Monday, 22 January 2018

Telugu Murli 22/01/18

22-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీరు ఈశ్వరీయ సంతానము, ఇది మీ అమూల్యమైన జీవితము, మీ ఈశ్వరీయ కులము చాలా శ్రేష్ఠమైనది, స్వయం భగవంతుడే మిమ్ములను దత్తత తీసుకున్నారు - ఈ నషాలో ఉండండి'' 

ప్రశ్న :- దేహ భావము (స్త్రీ - పురుషులనే దేహ గుర్తింపు, దేహభాన్‌) తొలగిపోయేందుకు ఏ అభ్యాసము అవసరము ?
జవాబు :- 1. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ ఈ శరీరములో మేము కొద్ది సమయము కొరకు మాత్రమే నిమిత్తమాత్రముగా ఉన్నాము అని అభ్యాసము చేయండి. ఎలాగైతే తండ్రి కొద్ది సమయము కొరకు శరీరములోకి ప్రవేశించారో, అలాగే ఆత్మలమైన మేము కూడా శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేసేందుకు ఈ శరీరాన్ని ధరించాము. తండ్రి మరియు వారసత్వము గుర్తుంటే శరీర భావము తొలగిపోతుంది. దీనినే సెకండులో జీవన్ముక్తి అని అంటారు. 2. అమృతవేళలో నిదుర లేచి తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడితే శరీర భావము (భానము) సమాప్తమైపోతుంది. 

పాట :- ఓంనమ: శివాయ.........................
ఓంశాంతి. భగవంతుడు ఒక్కరే, వారు తండ్రి కూడా అవుతారు. ఆ తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - ఆత్మ రూపము ఇంత పెద్ద లింగము వలె ఉండదు. ఆత్మ అత్యంత చిన్న నక్షత్రము వలె భృకుటి మధ్యలో ఉంటుంది. మందిరాలలో ఉంచినట్లు ఇంత పెద్ద జ్యోతిర్లింగమేమీ కాదు. ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్మ అయిన తండ్రి కూడా అలాగే ఉంటారు. ఆత్మ రూపము మనిషి వలె ఉండదు. ఆత్మ అయితే మనుష్య శరీరాన్ని ఆధారంగా తీసుకుంటుంది. అన్ని కార్యాలు చేసేది ఆత్మయే. సంస్కారమంతా ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ ఒక నక్షత్రము వంటిది. మంచి-చెడు సంస్కారాల అనుసారము ఆత్మయే జన్మ తీసుకుంటుంది. ఈ విషయాలను బాగా అర్థము చేసుకోవాలి. మందిరాలలో లింగము ప్రతిష్ఠించబడి ఉంటుంది, అందుకే అందరికీ అర్థము చేయించేందుకు ఇక్కడ మనము కూడా శివలింగాన్ని చూపిస్తాము. వీరి పేరు శివుడు. పేరు లేకుండా ఏ వస్తువూ ఉండదు, ప్రతి వస్తువుకు ఏదో ఒక ఆకారము ఉంటుంది. తండ్రి పరంధామములో ఉంటారు. పరమాత్మ అయిన తండ్రి చెప్తున్నారు - ఎలాగైతే ఆత్మ శరీరములోకి వస్తుందో అలా నేను కూడా నరకాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు రావలసి ఉంటుంది. తండ్రి మహిమ అందరికంటే అతీతమైనది, భిన్నమైనది. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఇచ్చటకు వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. ఇది అనంతమైన అనాది అవినాశి డ్రామా, ఇది ఎప్పుడూ నాశనమవ్వదు. ఇది తిరుగుతూనే ఉంటుంది. రచయిత అయిన తండ్రి కూడా ఒక్కరే, రచన కూడా ఒక్కటే. ఇది అనంతమైన సృష్టి చక్రము. ఇందులో నాలుగు యుగాలున్నాయి. ఇంకొకటి కల్పము యొక్క సంగమ యుగము. అందులోనే తండ్రి వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు, ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఆత్మలైన మనమందరమూ పరంధామములో ఉండేవారమని పిల్లలైన మీకిప్పుడు స్మృతి కలిగింది. ఈ కర్మక్షేత్రములో పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఈ బేహద్‌ డ్రామా పునరావృతమవ్వనున్నది. తండ్రి అనంతమైన యజమాని. వారి మహిమ అపరం అపారమైనది. ఇటువంటి మహిమ ఇతరులెవ్వరికీ లేదు. వారు మనుష్యు సృష్టికి బీజరూపులు. అందరికీ తండ్రి కూడా వారే. తండ్రి అంటున్నారు - నేను పరాయి రావణ ప్రపంచములో వస్తాను. ఒకవైపు ఆసురీ గుణాల సంప్రదాయము గలవారు, మరోవైపు దైవీగుణాల సంప్రదాయము వారున్నారు. దీనిని కంసపురమని కూడా అంటారు. కంసుడని అసురుని అంటారు, కృష్ణుని దేవత అని అంటారు. ఇప్పుడు దేవతలుగా తయారు చేసేందుకు, అందరినీ వాపస్‌ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇతరులెవ్వరికీ ఆ శక్తి(తాకత్‌) లేదు. తండ్రే స్వయంగా కూర్చొని శిక్షణనిచ్చి దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. ఈ బాధ్యత, కర్తవ్యము తండ్రిదే. తండ్రి అంటున్నారు - ఎప్పుడైతే అందరూ తమోప్రధానంగా అవుతారో, నన్ను విస్మరిస్తారో, కేవలం విస్మరించడమే కాదు, నన్ను రాళ్ళు రప్పలలో తోసేస్తారో, ఇంత గ్లాని చేస్తారో అప్పుడు నేను వస్తాను. నాకు జరిగినంత గ్లాని ఎవ్వరికీ జరగదు. అప్పుడు నేను వచ్చి మీకు ముక్తిదాతగా అవుతాను, అందరినీ దోమల వలె తీసుకెళ్తాను. '' మన్మనాభవ '' అని ఇతరులెవ్వరూ చెప్పలేరు. పరమపిత పరమాత్మ అయిన నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలన్నీ వినాశనమౌతాయి. కృష్ణుడైతే ఇలా చెప్పలేడు. పిల్లలకు పరమాత్ముని మహిమ తెలుసు. వారు జ్ఞానసాగరులు, సుఖసాగరులు. వారి తర్వాత రెండవ నంబరులో బ్రహ్మ, విష్ణు, శంకరులున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరు చేస్తారు? శ్రీ కృష్ణుడా? పరమపిత పరమాత్మ శివుడు కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మొట్టమొదట నాకు బ్రాహ్మణులు అవసరము. అందువలన బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ముఖవంశావళిని రచిస్తాను, వారు కుఖవంశావళి(గర్భము ద్వారా జన్మ తీసుకున్నవారు). మీరిప్పుడు సంగమ యుగములో బ్రహ్మ సంతానమయ్యారు. తండ్రి వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. ఈశ్వరుడు నిరాకారులు, బ్రహ్మా సాకారులు. తండ్రి మొట్టమొదట బ్రాహ్మణులుగా చేసి తర్వాత మళ్లీ దేవతలుగా చేస్తారు. దేవతల తర్వాత క్షత్రియులు......... ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్లీ వీరి నుండి ఇతర ధర్మాలు వచ్చాయి. ముఖ్యమైనది భారతదేశము, ఈ భారతదేశము అవినాశి ఖండము. తండ్రి ఇచ్చటకు వచ్చి(భారతదేశాన్ని) స్వర్గముగా తయారుచేస్తారు. వారు తండ్రే కాక టీచరు, మీ సద్గురువు కూడా అయ్యారు. అటువంటి వారిని సర్వవ్యాపి అని ఎలా అంటారు! వారు మీ తండ్రి, ఈ ప్రపంచములో బ్రాహ్మణులైన మీరు తప్ప త్రికాలదర్శులు ఎవ్వరూ అవ్వజాలరు. పరమపిత పరమాత్మతో పాటు మనము పరంధామములో నివసించే వారమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అచ్చట నుండి నంబరువారుగా కర్మక్షేత్రములోకి వస్తారు. తర్వాత చివరిలో వాపస్‌ మనమే వెళ్ళిపోతాము. 84 జన్మలు పూర్తిగా తీసుకోవాలి.

మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారో, ఏ విధంగా వర్ణాలలోకి వచ్చారో ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయము వారు. ఇప్పటి మీ జీవితము అమూల్యమైనది ఎందుకంటే ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానముగా అయ్యారు. బ్రహ్మ ద్వారా తండ్రి వచ్చి దత్తత తీసుకుంటారు. తండ్రి స్వర్గాన్ని రచించే రచయిత. కావున వారే స్వయంగా వచ్చి స్వర్గానికి యజమానులుగా కూడా చేస్తారు. ఇప్పుడు విశ్వమంతటా శాంతిని స్థాపన చేయాలి - ఈ కర్తవ్యము తండ్రిదే. తండ్రి అంటున్నారు - మీకు మళ్లీ రాజయోగము నేర్పించుటే నా పాత్ర. దీని వలన సదా మీరు ఆరోగ్యవంతులుగా(ఎవర్‌హెల్తీగా) అవుతారు. ఏ విధంగా దేవతలుగా అయ్యారో మళ్లీ అదిప్పుడు రిపీట్‌ అవుతుంది. ఇప్పుడు నాటు కట్టబడుతోంది. తండ్రి తోటయజమాని (బాగ్‌వాన్‌), ఇతని ద్వారా నాటు వేయిస్తున్నారు. వారు సన్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. నా అపురూపమైన పిల్లలారా! చాలా సమయము నుండి విడిపోయిన పిల్లలారా! గుర్తుంది కదా! నేను మిమ్ములను స్వర్గములోకి పంపించాను. మీరు మళ్లీ 84 జన్మల చక్రము చుట్టి వచ్చి ఇప్పుడు నన్ను కలుసుకున్నారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. మిమ్ములను తప్పకుండా వాపసు తీసుకెళ్ళాలి. మీకు ఇష్టమున్నా లేకపోయినా తప్పకుండా తీసుకువెళ్ళాలి. మొదట ఆది సనాతన దైవీ రాజ్యము నడిచింది. తర్వాత ఆసురీ రాజ్యము నడిచింది. దైవీ రాజ్యము తర్వాత పవిత్రత లోపిస్తూ పూర్తిగా నశించింది, మళ్లీ సింగల్‌ కిరీటమైపోయింది. ఇప్పుడు ప్రజల పై ప్రజా రాజ్యముంది. మళ్లీ దైవీ రాజ్యము స్థాపనవుతూ ఉంది. ఆసురీ రాజ్యము వినాశనము కొరకు ఈ రుద్ర యజ్ఞము ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. మీరు పతిత సృష్టి పై రాజ్యపాలన చేయరు, ఇప్పుడిది సంగమ యుగము. సత్యయుగములో అయితే ఇలా అనరు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేస్తున్నారు. చేయించేవారు ఎవరు? శ్రీమతాన్నిచ్చే సమర్థులు, శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు. నేను భారతదేశానికి అత్యంత వినయ విధేయతలు గల సేవకుడను(మోస్ట్‌ ఒబీడియంట్‌ సర్వంట్‌) భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేస్తాను. అచ్చట యథా రాజా-రాణి తథా ప్రజా,................ అందరూ సుఖంగా ఉంటారు. సహజ సౌందర్యము ఉంటుంది. లక్ష్మీనారాయణులు ఎంత సుందరంగా ఉన్నారో చూడండి. స్వర్గాన్ని తయారు చేయువారు హెవీన్లీ గాడ్‌ఫాదర్‌. మొత్తం ప్రప౦చమంతా గీత కొరకు కృష్ణ భగవానువాచ అని అంటారు. అయితే కృష్ణుడైతే '' మన్మనాభవ - నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు భస్మము అవుతాయి '' అని అనలేరు. ఇక ఏ ఇతర ఉపాయము కూడా లేదు. గంగానది అయితే పతితపావని కానే కాదు. నన్ను ఒక్కరినే స్మృతి చేయమని(మామేకమ్‌ యాద్‌ కరో) గంగా నది చెప్పదు. తండ్రి ఒక్కరు మాత్రమే కూర్చుని ఇలా అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఆత్మలతో మాట్లాడ్తారు - ఆ తండ్రే సర్వుల సద్గతిదాత, వారి మందిరాలు కూడా ఉన్నాయి. ద్వాపర యుగము నుండి అన్ని స్మృతిచిహ్నాలు తయారవ్వడం ప్రారంభమౌతాయి. సోమనాథుని మందిరముంది, అయితే వారు ఏమి చేసిపోయారో ఎవ్వరికీ తెలియదు. వారు శివ - శంకరులను కలిపేస్తారు. అయితే పరంధామ నివాసి అయిన శివుడు ఎక్కడ ? సూక్ష్మవతనవాసి అయిన శంకరుడు ఎక్కడ? ఏమీ అర్థము చేసుకోరు. తండ్రి అంటున్నారు - ఎవరెన్ని వేదశాస్త్ర్రాలు మొదలైనవి చదివినా, జప-తపాలు చేసినా, నన్ను కలవలేరు. భలే నేను భావనకు ఫలాన్ని(భావనా కా భాడా) అందరికీ ఇస్తాను అయితే వారైతే అఖండ జ్యోతిర్మయ బ్రహ్మతత్వమునే పరమాత్మ అని అర్థము చేసుకుంటారు. బ్రహ్మతత్వము సాక్షాత్కారమైనా దాని వలన కొంచెము కూడా లాభము లేదు(ప్రాప్తించదు). కొందరికి హనుమంతుని సాక్షాత్కారము, కొంతమందికి గణేశుని సాక్షాత్కారము చేయిస్తాను. అలా నేను అల్పకాలము కొరకు మనోకామనలను పూర్తి చేస్తాను. అల్పకాలము కొరకు సంతోషమైతే ఉంటుంది కదా. కానీ మళ్లీ అందరూ తమోప్రధానంగా అవ్వాల్సిందే. రోజంతా గంగలో మునిగి కూర్చున్నా అందరూ తమోప్రధానంగా అయితే అయ్యే తీరాలి.

తండ్రి అంటున్నారు - పిల్లలూ! పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి 21 జన్మలకు అధికారులుగా అవుతారు. ఇంత గొప్ప ప్రాప్తులను కలిగించే సత్సంగమేదీ లేదు. తండ్రే స్వయంగా వచ్చి రాజయోగము నేర్పిస్తున్నారు. కావున శ్రీమతము పై ఎంత బాగా నడుచుకోవాలి! చదువు పై గమనమివ్వాలి. తండ్రి అత్యంత శ్రేష్ఠమైన మతమునిస్తారు. శ్రీమతము ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. మీరు డ్రామా రహస్యాన్ని మంచిరీతిగా అర్థము చేసుకోవాలి. పురుషార్థము చేయాలి. పురుషార్థము చేసి ఇలా అర్హులుగా తయారవ్వాలి. మేము తండ్రితో పాటు స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చామని పిల్లలైన మీకు నషా ఉండాలి. మనము అచ్చటి నివాసులము. ఈ శరీరములో కొంత సమయము కొరకు మనము నిమిత్తమాత్రంగా ఉన్నాము. బాబా కూడా కొంత సమయము కొరకు ఇచ్చటకు వచ్చారు. ఈ శరీర భావము సమాప్తమైపోవాలి. మీ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. దీనినే సెకండులో జీవన్ముక్తి అని అంటారు. తండ్రి అంటున్నారు - అందరినీ వాపసు తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి ఉదయమే లేచి బాబాను స్మృతి చేయండి. వారితో మాట్లాడండి. మన 84 జన్మలు పూర్తి అయ్యాయని మీకు తెలుసు. ఇప్పుడు మనము ఈశ్వరీయ సంతానంగా అయ్యాము. తర్వాత మళ్లీ దైవీ సంతానంగా, ఆ తర్వాత క్షత్రియ సంతానంగా అవుతాము. బాబా మనలను విశ్వాధికారులుగా తయారు చేస్తారు. మీరు కూర్చొని బాబాను మహిమ చేయండి - '' బాబా! మీరైతే అద్భుతము చేశారు, కల్ప-కల్పము వచ్చి మమ్ములను చదివిస్తారు, బాబా మీ జ్ఞానము చాలా అద్భుతమైనది. స్వర్గము ఎంత అద్భుతమైనది ! అవి ప్రపంచములోని భౌతిక సప్త (7) విచిత్రాలు, ఇది ఆత్మిక తండ్రి స్థాపన చేసిన అద్భుతము. కృష్ణపురమును స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ లక్ష్మీనారాయణులు ఈ ప్రాలబ్ధాన్ని ఎచ్చట నుండి పొందారు? తండ్రి ద్వారా. జగదాంబ, జగత్పితలతో పాటు పిల్లలు కూడా ఉంటారు. వారు బ్రాహ్మణులు, జగదంబ అయితే బ్రాహ్మణిగా ఉండేది. ఆమె కామధేనువు, అందరి మనోకామనలను పూర్తి చేసేస్తుంది. ఈ జగదంబనే తర్వాత స్వర్గములో మహారాణిగా అవుతుంది. ఇది ఎంతో అద్భుతమైన రహస్యము. ఈ తండ్రి మన స్థితిని స్థిరము చేసుకునేందుకు రకరకాల యుక్తులు తెలుపుతూ ఉంటారు. రాత్రుళ్ళు మేల్కోండి, బాబాను స్మృతి చేస్తే అంతమతి సోగతి అయిపోతుంది. పురుషార్థము పూర్తిగా చేస్తే స్మృతి నిలుస్తుంది. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. 8 మందికి మాత్రమే స్కాలర్‌షిప్‌(ఉపకారవేతనము) లభిస్తుంది, మేము లక్ష్మీనారాయణులను వరిస్తాము అని అందరూ అంటారు. అలా వరించాలంటే ఉత్తీర్ణులై చూపించాలి. నాలో ఇంకా ఏదైనా వానరత్వము(కోతి బుద్ధి) లేదు కదా? అని పరిశీలించుకోవాలి. దానిని తొలగిస్తూ పోండి. మొత్తం రోజంతటిలో ఎవ్వరికీ దు:ఖము ఇవ్వలేదు కదా? అని చూచుకోండి. తండ్రి అందరికీ సుఖమిచ్చేవారు. పిల్లలు కూడా అలా తయారవ్వాలి. వాచా, కర్మల ద్వారా ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. సత్య-సత్యమైన మార్గాన్ని చూపించాలి. అది హద్దు తండ్రి వారసత్వము, ఇది అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వము. ఇది ఎవరికైతే లభిస్తుందో, వారే తెలియజేయగలరు. ఎవరైతే మన ధర్మానికి చెందినవారిగా ఉంటారో, వారికి వెంటనే టచ్‌ అవుతుంది.

తండ్రి అంటున్నారు - మళ్లీ దైవీ ధర్మాన్ని స్థాపన చేసేందుకు నేను బ్రహ్మ శరీరములో వస్తాను. ఇప్పుడు మనము బ్రాహ్మణులమని, తర్వాత మళ్లీ దేవతలుగా తయారవ్వాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొదట సూక్ష్మవతనములోకి వెళ్ళి తర్వాత శాంతిధామములోకి వెళ్తాము. అక్కడ నుండి మళ్లీ నూతన ప్రపంచములో గర్భమహలులోకి వస్తారు, ఇచ్చట గర్భజైలులోకి వస్తారు. దీనినే అసత్య మాయ, అసత్య శరీరము....... (ఝూఠీ మాయా, ఝూఠీ కాయా...........)అని అంటారు. తండ్రి అంటున్నారు - ఎంత ధర్మ గ్లాని చేశారు! శివజయంతిని జరుపుతారు. కాని శివుడు ఎప్పుడు వచ్చారో, ఎవరిలో ప్రవేశించారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా ఏదో ఒక శరీరములో వచ్చి నరకాన్ని స్వర్గముగా తయారు చేసి ఉంటారు కదా. తండ్రి పిల్లలకు చాలా మంచిరీతిగా అర్థము చేయిస్తున్నారు. మీ చార్టు తయారు చేయమని సలహా ఇస్తున్నారు. రోజంతటిలో ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాము ? అని చార్టు వ్రాయండి. ఉదయమే లేచి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మనము అనంతమైన తండ్రితో పాటు గుప్త వేషములో భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేసేందుకు వచ్చాము. ఇప్పుడు మనము వాపస్‌ ఇంటికి వెళ్ళాలి. వెళ్లేందుకు ముందు మన రాజధానిని తప్పకుండా స్థాపన చేయాలి. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు, మిగిలిన ప్రపంచమంతా కలియుగములో ఉంది. మీరు సంగమ యుగీ బ్రాహ్మణులు. తండ్రి తన పిల్లల కొరకు ముక్తి - జీవన్ముక్తుల బహుమతిని తీసుకొస్తారు. సత్యయుగములో భారతదేశము జీవన్ముక్తముగా ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములో ఉండేవి. తండ్రి అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొస్తారు. అందుకు అర్హులుగా కూడా ఆ తండ్రే స్వయంగా తయారు చేస్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేము తండ్రితో పాటు స్వర్గ స్థాపన కొరకు నిమిత్తమైనవారమనే నషాలో సదా ఉండాలి. తండ్రి మనలను విశ్వాధికారులుగా తయారు చేస్తారు.
2. తండ్రి సమానం సుఖమునిచ్చే వారిగా తయారవ్వాలి. ఎప్పుడూ ఎవ్వరినీ దు:ఖితులుగా చేయరాదు. అందరికీ సత్యమైన మార్గమును తెలపాలి. మీ ఉన్నతి కొరకు స్వంత చార్టు ఉంచుకోవాలి. 

వరదానము :- '' అన్ని కర్మల భారాన్ని తండ్రి పై వదిలి(తండ్రికి ఇచ్చి) స్వయం ట్రస్టీలుగా ఉండే డబల్‌లైట్‌ ఫరిస్తా భవ ''
ధైర్యము చేసే పిల్లలకు బాప్‌దాదా సదా సహాయము చేస్తారు. పిల్లలు శ్రేష్ఠమైన సంకల్పము చేస్తూనే తండ్రి హాజరైపోతారు. కేవలం మొత్తం పనినంతా తండ్రి పై వదిలేస్తే ఇక దానిని గురించి తండ్రికి తెలుసు, ఆ కార్యానికి తెలుసు. స్వయం మీరే ఆ కార్య బాధ్యతను, భారాన్ని పైకెత్తుకోకండి. ట్రస్టీలుగా ఉంటే సదా తేలికగా, డబల్‌లైట్‌ ఫరిస్తాలుగా అయ్యి ఎగురుతూ ఉంటారు. హృదయం శుద్ధంగా ఉంటే, కోరికలు పూర్తి అవుతాయి(తీర్తాయి). 

స్లోగన్‌ :- ''ఉమంగ - ఉత్సాహాల రెక్కలు జతలో ఉంటే, ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు''
 

No comments:

Post a Comment