Thursday, 18 January 2018

Telugu Murli 19/01/18

19-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - పారసబుద్ధిగల వారిగా అయ్యేందుకు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని మంచిరీతిగా అర్థము చేసుకోవాలి, స్వయంలో ధారణ చేసుకొని ఇతరులతో చేయించాలి''

ప్రశ్న :- ఏ ఒక్క రహస్యము చాలా గుహ్యమైనది, గోపనీయమైనది, అర్థము చేసుకోవలసినది?
జవాబు :- నిరాకార తండ్రి సర్వులకు మాతా-పితగా ఎలా అవుతారో, వారు సృష్టిని ఏ విధంగా రచిస్తారో, ఈ విషయము చాలా గుహ్యమైన, గోపనీయ రహస్యము. నిరాకార తండ్రి తల్లి లేకుండా సృష్టిని రచించలేరు. వారు శరీర ధారణ ఎలా చేస్తారో, అందులో ప్రవేశించి అతని నోటి ద్వారా పిల్లలను ఎలా దత్తత చేసుకుంటారో, ఈ బ్రహ్మ తండ్రే కాక తల్లిగా కూడా ఎలా అవుతారో - ఈ విషయాలు బాగా అర్థము చేసుకొని స్మరించవలసిన లేక స్మృతిలో ఉంచుకోవలసిన విషయము. 

పాట:- తల్లివి నీవే, తండ్రివి నీవే.......... (తుమ్‌హీ హో మాతా............)
ఓంశాంతి. ఎవరినైతే తల్లివి నీవే, తండ్రివి నీవే అని అంటారో, వారిలో తప్పకుండా తండ్రియే ఆజ్ఞను ఇస్తారు కదా. ఇక్కడ తల్లి-తండ్రి సంయుక్తము(కంబైండ్‌)గా ఉన్నారు. ఈ విషయాన్ని మనుష్యులు అర్థము చేసుకునేందుకు చాలా కష్టము. అయితే అర్థము చేసుకోవలసిన ముఖ్యమైన విషయము కూడా ఇదే. నిరాకారులైన పరమపిత పరమాత్మ ఎవరినైతే తండ్రి అని అంటారో, వారిని తల్లి అని కూడా అంటారు. ఇది అద్భుతమైన విషయము. పరమపిత పరమాత్మ మానవ సృష్టిని రచిస్తారు. కనుక రచించేందుకు తప్పకుండా తల్లి కావాలి. ఈ విషయము చాలా రహస్యమైనది. ఇతరులెవ్వరి బుద్ధిలోకి ఎప్పుడూ రాజాలదు. వారు అందరికి తండ్రి. మరి తల్లి కూడా తప్పకుండా కావాలి కదా. ఆ తండ్రి నిరాకారులు. అయితే తల్లిగా ఎవరిని ఉంచాలి? వివాహమైతే చేసుకొని ఉండరు కదా. ఇవి చాలా గుహ్యమైన గోపనీయమైన అర్థము చేసుకోవలసిన విషయాలు. కొత్త కొత్తగా వచ్చిన వారైతే అర్థము చేసుకోలేరు. పాతవారు కూడా కష్టంగా అర్థము చేసుకొని ఆ స్మృతిలో ఉంటారు. పిల్లలే మాతా-పితల స్మృతిలో ఉంటారు కదా. భారతదేశములో లక్ష్మీనారాయణులను కూడా మీరే మాతా-పితలు,....... అని అంటారు. అలాగే రాధా-కృష్ణుల ముందుకు వెళ్లి కూడా మీరే తల్లిదండ్రులు అని అంటారు. అయితే వాస్తవానికి వారు రాకుమార-రాకుమార్తెలు(యువరాజు-యువరాణి) కావున ఏ బుద్ధిహీనుడు కూడా వారిని తల్లి - తండ్రి అని అనరు. మనుష్యులకైతే అలా అనడం అలవాటైపోయింది. అయితే ఈ విషయమే అతిభిన్నమైనది. లక్ష్మీనారాయణులనైతే వారి పిల్లలు మాత్రమే తల్లి-తండ్రి అని పిలుస్తారు. ఎవరి వద్ద చాలా ధనముంటుందో, మిద్దెలు-మహళ్లు ఉంటాయో వారు స్వర్గములో ఉన్నారని మనుష్యులు భావిస్తారు. వారి పిల్లలు మా తల్లిదండ్రుల వద్ద చాలా సుఖముందని అంటారు. తప్పకుండా వారు పూర్వ జన్మలో కొన్ని మంచి కర్మలు చేసి ఉంటారు. అచ్ఛా! నీవే తల్లివి, నీవే తండ్రివి........ అని ఎవరిని మహిమ చేస్తారో ఆ పరమపిత పరమాత్మ ఒక్కరే రచయిత. మనమంతా ఎవరి పిల్లలమో, వారు కూడా నిరాకారులే, ఆత్మలమైన మనము కూడా నిరాకారులమే. అయితే నిరాకారుడు సృష్టిని ఎలా రచిస్తారు? తల్లి లేకుండా సృష్టి రచింపబడజాలదు. ఈ సృష్టి రచన చాలా అద్భుతమైనది. ఒకటేమో పరమాత్మ నూతన ప్రపంచానికి రచయిత. పాత ప్రపంచములోకి వచ్చి నూతన ప్రపంచాన్ని రచిస్తారు. అయితే ఎలా రచిస్తారు? ఇది చాలా రహస్యమైన విషయము. ఆ నిరాకారుని మనము మాతా - పిత అని అంటున్నాము. నేను పిల్లలను దత్తత చేసుకుంటానని తండ్రే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. గర్భము నుండి పిల్లలకు జన్మనిచ్చే విషయమే లేదు. ఇంత లెక్క లేనంత మంది పిల్లలు గర్భము నుండి ఎలా జన్మిస్తారు? కావున నేను ఈ శరీరాన్ని ధరించి ఇతని (బ్రహ్మ) నోటి ద్వారా పిల్లలను దత్తత చేసుకుంటాను. ఈ బ్రహ్మ మానవ సృష్టిని రచించే తండ్రే కాక తల్లి కూడా అవుతాడు. అతని నోటి ద్వారా పిల్లలను దత్తత చేసుకుంటాను. ఈ విధంగా పిల్లలను దత్తు తీసుకోవడం కేవలం ఒక్క తండ్రి కర్తవ్యము మాత్రమే. సన్యాసులు ఆ పని చేయలేరు. వారికి జిజ్ఞాసువులు, శిష్యులు, అనుచరులు ఉంటారు. ఇక్కడైతే ఇది రచనను గురించిన విషయము. అందువలన బాబా ఇతనిలో ప్రవేశిస్తారు. మీరంతా ముఖవంశావళివారు. నీవే తల్లివి, నీవే తండ్రివి అని అంటారు. అందువలన మాత కూడా ఇతడే అని నిరూపించబడ్తుంది. ఆ తండ్రి ఇతనిలో ప్రవేశించి రచిస్తారు. ఈ వృద్ధుడు ప్రజాపిత అవ్వడమే కాక వృద్ధ మాత కూడా అవుతాడు. వృద్ధ తండ్రికి వృద్ధురాలే కావాలి కదా. ఇప్పుడు పిల్లలు మాతా - పితలను స్మృతి చేయవలసి వస్తుంది. ఇతనికి ఆస్తి ఏమీ లేదు. మీరు వారసులుగా అవుతారు. అందుకే వీరిని బాప్‌దాదా అని అంటారు. మీరు ప్రజాపిత బ్రహ్మ నుండి ఆస్తిని తీసుకోరు. ఈ దాదా(బ్రహ్మ) కూడా వారి నుండే తీసుకుంటాడు. ఇతడిని దాదా (అన్న) అని, మాతా అని కూడా పిలుస్తారు లేకుంటే మాతా-పితలని ఎలా నిరూపించబడ్తుంది. మాతా-పితలు లేకుండా పిల్లలెలా జన్మిస్తారు - ఇవన్నీ అర్థము చేసుకొని స్మరించే చాలా రహస్యమైన విషయాలు. బాబా మీరు తండ్రి ఈ మాత ద్వారా మేము జన్మ తీసుకున్నామని అంటారు. మాతా- పిత అన్నప్పుడు వారసత్వము కూడా తప్పకుండా గుర్తు వస్తుంది, ఆ తండ్రిని స్మృతి చేయాలి. ఈ పతిత ప్రపంచములోకి తండ్రి ఎలా వస్తారో జ్ఞానము వలన మీరు అర్థము చేసుకోగలరు. బాబా అంటున్నారు - నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతడు నాకు కుమారుడే కాక మీకు తండ్రి కూడా అయ్యాడు. అంతేకాక మీ తల్లి కూడా అయ్యాడు. మీరంతా పిల్లలు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినందున వారసత్వము లభిస్తుంది. తల్లిని స్మృతి చేసినందున వారసత్వము లభించదు. నిరంతరము ఆ నిరాకార తండ్రినే స్మృతి చేయాలి. ఈ శరీరాన్ని మర్చిపోవాలి. ఇవన్నీ అర్థము చేసుకునే జ్ఞాన విషయాలు.

తండ్రి పాత ప్రపంచములోకి వచ్చి నూతన ప్రపంచాన్ని రచిస్తారు. పాతదానిని సమాప్తము చేసేస్తారు. లేకపోతే ఎవరు సమాప్తము చేయగలరు? శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనము అని గాయనము కూడా ఉంది. ఇది డ్రామాలో నిశ్చయమై ఉంది. అందువలన గాయనములో కూడా వస్తుంది. మన కొరకు నూతన రాజధాని తయారౌతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. వినాశనానికి ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి. మీరు ఇంతమంది ఉన్నారు అందరూ రాజ్యపదవిని పొందుకుంటున్నారు. ఏదో గుడ్డినమ్మకాలతో నమ్మేశారని కాదు. ఎవరో రాముని సీత దొంగలించబడిందని అంటే సత్యం సత్యమని అనేశారు. ఏదైనా విషయము అర్థము కాకుంటే అర్థము చేసుకునేందుకు ప్రయత్నించండి. లేకుంటే బుద్ధిహీనులు బుద్ధిహీనులుగానే ఉండిపోతారు. భక్తి మార్గములో అయితే అల్పకాలిక సుఖము లభిస్తుంది. దాని ఫలితము అదే జన్మలో లేక మరుసటి జన్మలో అల్పకాలము కొరకు లభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. కొంత సమయము మాత్రమే పవిత్రంగా ఉంటారు. పాపాలు చేయరు. దాన-పుణ్యాలు కూడా చేస్తారు. వీటి వల్ల లభించే సుఖమును కాకిరెట్టకు సమానమని అంటారు. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు ఎందుకంటే మీరు బందర్‌(కోతి) నుండి పరివర్తనై మందిరానికి అర్హులుగా అయ్యారు. సత్యయుగములో మీరు పారసబుద్ధి గలవారిగా ఉండేవారు ఎందుకంటే అప్పుడు పారసనాథుడు, పారసనాథినీల రాజ్యముండేది. బంగారు మహళ్ళు ఉండేవి. ఇప్పుడైతే అన్నీ రాళ్ళే. పారసబుద్ధి గలవారి నుండి పత్తర్‌(రాతి) బుద్ధి గలవారిగా ఎవరు తయారు చేస్తారు? 5 వికారాలనే రావణుడు అని అంటారు. అందరూ రాతిబుద్ధి గలవారిగా అయినప్పుడే పారసబుద్ధిగా తయారు చేయు తండ్రి ఇచ్చటకు వస్తారు. ఎంత సులభంగా అర్థము చేసుకొని అర్థము చేయించగలరు! ఇది బీజము మరియు వృక్షము. మిగిలిన విస్తారమైన విషయాలు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక మీదట కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. క్లుప్తంగా ఒక్క మాటలో ''తండ్రిని స్మృతి చేయండి'' వారి నుండి వారసత్వము లభిస్తుందని అంటున్నారు. తల్లిని స్మృతి చేసే అవసరము లేదు. తండ్రి అంటున్నారు - పిల్లలూ! నన్ను స్మృతి చేయండి. అంటే తప్పకుండా తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకే తల్లి నుండి జన్మ తీసుకొని ఉంటారు. అందువలన ఈ తల్లిని కూడా వదిలేయండి. దేహధారులందరినీ వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. ఆత్మలమైన మేము ఆత్మిక తండ్రి పిల్లలమని, మళ్లీ శారీరిక మాతా - పితలకు కూడా పిల్లలుగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. ఈ అనంతమైన తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. భారతదేశము స్వర్గముగా ఉండేది కదా. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు లేరు. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ప్రతి జన్మలో హద్దు వారసత్వము తీసుకుంటూ వచ్చారు. నరకములో ఉండేదే హద్దు వారసత్వము. స్వర్గములోని వారసత్వాన్ని హద్దు వారసత్వమని అనరు. అది అనంతమైన వారసత్వము ఎందుకంటే అనంతము అనగా మొత్తము సృష్టికి యజమానులుగా ఉంటారు. అప్పుడు ఏ ఇతర ధర్మమూ ఉండదు. హద్దు(పరిమిత) వారసత్వము ద్వాపరము నుండి ప్రారంభమౌతుంది. సత్యయుగములో బేహద్‌(అనంతమైన) వారసత్వముంటుంది. మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అచ్చట మీకు అనంతమైన సామ్రాజ్యముంటుంది. యథా రాజా రాణి తథా ప్రజా. ప్రజలు కూడా మేము ఈ సృష్టి అంతటికి యజమానులమని అంటారు. ఇప్పుడు ప్రజలు అలా మేము ఈ సృష్టికంతటికీ అధిపతులమని అనరు. ఇప్పుడు అనేక హద్దులు ఏర్పడ్డాయి. మా నీటిలోనికి మీరు రారాదు. ఈ తుంట(భాగము) మాది అని వారంటారు. అచ్చట ప్రజలు కూడా మేము విశ్వానికి అధిపతులమని అంటారు. మా మహారాజు, మా మహారాణి అయిన లక్ష్మీనారాయణులు కూడా విశ్వమంతటికి యజమానులు అని అంటారు. అచ్చట ఒకే రాజ్యముండేదని ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము. అది అనంతమైన సామ్రాజ్యము. భారతదేశము ఎలా ఉండేదో ఎవరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోండి అని ఇప్పుడు శిక్షణ లభిస్తున్నది. నేను కూడా(బ్రహ్మ) చెప్తున్నానంటే మనము తప్పకుండా తీసుకుంటున్నాము. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. 21 తరాల రాజ్యభాగ్యమని గాయనము కూడా ఉంది. తరము అని ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ ముసలివారైన తర్వాతనే మరణిస్తారు. అచ్చట అకాలమృత్యువు ఉండదు. మాతలు ఎప్పుడూ విధవలుగా అవ్వరు. ఏడ్చే పని, బాదుకునే పని ఉండదు. ఇచ్చటైతే ఎంతగానో ఏడుస్తూ, బాదుకుంటూ ఉంటారు. అక్కడ పిల్లలు కూడా ఏడ్వవలసిన అవసరముండదు. ఇక్కడైతే పిల్లల నోరు పెద్దదిగా అవ్వాలని ఏడిపిస్తూ ఉంటారు. అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు. మేము ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి కల్పక్రితము వలె వారసత్వము తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలందరూ అర్థం చేసుకున్నారు. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు వాపసు వెళ్లాలి. నిరంతరము తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయడం వలన వికర్మలు వినాశనమౌతాయి. మన్మనాభవ అర్థము ఎంతో సులభమైనది. గీత భలే అసత్యమైనది, కాని అందులో ఎంతో కొంత సత్యము కూడా ఉంది కదా. తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. ఈ విధంగా కృష్ణుడైతే నన్ను స్మృతి చేయండి, మీరు నా వద్దకు రావాలని అనజాలడు కదా. పరమాత్మ ఇప్పుడు సర్వ ఆత్మలకు చెప్తున్నాడు - ఆత్మలైన మీరంతా దోమల వలె రావాలి. కావున తప్పకుండా ఆత్మ పరమాత్మ అయిన తండ్రినే అనుసరిస్తుంది. కృష్ణుడైతే దేహధారి అయిపోయాడు. అతడు ఈ విధంగా చెప్పలేడు. ఆత్మనైన నన్ను స్మృతి చేయమని అతడు చెప్పలేడు. అతని పేరే కృష్ణుడు. ఏ ఆత్మ కూడా ఇలా చెప్పలేదు. ఆత్మలంతా భాయి-భాయి. తండ్రి అంటున్నారు - నేను నిరాకారుడను, పరమాత్మ అయిన నా పేరు శివుడు. అలా కృష్ణుడు ఎలా అంటాడు? అతడికైతే తన శరీరముంది. శివబాబాకు తమ స్వంత శరీరము లేనే లేదు. శివబాబా అంటున్నారు - పిల్లలూ! మీకు కూడా మొదట మీ శరీరము లేదు. ఆత్మలైన మీరు నిరాకారులుగా ఉండేవారు. ఆ తర్వాత శరీరము తీసుకున్నారు. ఇప్పుడు మీకు డ్రామా ఆదిమధ్యాంతాల స్మృతి కలిగింది. తండ్రి ఈ సృష్టిని ఎలా, ఎప్పుడు, ఎందుకు రచిస్తారు? సృష్టి అయితే ఉంది కదా. బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచించారనే గాయనము కూడా ఉంది. అందువలన తప్పకుండా పాత సృష్టి నుండే నూతన సృష్టిని రచించి ఉంటారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేశారని కూడా అంటారు. తండ్రి అంటున్నారు - ఈ చదువు ద్వారా నేను మిమ్ములను మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. పూజ్య దేవతలుగా ఉండేవారు తర్వాత మళ్లీ పూజారులుగా అయిపోయారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో మనుష్యులకు అర్థము కాదు. అందరూ 84 జన్మలు ఎలా తీసుకుంటారా? సృష్టి వృద్ధిని పొందుతూ ఉంటుంది. మరి అందరూ 84 జన్మలు ఎలా తీసుకుంటారు? తప్పకుండా వెనుక వచ్చేవారి జన్మలు తక్కువగా ఉంటాయి. 25-50 సంవత్సరాలలో 84 జన్మలు ఎలా తీసుకుంటారు? ఇది స్వదర్శన చక్రము. అయితే వారు స్వదర్శన చక్రాన్ని ఒక మారణాయుధము రూపములో తయారు చేశారు. ఇప్పుడు ఆత్మలైన మీకు 84 జన్మలు ఫలానా-ఫలానా విధంగా అనుభవించామని స్మృతి కలిగింది. ఇప్పుడు చక్రము పూర్తవుతుంది. మళ్లీ డ్రామా రిపీట్‌ అవుతుంది. మొట్టమొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మము తప్పకుండా ఉండాలి. అది ఇప్పుడు ప్రాయ: లోపమైపోయింది.

ఓ గాడ్‌ ఫాదర్‌!....... దయ చూపమని మనుష్యులు అంటారు. అందువలన తండ్రి అంటారు - అచ్ఛా మిమ్ములను దు:ఖము నుండి ముక్తులుగా చేసి సుఖీలుగా తయారు చేస్తాను. అందరినీ సుఖవంతంగా చేయడమే తండ్రి కర్తవ్యము. అందువలన నేను కల్ప-కల్పము వస్తాను. వచ్చి భారతదేశాన్ని వజ్ర తుల్యముగా తయారు చేస్తాను. చాలా సుఖవంతముగా తయారు చేస్తాను. మిగిలిన వారందరినీ ముక్తిధామములోకి పంపేస్తాను. భక్తులు భగవంతుని కలవాలని కోరుకుంటారు. ఎందుకంటే సన్యాసులు ఈ సుఖము కాకిరెట్టకు సమానమని అన్నారు. ఇంకా కొంతమంది ఈ డ్రామాలో మళ్లీ రానే రాకూడదని కూడా అంటారు. అందువలన మోక్షము పొందుకోండి అని చెప్తారు. కాని మోక్షము లభించనే లభించదు. ఇది తయారైన డ్రామా. ఈ సృష్టి చరిత్ర-భూగోళమంతా పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. ఈ చక్రములో ఎలా తిరుగుతారో కూడా తెలుసుకున్నారు. దానినే స్వదర్శన చక్రమని అంటారు. స్వదర్శన చక్రముతో అందరి శిరస్సులను ఖండించినట్లు చూపిస్తారు. కంసవధ నాటకములో కూడా ఏది చూపిస్తారో వాస్తవానికి అటువంటిదేమీ లేదు. ఇచ్చట హింస అనే మాటే లేదు. ఈ చదువు చదువుకోవాలి. తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు ఎవరినైనా హతమారుస్తారా? అది హద్దులోని వారసత్వము. ఇది అనంతమైన తండ్రి నుండి బేహద్‌ వారసత్వము తీసుకోవడం. గీతలో యుద్ధము మొదలైన వాటి విషయాలు అనేకము వ్రాసేశారు. నిజానికి అవేవీ జరగలేదు. పాండవులు ఎవరితోనూ యుద్ధము చేయరు. అలా జరగదు. ఇక్కడ యోగబలము ద్వారా అనంతమైన తండ్రి నుండి పిల్లలైన మీరు నూతన ప్రపంచము కొరకు వారసత్వము తీసుకుంటున్నారు. ఇందులో యుద్ధము మాటే లేదు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి నుండి 21 తరాలకు వారసత్వము తీసుకునేందుకు నిరంతరము తండ్రిని, వారి వారసత్వాన్ని స్మృతి చేసే పురుషార్థము చేయాలి. ఏ దేహధారినీ స్మృతి చేయరాదు.
2. బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండాలి. మనము పూజ్యులుగా ఉండేవారము తర్వాత మళ్లీ పూజారులుగా అయ్యాము, 84 చక్రాన్ని పూర్తి చేశాము. మళ్లీ డ్రామా రిపీట్‌ అవ్వనున్నది. మనము పూజారుల నుండి పూజ్యులుగా అవ్వాలి అనే స్మృతియే స్వదర్శన చక్రము. 

వరదానము :- ''సదా స్నేహ సహయోగాల ద్వారా అవినాశి రత్నాలనే బిరుదును ప్రాప్తి చేసుకునే అమర భవ''
ఎవరైతే స్థాపనా కార్యంలో సదా స్నేహీలుగా, సహయోగులుగా ఉంటారో వారికి అవినాశీ రత్నాలనే టైటిల్‌(బిరుదు) లభిస్తుంది. ఇటువంటి అవినాశీ రత్నాలను ఎప్పుడూ ఎవ్వరూ కదిలించలేరు. ఏ ఆటంకమూ ఆపలేదు. అటువంటి అవినాశీ రత్నాలే అమర భవ అనే వరదానులు. వారు రియల్‌ గోల్డ్‌గా(నిజమైన ప్యూర్‌బంగారుగా), తండ్రికి సాథీలుగా(సహయోగులుగా, స్నేహితులుగా) ఉంటారు. వారు తండ్రి కార్యాన్ని తమ స్వంత కార్యముగా భావిస్తారు. సదా జతలో ఉంటారు. అందువలన వారు అవినాశిగా అయిపోతారు. 

స్లోగన్‌ :- ''పవిత్రతను యథార్థంగా ధారణ చేస్తే, ప్రతీ కర్మ యథార్థంగా యుక్తి యుక్తంగా జరుగుతుంది''
 


No comments:

Post a Comment