12-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా
- బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలంటే, ప్రతి అడుగు శ్రీమతమును అనుసరించి
వేయండి. నడవడికలు మంచిగా ఉంచుకోండి ''
ప్రశ్న :- శివబాబా హృదయాన్ని ఎవరు అధిరోహించగలరు ?
జవాబు :- ఈ పుత్రుడు మంచి
సేవాధారి అని, ఇతడు అందరికీ సుఖము ఇస్తాడని, మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ
దు:ఖమివ్వడని ఇలా బ్రహ్మాబాబా చెప్పినప్పుడు, ఎవరి గ్యారెంటీనైతే
బ్రహ్మాబాబా గ్యారంటీ తీసుకుంటారో వారు శివబాబా హృదయాన్ని అధిరోహించగలరు.
ప్రశ్న :- ఈ సమయములో ఆత్మిక సేవకులైన
మీరు బాబాతో పాటు ఏ సేవను చేస్తారు ?
జవాబు :- మొత్తము విశ్వానికే కాక
పంచ తత్వాలను కూడా పావనంగా చేసే సేవ ఆత్మిక సేవకులైన మీరు చేస్తారు. అందుకే మీరు
సత్య సత్యమైన సమాజ సేవకులు.
పాట :- తల్లి తండ్రుల ఆశీస్సులు తీసుకో,.........( లే లో దువాయే మా బాప్ కీ,........... )
ఓంశాంతి. పిల్లలు పాట
విన్నారు. లౌకిక తల్లిదండ్రుల ఆశీర్వాదాలనైతే అనేకమంది తీసుకుంటారు.
తల్లిదండ్రుల పాదాలకు పిల్లలు నమస్కరిస్తే మాతా-పితలు ఆశీర్వదిస్తారు. కాని
ఈ దండోరా(పాట) లౌకిక తల్లిదండ్రుల గురించి వేయబడింది కాదు. దండోరా అనగా
అనేకులు వినేది. నీవే తల్లివి, తండ్రివి,....... మేము మీ పిల్లలము,......
మీ కృప లేక ఆశీర్వాదాల ద్వారా అపారమైన సుఖము లభిస్తుందని, అనంతమైన తండ్రిని
గురించే మహిమ చేస్తారు. భారతదేశములోనే ఈ మహిమ గాయనము చేయబడ్తుంది. అందువలన
ఇది తప్పకుండా భారతదేశములోనే జరిగింది. అందుకే ఈ విధంగా గాయనము
చేయబడ్తుంది. ఒక్కసారిగా అనంతములోకి వెళ్లిపోవాలి. స్వర్గ రచయిత తండ్రి
ఒక్కరేనని బుద్ధి చెప్తుంది. స్వర్గములో అయితే అన్ని సుఖాలు ఉన్నాయి. అచ్చట
దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండజాలవు. అందుకే దు:ఖములో అందరూ స్మరిస్తారు.
సుఖములో ఎవ్వరూ స్మరించరు అని గాయనముంది. అర్ధ కల్పము దు:ఖమున్నప్పుడు
అందరూ స్మరణ చేస్తారు. సత్యయుగములో అపారమైన సుఖము ఉంటుంది. అందువలన అక్కడ
స్మరణ చేయరు. మనుష్యులు రాతిబుద్ధి గలవారుగా ఉన్నందున కొంచెము కూడా అర్థము
చేసుకోరు. కలియుగంలో అయితే అపారమైన దు:ఖముంది. ఎంత మారణహోమము జరుగుతోంది.
ఎంత బాగా చదువుకున్నా, విద్వాంసులైనా ఈ పాటల వాస్తవిక అర్థము బొత్తిగా
తెలియదు. నీవే తల్లివి, తండ్రివి..... అని పాడ్తారు. కాని ఈ మహిమ ఏ
మాతా-పితలదో అర్థం చేసుకోరు. ఇది అనేకమంది విషయము కదా. అందరూ ఈశ్వరుని
సంతానమే. కాని ఈ సమయములో అందరూ దు:ఖితులుగానే ఉన్నారు. అపారమైన సుఖము
ఎవ్వరికీ లేదు. కృపతో అయితే సుఖము లభించాలి కదా. అకృపతో దు:ఖము కలుగుతుంది.
తండ్రి కృపాళువుగా గాయనము చేయబడ్డారు. సాధు సత్పురుషులను కూడా కృపాళు అని
అంటారు.
భక్తిమార్గములో తల్లివి నీవే, తండ్రివి నీవే అని ఏదైతే పాడ్తారో అది ఖచ్ఛితంగా యదార్థమైనదేనని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. కాని ఎవరైనా బుద్ధివంతులుగా(చదువుకున్న వారిగా) ఉంటే పరమాత్మను గాడ్ ఫాదర్ అని అంటారు కదా. మరి వారిని తల్లి అని ఎలా అంటారని అడుగుతారు. అప్పుడు వారి బుద్ధి జగదంబ వైపు పోతుంది. జగదంబ వైపు బుద్ధి వెళ్లినప్పుడు జగత్ పిత వైపు కూడా బుద్ధి పోవాలి. ఇప్పుడు బ్రహ్మ-సరస్వతులు భగవంతులేమీ కారు. ఈ మహిమ వారిది కాజాలదు. వారి ముందుకు వెళ్లి మీరు మాతా-పిత అని అనడం తప్పు. మనుష్యులు ఈ గాయనము చేసేది పరమపిత పరమాత్మ కొరకు. అయితే వారు మాతా-పితగా ఎలా అవుతారో వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు మాతా-పితల ఆశీర్వాదాలు తీసుకోండి....... అని చెప్పబడుతుంది. అనగా వారి శ్రీమతమును అనుసరించండి. మీ నడవడిక బాగుంటే మీ పై వాటంతకవే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఒకవేళ నడవడిక బాగా లేకుంటే ఎవరికైనా దు:ఖము ఇస్తూ ఉంటే మాతా-పితలను స్మృతి చేయకుంటే ఇతరుల చేత స్మృతి చేయించకుంటే ఆశీర్వాదాలు లభించజాలవు. అప్పుడు ఇంత సుఖము కూడా పొందలేరు. తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు. ఈ తండ్రి(బ్రహ్మ) హృదయము పైకి ఎక్కితే శివబాబా హృదయము పైకి కూడా ఎక్కినట్లే. ఆ మాతా-పితలదే ఈ గాయనము. బుద్ధి ఆ బేహద్ మాతా-పితల వైపుకు వెళ్లిపోవాలి. బ్రహ్మ వైపు కూడా ఎవ్వరి బుద్ధీ పోదు. భలే కొంతమంది బుద్ధి జగదంబ వైపుకు పోతుంది. వారి మేళా కూడా జరుగుతుంది. కాని వారి కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. నియమానుసారము మన సత్య-సత్యమైన మాత ఈ బ్రహ్మ అని మీకు తెలుసు. ఇది కూడా అర్థము చేసుకోవాలి. స్మృతి కూడా అలాగే చేస్తారు. ఇతడు(బ్రహ్మ) మాత కూడా అవుతాడు. తండ్రి కూడా అవుతాడు. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాస్తారు కూడా. అందువలన తల్లే కాక తండ్రిగా కూడా అవుతాడు. ఇప్పుడు పిల్లలు ఈ తండ్రి హృదయమును అధిరోహించాలి. ఎందుకంటే శివబాబా ఇతనిలోనే ప్రవేశిస్తారు. ఈ పుత్రుడు చాలా మంచి సేవాధారి. అందరికీ సుఖమిచ్చేవాడు. మనసా-వాచా-కర్మణా ద్వారా ఎవ్వరికీ దు:ఖమివ్వడు అని బ్రహ్మబాబా గ్యారంటీ ఇచ్చినప్పుడే శివబాబా హృదయమును అధిరోహిస్తారు. మనసా-వాచా-కర్మణా ఏమి చేసినా, ఏమి మాట్లాడినా వారి ద్వారా అందరికీ సుఖమే లభించాలి. ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. దు:ఖమునిచ్చే ఆలోచన మొదట మనసులో కలుగుతుంది. తర్వాత కర్మలో వచ్చినందున పాపము తయారవుతుంది. మనసా తుఫానులు అయితే తప్పకుండా వస్తాయి. కాని కర్మలోకి ఎప్పుడూ రాకండి. ఒకవేళ ఎవరైనా కోపపడితే లేక అసంతుష్టంగా ఉంటే తండ్రిని వచ్చి - బాబా ఏ విషయములో నా నుండి ఇతడు అసంతుష్టంగా ఉంటున్నాడు అని అడగండి. అప్పుడు బాబా అతనికి అర్థం చేయించి సముదాయిస్తారు. ఏ విషయమైనా మొదట మనసులో వస్తుంది. వాచా కూడా కర్మయే అవుతుంది. పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోవాలంటే శ్రీమతమును అనుసరించాలి. ఇది చాలా రహస్యమైన విషయము. ఒక్కరినే మాత - పిత అని అంటారు. ఈ బ్రహ్మ తండ్రే కాక పెద్ద తల్లి కూడా అయ్యాడు. ఇప్పుడు ఈ బాబా ఎవరిని అమ్మా అని పిలవాలి? ఈ మాత(బ్రహ్మ) ఎవరిని అమ్మా అని అనాలి? ఈ తల్లికైతే తల్లి ఎవ్వరూ లేరు. ఎలాగైతే శివబాబాకు తండ్రి ఎవ్వరూ లేరో అలాగే ఇతనికి తన తల్లి అంటూ ఎవ్వరూ లేరు.
పిల్లలకు ముఖ్యంగా అర్థం చేయిస్తున్నారు - మనసా-వాచా-కర్మణా ఎవరికైనా దు:ఖమునిస్తే దు:ఖము పొందుతారు. అంతేకాక పదవి భ్రష్టమైపోతుంది. సత్యమైన స్వామి(సాహెబ్) వద్ద సత్యంగా ఉండాలి. అలాగే ఇతనితో(బ్రహ్మతో) కూడా సత్యంగా ఉండాలి. బాబా ఈ పుత్రుడు చాలామంచి సుపుత్రుడు అని ఈ దాదా(బ్రహ్మ)యే సర్టిఫికెట్ ఇస్తాడు. బాబా మహిమ అయితే చేస్తారు కదా. ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉన్నారో తనువు, మనసు, ధనముతో సేవ చేస్తారో, ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరో వారే బాప్దాదా హృదయము పైకి, తల్లి హృదయము పైకి ఎక్కుతారు. ఇతని(బ్రహ్మ) హృదయము పైకి ఎక్కడం అనగా వారి(శివబాబా) సింహాసనము పై ఎక్కినట్లే. సదా సుపుత్రులైన పిల్లలకు మేము సింహాసనాధికారులుగా ఎలా అవ్వాలి? అను ఆలోచనే ఉంటుంది. ఇదే చింతలో లగ్నమై ఉంటారు. సింహాసనాలు కూడా నంబరువారుగా 8 ఉంటాయి. తర్వాత 108, ఆ తర్వాత 16,108 కూడా ఉంటాయి. కాని ఇప్పుడు మనము ఉన్నత పదవిని పొందాలి. రెండు కళలు తక్కువగా ఉండి గద్ది పై కూర్చుంటే అది శోభించదు. సుపుత్రులైన పిల్లలు ఇలా ఆలోచించి చాలా పురుషార్థము చేస్తారు - '' ఇప్పుడు మేము ప్రియమైన బాబా నుండి సూర్యవంశ వారసత్వమును పూర్తిగా తీసుకోకుంటే కల్ప-కల్పము తీసుకోలేము.'' ఇప్పుడు ఒకవేళ విజయ మాలలో కూర్చబడకుంటే కల్ప-కల్పము కూర్చబడము. ఇది కల్ప-కల్పపు పరుగు పందెము(రేస్). ఒకవేళ ఇప్పుడు నష్టపడితే కల్ప-కల్పము నష్టపడ్తూనే ఉంటారు. ఎవరైతే శ్రీమతము పై తల్లిదండ్రులను పూర్తిగా అనుసరిస్తారో, ఎప్పుడూ ఎవరికీ దు:ఖమివ్వరో వారే పక్కా వ్యాపారులు. అందులో నంబరు వన్ దు:ఖము కామ ఖడ్గాన్ని ఉపయోగించడం.
తండ్రి అంటున్నారు - అచ్ఛా, కృష్ణ భగవానువాచ అని అనుకున్నా అతడు కూడా నంబరు వన్యే కదా. వారి మాటనైనా గౌరవించాలి, అప్పుడే స్వర్గానికి అధికారులుగా అవుతారు. కృష్ణ భగవానుడు శ్రీమతము ద్వారా శిక్షణ ఇచ్చాడని భావిస్తారు. అది కూడా మంచిదే. అచ్ఛా, అతడి మతమును అనుసరించండి. కృష్ణుడు కూడా కామము మహాశత్రువు దాని పై విజయము పొందండి అని అన్నాడు కదా. ఈ వికారాలను జయించినప్పుడే కృష్ణపురములోకి రాగలరు. అయితే ఇది కృష్ణుని విషయము కాదు. కృష్ణుడైతే చిన్న బాలుడు, అతడు మతమునెలా ఇస్తాడు? పెద్దవాడై సింహాసనము పై కూర్చున్నప్పుడు అతడు మతమునిస్తాడు(సలహా ఇవ్వగలడు). సలహానిచ్చేందుకు అర్హుడైనప్పుడే రాజ్యపాలన చేస్తాడు కదా. ఇప్పుడు శివబాబా అంటున్నారు - నన్ను నిరాకార ప్రపంచములో స్మృతి చేయండి. కృష్ణుడు నన్ను స్వర్గములో స్మృతి చేయండి అని అంటాడు. అతడు కూడా కామము మహాశత్రువు, దాని పై విజయము పొందండి అని అంటున్నాడు. అక్కడ విషము లభించదు. కావున విషాన్ని వదిలి పవిత్రంగా అవ్వండి. ఈ విధంగా కృష్ణుని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అచ్ఛా, మనుష్యులు నా పేరు తొలగించి నా కొడుకు పేరు వేసినారనుకోండి, అతడు కూడా సర్వ గుణ సంపన్నుడే కదా. గీతలో కామము మహాశత్రువని వ్రాయబడి ఉందని అతడు కూడా అంటాడు. కాని అతని మాట కూడా వినరు. అతని సలహాను కూడా పాటించరు. కృష్ణుడు స్వయంగా వచ్చినప్పుడు అతని మతమును అనుసరిస్తాము, అంతవరకు మునకలు వేస్తూనే ఉంటామని భావిస్తారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చానని సన్యాసులు మొదలైనవారు అనలేరు. ఈ విధంగా తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. అంతేకాక ఇది సంగమ యుగములోని విషయమే. కృష్ణుడు సత్యయుగములో ఉంటాడు. అతడిని కూడా ఇలా అర్హునిగా తయారుచేసినవారు ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు శివబాబా స్వయంగా చెప్తున్నారు - '' కృష్ణుడు మరియు అతని వంశములోని వారందరినీ ఇప్పుడు నేను స్వర్గములోకి వెళ్లేందుకు అర్హులుగా చేస్తున్నాను. '' పిల్లలు స్వర్గములోకి వెళ్లి ఉన్నత పదవి పొందాలని బాబా ఎంతో శ్రమ చేస్తున్నారు. లేకుంటే చదువుకున్నవారి ముందు మూటలు మోయవలసి వస్తుంది. తండ్రి నుండి అయితే పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మేము ఇంత సుపుత్రులుగా ఉన్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సుపుత్రులు కూడా నంబరువారుగా ఉంటారు. ఉత్తములు, మధ్యములు, కనిష్టులు. ఉత్తములైతే ఎప్పుడూ దాగి ఉండలేరు. మేము భారతదేశానికి సేవ చేయాలని వారి హృదయములో దయ కలుగుతుంది. సమాజ సేవకులు కూడా నంబరువారుగా ఉంటారు. ఉత్తములు, మధ్యములు, కనిష్టులు. కొందరైతే చాలా దోచుకుంటారు. వస్తువులన్నీ అమ్ముకొని తినేస్తారు. అటువంటివారిని సుపుత్రులైన సమాజ సేవకులని ఎలా అంటారు? తమకు తాము సమాజ సేవకులుగా ఎంతోమంది పిలిపించుకుంటారు. ఎందుకంటే సమాజానికి సేవ చేస్తారు. అయితే సత్యమైన సేవ తండ్రి ఒక్కరు మాత్రమే చేస్తారు.
మేము కూడా బాబాతో పాటు ఆత్మిక సేవకులమని మీరంటారు. మొత్తము సృష్టికే కాదు తత్వాలను కూడా పవిత్రంగా చేస్తామని మీరు అంటారు. ఈ సమయములో తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయని, వాటిని కూడా సతోప్రధానంగా చేయాలని సన్యాసులకు తెలియదు. సతోప్రధాన తత్వాలతో శరీరాలు కూడా సతోప్రధానంగా అయిపోతాయి. సన్యాసులకైతే ఎప్పుడూ సతోప్రధాన శరీరము తయారవ్వదు. ఎందుకంటే వారు వచ్చేదే రజోప్రధాన సమయములో. బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు అయినా పిల్లలు మళ్లీ మర్చిపోతారు. ఎవరైతే ఇతరులకు వినిపిస్తూ ఉంటారో వారికి గుర్తుంటుంది. దానము చేయకపోతే ధారణ కూడా జరగదు. ఎవరైతే మంచి సర్వీసు చేస్తారో బాప్దాదా కూడా వారి పేరును ప్రసిద్ధము చేస్తారు. సేవ చేయడంలో ఎవరెవరు చురుకుగా ఉన్నారో పిల్లలకు కూడా తెలుసు. సర్వీసులో ఎవరైతే తత్పరులుగా ఉన్నారో వారు బాబా హృదయాన్ని అధిరోహిస్తారు. ఎల్లప్పుడూ మాతా-పితలను అనుసరించాలి. వారు మాత్రమే సింహాసనాధికారులుగా అవుతారు. ఎవరైతే సర్వీసు చేస్తారో వారు ఇతరులకు సుఖమునిస్తారు. నేను బాబాకు సుపుత్రునిగా అయ్యానా అని మీ ముఖాన్ని దర్పణములో చూసుకోండి. '' మా సర్వీసు చార్టు ఇలా ఉంది, నేను ఈ ఈ సేవలు చేస్తున్నాను బాబా మీరే నిర్ణయించండి అని మీరే స్వయంగా వ్రాయవచ్చు. అప్పుడు బాబాకు కూడా తెలుస్తుంది. స్వయం మీ అంతకు మీరే - నేను ఉత్తముడినా, మధ్యముడినా, లేక కనిష్ఠుడినా? అని నిర్ణయించుకోవచ్చు. మహారథులెవరో, అశ్వారూఢులు ఎవరో పిల్లలకు కూడా తెలుసు. ఎవ్వరూ దాగి ఉండలేరు. తండ్రికి లెక్కాచారాన్ని పంపితే బాబా అప్రమత్తము కూడా చేస్తారు. లెక్కాచారము పంపకున్నా అటెన్షన్ అయితే లభిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎంత వారసత్వము తీసుకోవాలనుకుంటే అంత పూర్తి పూర్తిగా తీసుకోండి. తర్వాత మళ్లీ బాప్దాదా నుండి కూడా సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ పెద్ద తల్లి కూర్చుని ఉంది. ఇతనితో సర్టిఫికెట్ లభించగలదు. ఈ అద్భుతమైన తల్లికి, తల్లి ఎవ్వరూ లేరు. ఎలాగైతే ఆ తండ్రికి తండ్రి ఎవ్వరూ లేరో అలా ఈ తల్లికి కూడా తల్లి ఎవ్వరూ లేరు. మమ్మా స్త్రీలలో నంబరువన్. డ్రామాలో జగదంబ గాయనము చేయబడింది. సేవ కూడా చాలా చేసింది. బాబా ఎలాగైతే సేవకు వెళ్తారో అలా మమ్మా కూడా వెళ్లేది. చిన్న - చిన్న పల్లెలలో సేవ చేసేది. అందరికంటే చురుకుగా ముందుకు వెళ్లింది. బాబా జతలో అయితే పెద్ద బాబా ఉన్నారు. కనుక పిల్లలు వీరిని చాలా సంభాళన చేయవలసి వస్తుంది. సత్యయుగములో ప్రజలు చాలా సుఖంగా ఉంటారు. వారికి తమ మహళ్లు, ఆవులు, ఎద్దులు మొదలైనవన్నీ ఉంటాయి. మంచిది. పిల్లలూ, ఖుషీగా ఉండండి, సదా సంపన్నంగా ఉండండి, మర్చిపోకండి. ఇతరులనెవ్వరినీ స్మృతి చేయకండి. ఎందుకంటే శివబాబా ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. మీ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. మరి ఇతరులను ఎలా తల్చుకుంటారు? అచ్ఛా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
భక్తిమార్గములో తల్లివి నీవే, తండ్రివి నీవే అని ఏదైతే పాడ్తారో అది ఖచ్ఛితంగా యదార్థమైనదేనని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. కాని ఎవరైనా బుద్ధివంతులుగా(చదువుకున్న వారిగా) ఉంటే పరమాత్మను గాడ్ ఫాదర్ అని అంటారు కదా. మరి వారిని తల్లి అని ఎలా అంటారని అడుగుతారు. అప్పుడు వారి బుద్ధి జగదంబ వైపు పోతుంది. జగదంబ వైపు బుద్ధి వెళ్లినప్పుడు జగత్ పిత వైపు కూడా బుద్ధి పోవాలి. ఇప్పుడు బ్రహ్మ-సరస్వతులు భగవంతులేమీ కారు. ఈ మహిమ వారిది కాజాలదు. వారి ముందుకు వెళ్లి మీరు మాతా-పిత అని అనడం తప్పు. మనుష్యులు ఈ గాయనము చేసేది పరమపిత పరమాత్మ కొరకు. అయితే వారు మాతా-పితగా ఎలా అవుతారో వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు మాతా-పితల ఆశీర్వాదాలు తీసుకోండి....... అని చెప్పబడుతుంది. అనగా వారి శ్రీమతమును అనుసరించండి. మీ నడవడిక బాగుంటే మీ పై వాటంతకవే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఒకవేళ నడవడిక బాగా లేకుంటే ఎవరికైనా దు:ఖము ఇస్తూ ఉంటే మాతా-పితలను స్మృతి చేయకుంటే ఇతరుల చేత స్మృతి చేయించకుంటే ఆశీర్వాదాలు లభించజాలవు. అప్పుడు ఇంత సుఖము కూడా పొందలేరు. తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు. ఈ తండ్రి(బ్రహ్మ) హృదయము పైకి ఎక్కితే శివబాబా హృదయము పైకి కూడా ఎక్కినట్లే. ఆ మాతా-పితలదే ఈ గాయనము. బుద్ధి ఆ బేహద్ మాతా-పితల వైపుకు వెళ్లిపోవాలి. బ్రహ్మ వైపు కూడా ఎవ్వరి బుద్ధీ పోదు. భలే కొంతమంది బుద్ధి జగదంబ వైపుకు పోతుంది. వారి మేళా కూడా జరుగుతుంది. కాని వారి కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. నియమానుసారము మన సత్య-సత్యమైన మాత ఈ బ్రహ్మ అని మీకు తెలుసు. ఇది కూడా అర్థము చేసుకోవాలి. స్మృతి కూడా అలాగే చేస్తారు. ఇతడు(బ్రహ్మ) మాత కూడా అవుతాడు. తండ్రి కూడా అవుతాడు. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాస్తారు కూడా. అందువలన తల్లే కాక తండ్రిగా కూడా అవుతాడు. ఇప్పుడు పిల్లలు ఈ తండ్రి హృదయమును అధిరోహించాలి. ఎందుకంటే శివబాబా ఇతనిలోనే ప్రవేశిస్తారు. ఈ పుత్రుడు చాలా మంచి సేవాధారి. అందరికీ సుఖమిచ్చేవాడు. మనసా-వాచా-కర్మణా ద్వారా ఎవ్వరికీ దు:ఖమివ్వడు అని బ్రహ్మబాబా గ్యారంటీ ఇచ్చినప్పుడే శివబాబా హృదయమును అధిరోహిస్తారు. మనసా-వాచా-కర్మణా ఏమి చేసినా, ఏమి మాట్లాడినా వారి ద్వారా అందరికీ సుఖమే లభించాలి. ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. దు:ఖమునిచ్చే ఆలోచన మొదట మనసులో కలుగుతుంది. తర్వాత కర్మలో వచ్చినందున పాపము తయారవుతుంది. మనసా తుఫానులు అయితే తప్పకుండా వస్తాయి. కాని కర్మలోకి ఎప్పుడూ రాకండి. ఒకవేళ ఎవరైనా కోపపడితే లేక అసంతుష్టంగా ఉంటే తండ్రిని వచ్చి - బాబా ఏ విషయములో నా నుండి ఇతడు అసంతుష్టంగా ఉంటున్నాడు అని అడగండి. అప్పుడు బాబా అతనికి అర్థం చేయించి సముదాయిస్తారు. ఏ విషయమైనా మొదట మనసులో వస్తుంది. వాచా కూడా కర్మయే అవుతుంది. పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోవాలంటే శ్రీమతమును అనుసరించాలి. ఇది చాలా రహస్యమైన విషయము. ఒక్కరినే మాత - పిత అని అంటారు. ఈ బ్రహ్మ తండ్రే కాక పెద్ద తల్లి కూడా అయ్యాడు. ఇప్పుడు ఈ బాబా ఎవరిని అమ్మా అని పిలవాలి? ఈ మాత(బ్రహ్మ) ఎవరిని అమ్మా అని అనాలి? ఈ తల్లికైతే తల్లి ఎవ్వరూ లేరు. ఎలాగైతే శివబాబాకు తండ్రి ఎవ్వరూ లేరో అలాగే ఇతనికి తన తల్లి అంటూ ఎవ్వరూ లేరు.
పిల్లలకు ముఖ్యంగా అర్థం చేయిస్తున్నారు - మనసా-వాచా-కర్మణా ఎవరికైనా దు:ఖమునిస్తే దు:ఖము పొందుతారు. అంతేకాక పదవి భ్రష్టమైపోతుంది. సత్యమైన స్వామి(సాహెబ్) వద్ద సత్యంగా ఉండాలి. అలాగే ఇతనితో(బ్రహ్మతో) కూడా సత్యంగా ఉండాలి. బాబా ఈ పుత్రుడు చాలామంచి సుపుత్రుడు అని ఈ దాదా(బ్రహ్మ)యే సర్టిఫికెట్ ఇస్తాడు. బాబా మహిమ అయితే చేస్తారు కదా. ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉన్నారో తనువు, మనసు, ధనముతో సేవ చేస్తారో, ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరో వారే బాప్దాదా హృదయము పైకి, తల్లి హృదయము పైకి ఎక్కుతారు. ఇతని(బ్రహ్మ) హృదయము పైకి ఎక్కడం అనగా వారి(శివబాబా) సింహాసనము పై ఎక్కినట్లే. సదా సుపుత్రులైన పిల్లలకు మేము సింహాసనాధికారులుగా ఎలా అవ్వాలి? అను ఆలోచనే ఉంటుంది. ఇదే చింతలో లగ్నమై ఉంటారు. సింహాసనాలు కూడా నంబరువారుగా 8 ఉంటాయి. తర్వాత 108, ఆ తర్వాత 16,108 కూడా ఉంటాయి. కాని ఇప్పుడు మనము ఉన్నత పదవిని పొందాలి. రెండు కళలు తక్కువగా ఉండి గద్ది పై కూర్చుంటే అది శోభించదు. సుపుత్రులైన పిల్లలు ఇలా ఆలోచించి చాలా పురుషార్థము చేస్తారు - '' ఇప్పుడు మేము ప్రియమైన బాబా నుండి సూర్యవంశ వారసత్వమును పూర్తిగా తీసుకోకుంటే కల్ప-కల్పము తీసుకోలేము.'' ఇప్పుడు ఒకవేళ విజయ మాలలో కూర్చబడకుంటే కల్ప-కల్పము కూర్చబడము. ఇది కల్ప-కల్పపు పరుగు పందెము(రేస్). ఒకవేళ ఇప్పుడు నష్టపడితే కల్ప-కల్పము నష్టపడ్తూనే ఉంటారు. ఎవరైతే శ్రీమతము పై తల్లిదండ్రులను పూర్తిగా అనుసరిస్తారో, ఎప్పుడూ ఎవరికీ దు:ఖమివ్వరో వారే పక్కా వ్యాపారులు. అందులో నంబరు వన్ దు:ఖము కామ ఖడ్గాన్ని ఉపయోగించడం.
తండ్రి అంటున్నారు - అచ్ఛా, కృష్ణ భగవానువాచ అని అనుకున్నా అతడు కూడా నంబరు వన్యే కదా. వారి మాటనైనా గౌరవించాలి, అప్పుడే స్వర్గానికి అధికారులుగా అవుతారు. కృష్ణ భగవానుడు శ్రీమతము ద్వారా శిక్షణ ఇచ్చాడని భావిస్తారు. అది కూడా మంచిదే. అచ్ఛా, అతడి మతమును అనుసరించండి. కృష్ణుడు కూడా కామము మహాశత్రువు దాని పై విజయము పొందండి అని అన్నాడు కదా. ఈ వికారాలను జయించినప్పుడే కృష్ణపురములోకి రాగలరు. అయితే ఇది కృష్ణుని విషయము కాదు. కృష్ణుడైతే చిన్న బాలుడు, అతడు మతమునెలా ఇస్తాడు? పెద్దవాడై సింహాసనము పై కూర్చున్నప్పుడు అతడు మతమునిస్తాడు(సలహా ఇవ్వగలడు). సలహానిచ్చేందుకు అర్హుడైనప్పుడే రాజ్యపాలన చేస్తాడు కదా. ఇప్పుడు శివబాబా అంటున్నారు - నన్ను నిరాకార ప్రపంచములో స్మృతి చేయండి. కృష్ణుడు నన్ను స్వర్గములో స్మృతి చేయండి అని అంటాడు. అతడు కూడా కామము మహాశత్రువు, దాని పై విజయము పొందండి అని అంటున్నాడు. అక్కడ విషము లభించదు. కావున విషాన్ని వదిలి పవిత్రంగా అవ్వండి. ఈ విధంగా కృష్ణుని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అచ్ఛా, మనుష్యులు నా పేరు తొలగించి నా కొడుకు పేరు వేసినారనుకోండి, అతడు కూడా సర్వ గుణ సంపన్నుడే కదా. గీతలో కామము మహాశత్రువని వ్రాయబడి ఉందని అతడు కూడా అంటాడు. కాని అతని మాట కూడా వినరు. అతని సలహాను కూడా పాటించరు. కృష్ణుడు స్వయంగా వచ్చినప్పుడు అతని మతమును అనుసరిస్తాము, అంతవరకు మునకలు వేస్తూనే ఉంటామని భావిస్తారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చానని సన్యాసులు మొదలైనవారు అనలేరు. ఈ విధంగా తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. అంతేకాక ఇది సంగమ యుగములోని విషయమే. కృష్ణుడు సత్యయుగములో ఉంటాడు. అతడిని కూడా ఇలా అర్హునిగా తయారుచేసినవారు ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు శివబాబా స్వయంగా చెప్తున్నారు - '' కృష్ణుడు మరియు అతని వంశములోని వారందరినీ ఇప్పుడు నేను స్వర్గములోకి వెళ్లేందుకు అర్హులుగా చేస్తున్నాను. '' పిల్లలు స్వర్గములోకి వెళ్లి ఉన్నత పదవి పొందాలని బాబా ఎంతో శ్రమ చేస్తున్నారు. లేకుంటే చదువుకున్నవారి ముందు మూటలు మోయవలసి వస్తుంది. తండ్రి నుండి అయితే పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మేము ఇంత సుపుత్రులుగా ఉన్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సుపుత్రులు కూడా నంబరువారుగా ఉంటారు. ఉత్తములు, మధ్యములు, కనిష్టులు. ఉత్తములైతే ఎప్పుడూ దాగి ఉండలేరు. మేము భారతదేశానికి సేవ చేయాలని వారి హృదయములో దయ కలుగుతుంది. సమాజ సేవకులు కూడా నంబరువారుగా ఉంటారు. ఉత్తములు, మధ్యములు, కనిష్టులు. కొందరైతే చాలా దోచుకుంటారు. వస్తువులన్నీ అమ్ముకొని తినేస్తారు. అటువంటివారిని సుపుత్రులైన సమాజ సేవకులని ఎలా అంటారు? తమకు తాము సమాజ సేవకులుగా ఎంతోమంది పిలిపించుకుంటారు. ఎందుకంటే సమాజానికి సేవ చేస్తారు. అయితే సత్యమైన సేవ తండ్రి ఒక్కరు మాత్రమే చేస్తారు.
మేము కూడా బాబాతో పాటు ఆత్మిక సేవకులమని మీరంటారు. మొత్తము సృష్టికే కాదు తత్వాలను కూడా పవిత్రంగా చేస్తామని మీరు అంటారు. ఈ సమయములో తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయని, వాటిని కూడా సతోప్రధానంగా చేయాలని సన్యాసులకు తెలియదు. సతోప్రధాన తత్వాలతో శరీరాలు కూడా సతోప్రధానంగా అయిపోతాయి. సన్యాసులకైతే ఎప్పుడూ సతోప్రధాన శరీరము తయారవ్వదు. ఎందుకంటే వారు వచ్చేదే రజోప్రధాన సమయములో. బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు అయినా పిల్లలు మళ్లీ మర్చిపోతారు. ఎవరైతే ఇతరులకు వినిపిస్తూ ఉంటారో వారికి గుర్తుంటుంది. దానము చేయకపోతే ధారణ కూడా జరగదు. ఎవరైతే మంచి సర్వీసు చేస్తారో బాప్దాదా కూడా వారి పేరును ప్రసిద్ధము చేస్తారు. సేవ చేయడంలో ఎవరెవరు చురుకుగా ఉన్నారో పిల్లలకు కూడా తెలుసు. సర్వీసులో ఎవరైతే తత్పరులుగా ఉన్నారో వారు బాబా హృదయాన్ని అధిరోహిస్తారు. ఎల్లప్పుడూ మాతా-పితలను అనుసరించాలి. వారు మాత్రమే సింహాసనాధికారులుగా అవుతారు. ఎవరైతే సర్వీసు చేస్తారో వారు ఇతరులకు సుఖమునిస్తారు. నేను బాబాకు సుపుత్రునిగా అయ్యానా అని మీ ముఖాన్ని దర్పణములో చూసుకోండి. '' మా సర్వీసు చార్టు ఇలా ఉంది, నేను ఈ ఈ సేవలు చేస్తున్నాను బాబా మీరే నిర్ణయించండి అని మీరే స్వయంగా వ్రాయవచ్చు. అప్పుడు బాబాకు కూడా తెలుస్తుంది. స్వయం మీ అంతకు మీరే - నేను ఉత్తముడినా, మధ్యముడినా, లేక కనిష్ఠుడినా? అని నిర్ణయించుకోవచ్చు. మహారథులెవరో, అశ్వారూఢులు ఎవరో పిల్లలకు కూడా తెలుసు. ఎవ్వరూ దాగి ఉండలేరు. తండ్రికి లెక్కాచారాన్ని పంపితే బాబా అప్రమత్తము కూడా చేస్తారు. లెక్కాచారము పంపకున్నా అటెన్షన్ అయితే లభిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎంత వారసత్వము తీసుకోవాలనుకుంటే అంత పూర్తి పూర్తిగా తీసుకోండి. తర్వాత మళ్లీ బాప్దాదా నుండి కూడా సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ పెద్ద తల్లి కూర్చుని ఉంది. ఇతనితో సర్టిఫికెట్ లభించగలదు. ఈ అద్భుతమైన తల్లికి, తల్లి ఎవ్వరూ లేరు. ఎలాగైతే ఆ తండ్రికి తండ్రి ఎవ్వరూ లేరో అలా ఈ తల్లికి కూడా తల్లి ఎవ్వరూ లేరు. మమ్మా స్త్రీలలో నంబరువన్. డ్రామాలో జగదంబ గాయనము చేయబడింది. సేవ కూడా చాలా చేసింది. బాబా ఎలాగైతే సేవకు వెళ్తారో అలా మమ్మా కూడా వెళ్లేది. చిన్న - చిన్న పల్లెలలో సేవ చేసేది. అందరికంటే చురుకుగా ముందుకు వెళ్లింది. బాబా జతలో అయితే పెద్ద బాబా ఉన్నారు. కనుక పిల్లలు వీరిని చాలా సంభాళన చేయవలసి వస్తుంది. సత్యయుగములో ప్రజలు చాలా సుఖంగా ఉంటారు. వారికి తమ మహళ్లు, ఆవులు, ఎద్దులు మొదలైనవన్నీ ఉంటాయి. మంచిది. పిల్లలూ, ఖుషీగా ఉండండి, సదా సంపన్నంగా ఉండండి, మర్చిపోకండి. ఇతరులనెవ్వరినీ స్మృతి చేయకండి. ఎందుకంటే శివబాబా ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. మీ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. మరి ఇతరులను ఎలా తల్చుకుంటారు? అచ్ఛా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎవ్వరినీ అసంతుష్ట పరచరాదు. మనసా-వాచా-కర్మణా అందరికీ సుఖమునిచ్చి తండ్రి ఆశీర్వాదాలను, పరివారము నుండి ఆశీర్వాదాలను తీసుకోవాలి.
2. సుపుత్రులుగా
అయ్యి భారతదేశానికి ఆత్మిక సేవ చేయాలి. దయా హృదయులై ఆత్మిక సమాజ సేవకులుగా
తయారవ్వాలి. తనువు-మనసు-ధనములతో సేవ చేయాలి. సత్యమైన స్వామితో (సచ్చే
సాహెబ్ సే) సత్యముగా ఉండాలి.
వరదానము :- ''హృదయము (దిల్) ఒక్క హృదయాభిరామునిలోనే (దిలారామునిలోనే) నిలిపి సహజయోగులుగా అయ్యే సర్వ ఆకర్షణా ముక్త్ భవ ''
దిలారామునికి
దిల్ ఇవ్వడం అనగా దిల్లో నిలుపుకోవడం. దీనినే సహజ యోగము అని అంటారు.
ఎక్కడైతే దిల్ ఉంటుందో, అక్కడకే దిమాగ్(బుద్ధి) కూడా వెళ్తుంది.
ఎప్పుడైతే దిల్ మరియు దిమాగ్ అనగా స్మృతి, సంకల్పము, శక్తి అన్నీ
తండ్రికి ఇచ్చేశారో, మనసా, వాచా, కర్మణా తండ్రి వారిగా అయిపోతే ఏ ఇతర
సంకల్పము వచ్చేందుకు లేక ఏ విధమైన ఆకర్షణ కలిగేందుకు అవకాశమే లేదు.
స్వప్నాలు కూడా ఈ ఆధారముతోనే వస్తాయి. ఎప్పుడైతే అన్నీ మీవే అన్నప్పుడు,
వేరే ఆకర్షణ రానే రాజాలదు. సహజంగానే సర్వ ఆకర్షణా ముక్తులుగా అయిపోతారు.
స్లోగన్ :- ''తండ్రి పై, ఈశ్వరీయ పరివారము పై గాఢమైన ప్రేమ ఉంటే, సఫలత లభిస్తూ ఉంటుంది ''
No comments:
Post a Comment