు అని ఉంటుందో, వారే పూర్తిగా సమర్పణ అయినవారు. భలే ఏదైనా ఉద్యోగము మొదలైనవి చేస్తున్నా ఈ సర్వస్వము బాబా కొరకే అని భావిస్తూ బాబాకు సహాయము చేస్తూ ఉంటారో, తద్వారా ఇంత గొప్ప యజ్ఞ కార్య వ్యవహారాలు నడుస్తాయో, అందరి పాలన జరుగుతుందో........... ఇటువంటి పిల్లలు కూడా సమర్పణ బుద్ధిగలవారే. సమర్పణ బుద్ధితో పాటు ఉన్నత పదవిని పొందుకునేందుకు చదవాలి, చదివించాలి కూడా. శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తూ అనంతమైన మాతా-పితలను శ్వాస శ్వాసలో స్మృతి చేయాలి. 

పాట :- ఓం నమ: శివాయ,...............
ఓంశాంతి. ఇది మహిమ చేసే పాట. వాస్తవానికి మహిమ అంతా అత్యంత శ్రేష్ఠమైన ఉన్నతాతి ఉన్నతమైన ఆ పరమాత్మదే. వారిని గురించి పిల్లలకు తెలుసు. పిల్లల ద్వారా ప్రపంచమంతా వారే మా మాతా-పితలని తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు మాతా-పితలతో పాటు కుటుంబములో కూర్చొని ఉన్నారు. శ్రీ కృష్ణుని అయితే మాత-పిత అని అనజాలరు. భలే కృష్ణునితో పాటు రాధ ఉండినా వారిని మాతా-పితలని అనరు. ఎందుకంటే వారు రాకుమార-రాకుమారీలు. శాస్త్రాలలో ఈ పొరపాటు ఉంది. ఇప్పుడు ఈ అనంతమైన తండ్రి మీకు సర్వ శాస్త్రాల సారాన్ని తెలుపుచున్నారు. భలే ఈ సమయములో పిల్లలైన మీరు మాత్రమే నా సన్ముఖములో కూర్చొని ఉన్నారు. కొందరు పిల్లలు దూరంగా ఉన్నా వారు కూడా వింటున్నారు. మాతా-పితలు మనకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని, సదా సుఖీలుగా చేసేందుకు దారిని లేక యుక్తిని తెలుపుతున్నారని వారికి తెలుసు. ఇది ఖచ్ఛితంగా ఇల్లు వంటిదే. కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, చాలామంది అయితే బయట ఉన్నారు. వీరు బ్రహ్మ ముఖవంశావళి అయిన నూతన రచన. అది పాత రచన. బాబా మనలను సదా సుఖవంతంగా తయారు చేసేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. లౌకిక తల్లి-తండ్రి కూడా పిల్లలను పెంచి పాఠశాలకు తీసుకెళ్తారు. ఇచ్చట అనంతమైన తండ్రి మనలను చదివిస్తూ ఉండడమే కాక మన పాలన కూడా చేస్తున్నారు. పిల్లలైన మీకిప్పుడు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేనే లేరు. మాతా-పితలు కూడా వీరు మా పిల్లలని భావిస్తారు. లౌకిక కుటుంబములో అయితే 10-15 మంది పిల్లలుంటారు, ఇద్దరు, ముగ్గురికి వివాహము చేసి ఉంటారు. ఇచ్చట అయితే అందరూ బాబా పిల్లలే కూర్చుని ఉన్నారు. ఎంతమంది పిల్లలకు జన్మనివ్వాలన్నా ఇప్పుడే బ్రహ్మ ముఖకమలము ద్వారా ఇవ్వాలి. చివర్లో అయితే పిల్లలకు జన్మనిచ్చేదే ఉండదు. అందరూ వాపస్‌ వెళ్ళాలి. ఈ ఒక్క దత్తు తీసుకోబడిన మాతయే నిమిత్తమై ఉంది. ఇది చాలా అద్భుతమైన విషయము. పేదవాని కొడుకు, నా తండ్రి పేదవాడు అని తప్పకుండా భావిస్తాడు. ధనవంతుని కొడుకు నా తండ్రి ధనవంతుడని భావిస్తాడు. అచ్చట అయితే అనేకమంది తల్లిదండ్రులున్నారు. కాని వీరు మొత్తము ప్రపంచమంతటికీ ఒకే మాతా-పిత అయ్యారు. మనము వారి ముఖము(నోటి) ద్వారా దత్తత తీసుకోబడ్డామని మీరందరికీ తెలుసు. వీరు మన పారలౌకిక మాతా-పిత. మనుష్యులందరూ చాలా-చాలా దు:ఖములో ఉన్నప్పుడు వారు ఈ పాత సృష్టిలోనే వస్తారు. మనము ఈ పారలౌకిక మాతా-పితల ఒడిని తీసుకున్నామని పిల్లలకు తెలుసు. మనమందరమూ పరస్పరము సోదరీ-సోదరులము. మన మధ్య ఇక ఏ ఇతర సంబంధమూ లేదు. అందువలన సోదరీ-సోదరులందరూ పరస్పరము చాలా మధురంగా, రాయల్‌గా, పీస్‌ఫుల్‌, నాలెడ్జ్‌ఫుల్‌, బ్లిస్‌ఫుల్‌గా అవ్వాలి. మీరు శాంతి స్థాపన చేస్తున్నందున మీరు కూడా చాలా శాంతిగా ఉండాలి. మనము పారలౌకిక తండ్రికి దత్తు పిల్లలమని, తండ్రి పరంధామము నుండి వచ్చారని పిల్లల బుద్ధిలో ఉండాలి. వారు తాత(దాదా), వీరు దాదా(పెద్ద అన్న). ఎవరైతే పూర్తి సరెండర్‌గా ఉన్నారో, వారు ఈశ్వరీయ తల్లిదండ్రుల నుండి పాలింపబడుతున్నామని భావిస్తారు. బాబా ఈ సర్వస్వమూ మీదే. మీరే మమ్ములను పాలన చేస్తున్నారు. ఏ పిల్లలైతే సమర్పణ అవుతారో వారి ద్వారా అందరి పాలన జరుగుతుంది. భలే ఎవరైనా ఏదైనా ఉద్యోగము చేస్తూ ఉండినా ఇదంతా బాబా కొరకే అని భావిస్తారు. అలా భావించడము వలన తండ్రికి కూడా సహాయము చేస్తూ ఉంటారు. లేకుంటే యజ్ఞ కార్య వ్యవహారాలు ఎలా నడవాలి? రాజా-రాణులను కూడా మాతా-పితలని పిలుస్తారు కాని వారు శారీరిక తల్లి-తండ్రులౌతారు. రాజ మాత, రాజ పిత అని కూడా అంటారు. కాని వీరు అనంతమైనవారు. మనము ఇప్పుడు మతా-పితల జతలో కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు. మనము ఎంత చదువుకుంటామో, చదివిస్తామో అంత ఉన్నత పదవిని పొందుతామని కూడా పిల్లలకు తెలుసు. దానితో పాటు శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. ఈ దాదా కూడా వృద్ధుడు. శివబాబాను ఎప్పుడూ వృద్ధుడని, యువకుడని అనరు. వారు నిరాకారులు. ఆత్మలైన మనలను నిరాకార తండ్రి దత్తత తీసుకున్నారని కూడా పిల్లలైన మీకు తెలుసు. ఈ బ్రహ్మ సాకారములో ఉన్నాడు. తండ్రిని నా వారిగా చేసుకున్నాను,........ అని ఆత్మ అంటుంది. క్రిందికి వస్తే సోదరీ-సోదరులైన మేము బ్రహ్మను మావారిగా చేసుకున్నామని అంటారు. శివబాబా అంటున్నారు - మీరు బ్రహ్మ ద్వారా మా బ్రహ్మ ముఖవంశావళి వారిగా అయ్యారు. బ్రహ్మ కూడా - మీరు నా పిల్లలుగా అయ్యారని అంటారు. బ్రాహ్మణులైన మీ బుద్ధిలో శ్వాస శ్వాసలో వీరు మా తండ్రి అని, వీరు మా దాదా అని మెదులుతూ ఉంటుంది. తండ్రి కంటే ఎక్కువగా తాతను స్మృతి చేస్తారు. మనుష్యులైతే తండ్రితో జగడమాడి అయినా తాత ఆస్తిని తీసుకుంటారు. మీరు కూడా ప్రయత్నించి తండ్రి కంటే ఎక్కువగా తాత నుండి వారసత్వము తీసుకోవాలి. బాబా అడిగినప్పుడు అందరూ మేము నారాయణుని వరిస్తామని అంటారు. నూతనంగా వచ్చేవారు పవిత్రంగా లేకుంటే చేతులు ఎత్తలేరు. మాయ చాలా ప్రబలమయ్యిందని అంటారు. మేము శ్రీ నారాయణుని లేక లక్ష్మిని వరిస్తామని చెప్పను కూడా చెప్పలేరు. బాబా సన్ముఖములో వినిపించినప్పుడు ఎంత ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కుతుందో చూడండి. బుద్ధిని రిఫ్రెష్‌ చేసినప్పుడు నషా ఎక్కుతుంది. కొంతమందికి ఈ నషా స్థిరంగా ఉంటుంది, కొంతమందికి తగ్గిపోతుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి, 84 జన్మలను గుర్తు చేసుకోవాలి, అంతేకాక చక్రవర్తి పదవిని కూడా స్మృతి చేయాలి. ఎవరైతే అంగీకరించరో వారికి గుర్తుండదు. బాబా-బాబా అని నోటితోనేమో అంటారు కాని సత్య-సత్యమైన స్మృతి చేయరని, లక్ష్మీనారాయణులను వరించేందుకు అర్హులుగా కూడా లేరని బాప్‌దాదా భావిస్తారు. వారి నడవడికే అలా ఉంటుంది. అంతర్యామి అయిన తండ్రి ప్రతి ఒక్కరి బుద్ధిని అర్థము చేసుకుంటారు. ఇచ్చట శాస్త్రాల మాటే లేదు. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. దానికి గీత అని పేరు పెట్టారు. ఇకపోతే చిన్న పెద్ద ధర్మాల వారందరూ తమ తమ శాస్త్రాలను తయారు చేసుకుంటారు. ఆ శాస్త్రాలనే చదువుతూ ఉంటారు. బాబా శాస్త్రాలు చదవలేదు. తండ్రి అంటున్నారు - పిల్లలూ, నేను మీకు స్వర్గానికి దారి తెలిపేందుకు వచ్చాను. మీరు ఎలాగైతే అశరీరులుగా వచ్చారో అలాగే వెళ్ళిపోవాలి. దేహ సహితము దు:ఖమునిచ్చు ఈ కర్మ బంధనాలన్నీ తుంచేయాలి. ఎందుకంటే దేహము కూడా దు:ఖమునిస్తుంది. జబ్బు చేస్తే క్లాసుకు కూడా రాలేరు. ఇది కూడా దేహ బంధనమై పోయింది కదా. ఇందులో బుద్ధి చాలా దృఢంగా(సాలిమ్‌గా) ఉండాలి. మొదట బాబా తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారని నిశ్చయముండాలి. ఇప్పుడిది నరకము. ఎవరైనా మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు అనగా తప్పకుండా నరకములో ఉన్నట్లే కదా. అయితే ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ బుద్ధిలో స్వర్గముంది. బాబా ప్రతి రోజు క్రొత్త - క్రొత్త పద్ధతులలో అర్థం చేయిస్తారు. కావున మీ బుద్ధిలో మంచిరీతిగా కూర్చుంటాయి. వీరు మన అనంతమైన మాతా-పితలు. కావున మొదట మీ బుద్ధి ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్లీ ఈ సమయములో బాబా ఆబూలో ఉన్నారని అంటారు. ఉదాహరణానికి యాత్రలకు వెళ్ళినప్పుడు బదిరీనాథ్‌ ఆలయము పైన ఉంటుంది. పండాలు అచ్చటికి తీసుకెళ్తారు. స్వయంగా బదిరీనాథ్‌ వచ్చి తీసుకెళ్ళరు. మనుష్యులు పండాలుగా అవుతారు. కాని ఇచ్చట శివబాబా స్వయం పరంధామము నుండి వస్తారు. వారంటున్నారు - ఓ ఆత్మలారా! మీరు ఈ శరీరాలను వదిలి శివపురానికి రావాలి అని అంటారు. ఎక్కడికి వెళ్ళాలో ఆ లక్ష్యము తప్పకుండా గుర్తుంటుంది. ఆ బదిరీనాథుడు చైతన్యములో వచ్చి పిల్లలను తన వెంట తీసుకొని వెళ్లడం జరగదు కదా. అతడైతే ఇక్కడి నివాసియే. కాని పరమపిత పరమాత్మ నేను పరంధామ నివాసినని అంటున్నారు. మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చాను. కృష్ణుడైతే ఈ విధంగా అనలేడు. కాని రుద్రుడైన శివబాబా చెప్తున్నారు. ఈ రుద్ర యజ్ఞము రచింపబడింది. గీతలో కూడా రుద్రుని విషయము వ్రాయబడి ఉంది. నన్ను స్మృతి చేయండని ఆ ఆత్మిక తండ్రి చెప్తున్నారు. తండ్రి ఎటువంటి యుక్తితో యాత్ర నేర్పిస్తారంటే ఎప్పుడు వినాశనము జరిగినా ఆత్మలైన మీరు శరీరాలను వదిలి నేరుగా తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. మళ్లీ శుద్ధమైన ఆత్మకు శుద్ధమైన శరీరము కావాలి. ఈ పాత సృష్టి వినాశనమైన తర్వాత కొత్త శరీరము లభిస్తుంది. ఇప్పుడు ఆత్మలందరూ బాబా జతలో దోమల వలె వాపస్‌ వెళ్ళిపోతారు. ఈ విషయ సాగరము నుండి ఆవలి తీరానికి తీసుకెళ్తారు కనుక వారిని నావికుడని కూడా అంటారు. కృష్ణుని నావికుడని అనజాలరు. ఈ దు:ఖ ప్రపంచము నుండి సుఖ ప్రపంచానికి తండ్రియే తీసుకెళ్తారు. ఇదే భారతదేశము విష్ణుపురముగా ఉండేది. అందులో లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. ఇప్పుడిది రావణ పురము. రావణుని చిత్రము కూడా చూపించాలి. చిత్రాలను బాగా ఉపయోగించాలి. మన ఆత్మ ఎలా ఉంటుందో బాబా ఆత్మ కూడా అలాగే ఉంటుంది. వారికి, మనకు ఒకే ఒక తేడా - మనము మొదట అజ్ఞానులుగా ఉండేవారము, కాని వారు జ్ఞానసాగరులు. ఎవరికైతే రచయిత, రచనల గురించి తెలియదో వారిని అజ్ఞానులని అంటారు. రచయిత ద్వారా ఎవరైతే రచయిత, రచనల గురించి తెలుసుకుంటారో వారిని జ్ఞానులని అంటారు. మీకు ఈ జ్ఞానము ఇచ్చట మాత్రమే లభిస్తుంది, సత్యయుగములో లభించదు. పరమాత్మ విశ్వానికి అధిపతులని వారంటారు. మనుష్యులు ఆ మాలికుని స్మృతి చేస్తారు. కాని వాస్తవానికి విశ్వము లేక సృష్టికి యజమానులుగా లక్ష్మీనారాయణులు అవుతారు. నిరాకార శివబాబా విశ్వానికి యజమానిగా అవ్వరు. కనుక ఆ మాలికుడు నిరాకారమా, సాకారమా? అని వారిని అడగాలి. నిరాకారమైతే సాకార సృష్టికి అధిపతులుగా అవ్వలేరు. వారు బ్రహ్మాండానికి యజమాని. వారే స్వయంగా వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేస్తారు. అంతేకాని స్వయం పావన ప్రపంచానికి మాలికులుగా అవ్వరు. ఆ ప్రపంచానికి లక్ష్మీనారాయణులు మాలికులుగా అవుతారు. అలా తయారు చేయువారు నిరాకార తండ్రి. ఇవన్నీ అర్థము చేసుకునే చాలా రహస్యమైన విషయాలు. ఆత్మలైన మనము కూడా బ్రహ్మతత్వములో ఉన్నప్పుడు బ్రహ్మాండానికి అధికారులము. ఉదాహరణానికి రాజా-రాణులు, మేము భారతదేశానికి అధికారులమని అంటారు. ప్రజలు కూడా వారిలాగా మేము మాలికులమని అంటారు. ఎందుకంటే అచ్చట నివసిస్తారు కదా. అలాగే తండ్రి బ్రహ్మాండానికి మాలికులు. అచ్చట నివసించినందున మనము కూడా మాలికులమే. బాబా వచ్చి మళ్లీ నూతన సృష్టిని రచిస్తారు. వారంటున్నారు - నేను దీని పై రాజ్యపాలన చేయను, నేను మనిషిగా అవ్వను. నేను ఈ శరీరాన్ని కూడా లోను(అప్పు)గా తీసుకుంటాను. మిమ్ములను ఈ సృష్టికి యజమానులుగా చేసేందుకు రాజయోగము నేర్పిస్తాను. మీరు ఎంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఇందులో తక్కువ చేయకండి. టీచరైతే అందరినీ చదివిస్తారు. పరీక్షలో చాలామంది పాస్‌ అవుతే టీచరు ప్రత్యక్షత కూడా జరుగుతుంది. అప్పుడు వారికి ప్రభుత్వము నుండి లిఫ్ట్‌(ప్రమోషన్‌) లభిస్తుంది. ఇది కూడా అటువంటిదే. ఎంత బాగా చదువుకుంటారో అంత మంచి పదవి లభిస్తుంది. తల్లి-తండ్రి కూడా సంతోషిస్తారు. పరీక్షలో పాస్‌ అవుతే మిఠాయిలు పంచుతారు. ఇచ్చటైతే మీరు ప్రతి రోజూ మిఠాయి పంచుతారు. మళ్లీ పరీక్షలో పాస్‌ అయినప్పుడు బంగారు పుష్పాల వర్షము కురుస్తుంది. మీ పై ఆకాశము నుండి పుష్పాలేవీ పడవు కాని మీరు ఒక్కసారిగా బంగారు మహళ్ళకు అధిపతులుగా అవుతారు. ఇలా ఎవరినైనా మహిమ చేసేందుకు బంగారుతో పుష్పాలు తయారుచేసి వారి పై వేస్తారు. ఉదాహరణానికి దర్భంగా రాజు చాలా ధనవంతుడు. వారి కుమారుడు విదేశాలకు వెళ్లినప్పుడు పెద్ద పార్టీ ఇచ్చి చాలా ఖర్చు చేశాడు. బంగారు పుష్పాలు తయారు చేయించి కుమారుని పై వర్షింపచేశాడు. దానికి చాలా ఖర్చయ్యింది. అప్పుడు అతని పేరు చాలా ప్రఖ్యాతమయ్యింది. భారతవాసులు ధనము ఎలా వెదజల్లుతారో చూడండి అనేవారు. కాని మీరు స్వయమే బంగారు మహళ్ళలోకి వెళ్ళి కూర్చుంటారు. కావున మీకు ఎంత నషా ఉండాలి. తండ్రి అంటున్నారు - కేవలం నన్ను మరియు చక్రాన్ని స్మృతి చేస్తే మీ నావ ఆవలి తీరానికి వెళ్లిపోతుంది. ఎంత సులభము! అని బాబా అంటున్నారు.

పిల్లలైన మీరు చైతన్యమైన దీపపు పురుగులు. బాబా చైతన్య దీపము. ఇప్పుడు మా రాజ్యము స్థాపన జరగనున్నదని మీరంటారు. భక్తికి ఫలమిచ్చేందుకు సత్యమైన బాబా వచ్చారు. బాబా స్వయంగా వచ్చి ఎలా నూతన బ్రాహ్మణ సృష్టిని రచిస్తారో తెలుపుచున్నారు. నేను తప్పకుండా రావలసి వచ్చింది. మేమంతా బి.కెలమని, శివబాబా పౌత్రులమని పిల్లలైన మీకు తెలుసు. ఇది అద్భుతమైన కుటుంబము. దేవీ దేవతా ధర్మము నాటు(అంటు) ఎలా పడుతోందో చిత్రములో స్పష్టంగా ఉంది. వృక్షము క్రింద వేర్లలో మీరు కూర్చొని ఉన్నారు. పిల్లలైన మీరు ఎంతో సౌభాగ్యశాలురు. పిల్లలైన మిమ్ములను రావణుని సంకెళ్ల నుండి విడిపించేందుకు వచ్చానని, రావణుడు మిమ్ములను రోగులుగా చేశాడని అత్యంత ప్రియమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - నన్ను స్మృతి చేయండి, అనగా శివబాబాను స్మృతి చేయండి. ఈ స్మృతి ద్వారా మీ జ్యోతి వెలుగుతుంది. మళ్లీ మీరు ఎగిరేందుకు అర్హులుగా అవుతారు. మాయ అందరి రెక్కలు విరిచేసింది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బుద్ధిని దృఢంగా చేసుకునేందుకు దేహములో ఉంటూ దేహ బంధనాల నుండి భిన్నంగా ఉండాలి. అశరీరులయ్యే అభ్యాసము చేయాలి. రోగాలు మొదలైనవి వచ్చిన సమయములో కూడా తండ్రి స్మృతిలో ఉండాలి.
2. పారలౌకిక మాతా-పితల పిల్లలుగా అయ్యారు. అందువలన చాలా - చాలా మధురంగా, రాయల్‌గా, శాంతియుతంగా, నాలెడ్జ్‌ఫుల్‌గా, బ్లిస్‌ఫుల్‌గా(జ్ఞాన సంపన్నులుగా, ఆనందంగా) ఉండాలి. శాంతిగా ఉంటూ శాంతి స్థాపన చేయాలి. 

వరదానము :- ''తెగిపోని స్మృతి ద్వారా సర్వ సమస్యలను పరిష్కరించే ఉడ్‌తా పంఛీ భవ(ఎగిరే పక్షిగా అవ్వండి).''
బాబా నా వాడని ఎప్పుడైతే అనుభవమవుతుందో అప్పుడు స్వతహాగా బాబా గుర్తుంటాడు. ఏదైతే నాదిగా ఉంటుందో అది స్వతహాగా గుర్తుంటుంది. స్మృతి చేసే అవసరముండదు. నాది అనగా అధికారము ప్రాప్తమవ్వడం. బాబా నా వాడు, నేను బాబా వాడిని/దానిని - దీనినే సహజయోగము అని అంటారు. ఇటువంటి సహజ యోగులుగా అయ్యి ఒక్క తండ్రి స్మృతి అనే లగ్నములో మగ్నమై ఉంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ తెగిపోని స్మృతియే అన్ని సమస్యలను పరిష్కరించి ఎగిరేపక్షిగా తయారు చేసి ఎగిరేకళలోకి తీసుకెళ్తుంది. 

స్లోగన్‌ :- ''మనన శక్తిని అనుభవం చేసే అనుభవీగా అయితే జ్ఞాన ధనము వృద్ధి చెందుతూ ఉంటుంది''
 

No comments:

Post a Comment