Thursday, 18 January 2018

Telugu Murli 17/01/18

17-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీరు అనంతమైన పక్కా సన్యాసులుగా అవ్వాలి, ఏ వస్తువులోనూ లోభ వృత్తిని ఉంచుకోరాదు'' 

ప్రశ్న :- తండ్రి నుండి శక్తిని ప్రాప్తి చేసుకునేందుకు పిల్లలైన మీరు అన్నిటికంటే ఏ మంచి కర్మను చేస్తారు ?
జవాబు :- తండ్రికి తమ సర్వస్వాన్ని(తనువు, మనసు, ధనము సహితంగా) అర్పణ చేయడమే అన్నిటికన్నా మంచి కర్మ. మీరు మీ సర్వస్వాన్ని అర్పణ చేసినప్పుడు తండ్రి అందుకు ప్రతిఫలంగా విశ్వమంతటి పై సుఖ-శాంతుల స్థిరమైన అఖండ రాజ్యాన్ని పాలన చేయు శక్తిని మీకిస్తారు. 

ప్రశ్న :- ఏ మనుష్యులూ నేర్పించలేని ఏ సేవ తండ్రి తన పిల్లలైన మీకు నేర్పించారు ? 
జవాబు :- ఆత్మిక సేవ. ఆత్మలైన మీరు మనుష్యులను వికారాల జబ్బు నుండి విడిపించేందుకు జ్ఞాన ఇంజక్షన్‌ ఇస్తున్నారు. మీరు ఆత్మిక సమాజ సేవకులు. మనుష్యులు దైహిక సేవ చేస్తారు. కాని జ్ఞాన ఇంజక్షన్‌ వేసి ఆత్మను వెలిగే జ్యోతిగా తయారు చేయలేరు. ఈ సేవను ఒక్క తండ్రి మాత్రమే పిల్లలకు నేర్పిస్తారు. 

ఓంశాంతి. భగవానువాచ - మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనరాదని అర్థం చేయించబడింది. ఇది మనుష్య సృష్టి. బ్రహ్మ-విష్ణు-శంకరులు సూక్ష్మవతనములో ఉంటారు. శివబాబా ఆత్మల అవినాశి తండ్రి. వినాశి శరీరమునకు తండ్రి కూడా వినాశియే. ఇది అందరికీ తెలుసు. మీ వినాశీ శరీరానికి తండ్రి ఎవరు? ఆత్మకు తండ్రి ఎవరు? అని అడగడం జరుగుతంది. ఆత్మల తండ్రి పరంధామములో ఉంటారని ఆత్మకు తెలుసు. పిల్లలైన మిమ్ములను దేహాభిమానులుగా ఎవరు చేశారు? దేహాన్ని రచించినవారు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా ఎవరు తయారు చేస్తారు? ఆత్మల అవినాశి తండ్రి చేస్తారు. అవినాశి అనగా వారికి ఆదిమధ్యాంతాలు లేవు. ఒకవేళ ఆత్మ మరియు పరమాత్మల ఆదిమధ్యాంతాలను చెప్పినట్లయితే తర్వాత రచన ప్రశ్న కూడా తలెత్తుతుంది. వారిని అవినాశి ఆత్మ. అవినాశి పరమాత్మ అని అంటారు. ఆత్మ పేరు ఆత్మయే. తప్పకుండా ఆత్మకు '' నేను ఆత్మను '' అని తెలుసు. నా ఆత్మను దు:ఖపెట్టకండి అని అంటారు. నేను పాపాత్మను అని ఆత్మనే చెప్తుంది. స్వర్గములో ఆత్మలు ఈ మాటలు ఎప్పుడూ చెప్పవు. ఈ సమయములోనే ఆత్మ పతితంగా ఉంది. మళ్లీ అది పావనంగా అవుతుంది. పతిత ఆత్మయే పావన ఆత్మను మహిమ చేస్తుంది. మనుష్యాత్మలు ఎంతమంది ఉన్నారో వారందరూ తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సిందే. ఇవన్నీ కొత్త విషయాలు. లేస్తూ, కూర్చుంటూ నన్ను స్మృతి చేయండి,....... అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఇంతకుముందు మీరు పూజారులుగా ఉండేవారు. శివాయ నమ: అని అనేవారు. ఇప్పుడు తండ్రి చెప్తారు - పూజారులైన మీరు నమ: అని చాలాసార్లు నమస్కరించారు. ఇప్పుడు మిమ్ములను యజమానులుగా, పూజ్యులుగా తయారు చేస్తాను. పూజ్యులకు ఎప్పుడూ నమస్కరించవలసిన అవసరం ఉండదు. పూజారులు నమ: అనగా నమస్తే అని అంటారు. నమస్తే అంటే నమస్కరించడమే. తప్పనిసరిగా భుజాలు కొద్దిగా క్రిందికి వంచుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు నమస్కరించే అవసరము లేదు. లక్ష్మీ నారాయణ నమ:, విష్ణు దేవతాయ నమ:, శంకర దేవతాయ నమ: అని అనే అవసరము లేదు. ఈ పదాలే పూజారీ స్థితిలోనివి. ఇప్పుడు మీరు పూర్తి సృష్టి పై అధికారులుగా అవ్వాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారు సర్వ సమర్థులని మృత్యువుకే మృత్యువని, అకాలమూర్తి అని, సృష్టి రచయిత అని జ్యోతిర్బిందు స్వరూపుడని కూడా అంటారు. ఇంతకుముందు వారిని చాలా మహిమ చేసేవారు. తర్వాత మళ్లీ సర్వవ్యాపి అని, కుక్కలోనూ, పిల్లిలోనూ ఉన్నారని అనేవారు. దీనితో పూర్తి మహిమ అంతా సమాప్తమైపోతుంది. ఈ సమయములోని మనుష్యులందరూ పాపాత్మలే అయినప్పుడు జంతువులకు మహిమ ఏముంటుంది? విషయమంతా మనుష్యులదే. నేను ఆత్మను. ఇది నా శరీరమని ఆత్మయే చెప్తుంది. ఎలాగైతే ఆత్మ బిందువో, అలా పరమపిత పరమాత్మ కూడా బిందువే. నేను పతితలను పావనంగా చేసేందుకు సాధారణ శరీరములో వస్తాను. వచ్చి పిల్లలకు విధేయుడైన సేవకుడనై సేవ చేస్తాను. నేను ఆత్మిక సమాజ సేవకుడను, పిల్లలైన మీకు కూడా ఆత్మిక సేవ చేయడం నేర్పిస్తానని బాబా చెప్తున్నారు. మిగిలిన వారంతా దేహ సంబంధమైన హద్దులోని భౌతిక సేవ చేయడం నేర్పిస్తారు. మీది ఆత్మిక సేవ అందుకే జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు......... అని చెప్తారు. సత్యమైన సద్గురువు వారొక్కరే. వారే అథారిటి. ఇప్పుడు వారు వచ్చి ఆత్మలందరికీ ఇంజెక్షన్‌ వేస్తారు. ఆత్మలలోనే వికారాల జబ్బు ఉంది. ఈ జ్ఞాన ఇంజెక్షన్‌ వేరెవ్వరి వద్ద ఉండదు. ఇంజెక్షన్‌ వేసేందుకు పతితంగా అయ్యింది ఆత్మయే, శరీరము కాదు. పంచ వికారాల జబ్బు చాలా బలమైన కఠినమైన రోగము. దీనికి అవసరమైన ఇంజెక్షన్‌ జ్ఞానసాగరులైన తండ్రి వద్ద తప్ప ఇంకెవరి వద్దా లేదు. తండ్రి వచ్చి ఆత్మలతో మాట్లాడ్తారు - ఓ ఆత్మలారా! మీరు వెలిగే జ్యోతులుగా ఉండేవారు. తర్వాత మాయ మీ పై తన నీడ వేసింది. అలా నీడను వేస్తూ వేస్తూ మిమ్ములను అంధకార(మంద బుద్ధిగలవారు) బుద్ధి గలవారిగా చేసేసింది. అంతేకాని ఏ యుధిష్టరుడు మరియు దృతరాష్ట్రుల మాట లేదు. ఇది రావణుని విషయము.

తండ్రి అంటున్నారు - నేను సాధారణ రీతిగానే వస్తాను. నన్ను ఎవరో కొందరు మాత్రమే అరుదుగా తెలుసుకోగలరు. శివజయంతి వేరు, కృష్ణ జయంతి వేరు. పరమపిత పరమాత్ముడైన శివుని కృష్ణునితో కలిపేందుకు వీలు లేదు. వారు నిరాకారులు, వీరు సాకారి. తండ్రి చెప్తారు - నేను నిరాకారుడను. ఓ పతితపావనా! వచ్చి ఈ భారతదేశాన్ని మళ్లీ సత్యయుగీ దైవీ రాజస్థానంగా చేయమని నా మహిమను గానము కూడా చేస్తారు. ఏదో సమయములో దైవీ రాజస్థానము ఉండేది. ఇప్పుడది లేదు. మళ్లీ ఎవరు స్థాపన చేస్తారు? పరమపిత పరమాత్మయే బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడిది పతితమైన ప్రజల పై ప్రజా రాజ్యము. దీని పేరే శ్మశానవాటిక. మాయ అలా సమాప్తము చేసేసింది. ఇప్పుడు మీరు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మరిచి తండ్రినైన నన్ను స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థము భలే కర్మలు కూడా చేయండి. ఏ కొద్దిగా సమయము లభించినా నన్ను స్మృతి చేసే పురుషార్థము చేయండి. మీకు ఈ ఒక్క యుక్తినే తెలిపిస్తాను. మీకు అమృతవేళలో అన్నివేళల కన్నా నా స్మృతి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది శాంతమైన శుద్ధమైన సమయము. ఆ సమయంలో దొంగలు దొంగతనము చేయరు. ఎవ్వరూ పాపము చేయరు. ఎవ్వరూ వికారాలలోకి వెళ్ళరు. నిద్రించే సమయములోనే ఇవన్నీ ప్రారంభిస్తారు. దానిని ఘోర తమోప్రధానమైన రాత్రి అని అంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - పిల్లలారా! గతము గతించిపోయింది. భక్తి మార్గములోని ఆట పూర్తయ్యింది. ఇది మీ అంతిమ జన్మ అని ఇప్పుడు మీకు అర్థం చేయించబడ్తుంది. సృష్టి ఎలా వృద్ధి అవుతుంది అను ప్రశ్న ఉత్పన్నము కాజాలదు. ఎందుకంటే వృద్ధి అయితే జరుగుతూనే ఉంటుంది. ఏ ఆత్మలైతే పైన ఉన్నారో వారు క్రిందికి రావాల్సిందే. అందరూ వచ్చేసినప్పుడు వినాశనము ప్రారంభమౌతుంది. తర్వాత నంబరువారుగా అందరూ వెళ్లాల్సిందే. మార్గదర్శకులు అందరికన్నా ముందు ఉంటారు కదా.

తండ్రిని ముక్తిదాత, పతితపావనుడని అంటారు. స్వర్గమే పావన ప్రపంచము దానిని తండ్రి తప్ప వేరెవ్వరూ తయారు చేయలేరు. ఇప్పుడు మీరు తండ్రి శ్రీమతానుసారము భారతదేశానికి తనువు, మనసు, ధనముల ద్వారా సేవ చేస్తారు. గాంధీగారు కోరుకునేవారు కాని చేయలేకపోయారు. డ్రామా రచనయే అలా ఉండినది. అది గడచిపోయింది. పతిత రాజుల రాజ్యము సమాప్తము కావలసి ఉంది. కనుక వారి పేరు-గుర్తులే సమాప్తమైపోయాయి. వారి సంపదకు కూడా నామ-రూపాలు లేవు. లక్ష్మీ నారాయణులు స్వర్గాధికారులుగా ఉండేవారని స్వయమూ భావించేవారు. కాని వారిని అలా ఎవరు తయారు చేశారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా స్వర్గ రచయిత అయిన తండ్రి నుండియే వారసత్వము లభించి ఉంటుంది. ఇతరులెవ్వరూ ఇంత గొప్ప వారసత్వాన్ని ఇవ్వడానికి సాధ్యము లేదు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. గీతలో ఉంది కాని పేరు మార్చివేశారు. కౌరవులు మరియు పాండవులు ఇరువురికీ రాజ్యాన్ని చూపిస్తారు. కాని ఇక్కడ ఇరువురికీ రాజ్యము లేదు. ఇప్పుడు తండ్రి మళ్లీ స్థాపన చేస్తారు. పిల్లలైన మీలో ఖుషీ స్థాయి పెరగాలి. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. ఇప్పుడు మనము వెళ్తున్నాము. మనము మధురమైన ఇంటిలో ఉండేవారము. ఫలానావారు నిర్వాణులయ్యారు లేక జ్యోతి జ్యోతిలో లీనమైపోయింది లేక మోక్షాన్ని పొందారని వారంటారు. భారతవాసులకు స్వర్గమంటే మధురమనిపిస్తుంది. వారు స్వర్గస్థులయ్యారని అంటారు. మోక్షమునైతే(ముక్తి) ఎవ్వరూ పొందరని తండ్రి అర్థం చేయిస్తారు. సర్వుల సద్గతిదాత తండ్రి మాత్రమే. వారు తప్పకుండా అందరికీ సుఖమునే ఇస్తారు. ఒకరు నిర్వాణధామములో కూర్చొని, ఒకరు దు:ఖాన్ని అనుభవించడం ఇది తండ్రి సహించలేరు. తండ్రి పతితపావనులు. ఒకటి ముక్తిధామము పావనమైనది. మరొకటి జీవన్ముక్తిధామము పావనమైనదే. మళ్లీ ద్వాపరము తర్వాత అందరూ పతితులుగా అయిపోతారు. పంచ తత్వాలు మొదలైనవన్నీ తమోప్రధానంగా అయిపోతాయి. మళ్లీ తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. మళ్లీ అక్కడ పవిత్ర తత్వాల ద్వారా మీ శరీరము సుందరంగా తయారౌతుంది. సహజ సౌందర్యము ఉంటుంది. వారిలో ఆకర్షణ ఉంటుంది. కృష్ణునిలో ఎంత ఆకర్షణ ఉంది! దాని పేరే స్వర్గము. మరి ఇంకేమిటి? అకాలమూర్తి....... అని పరమాత్మను చాలా మహిమ చేస్తారు. మళ్లీ వారిని రాళ్ళు-రప్పలలో పడేశారు. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు బాబా వస్తారో అప్పుడు వారే అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి కూడా పిల్లలను రచించినప్పుడే తండ్రి జీవితచరిత్ర గురించి వారికి తెలుస్తుంది. తండ్రి లేకుండా పిల్లలకు తండ్రి జీవితచరిత్ర గురించి ఎలా తెలుస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తారు - లక్ష్మీ నారాయణులను వరించాలంటే శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా జబర్‌దస్త్‌(గొప్ప) లక్ష్యము. చాలా గొప్ప సంపాదన. సత్యయుగములో పవిత్ర ప్రవృత్తి మార్గముండేది. పవిత్ర రాజస్థానము ఉండేది. అదే ఇప్పుడు అపవిత్రమైపోయింది. అందరూ వికారులుగా అయిపోయారు. ఇది ఆసురీ ప్రపంచము. చాలా అవినీతి(కరప్షన్‌) ఏర్పడి ఉంది. రాజరికములో అయితే శక్తి కావాలి. ఈశ్వరీయ శక్తి అయితే అసలు లేనే లేదు. ప్రజల పై ప్రజా రాజ్యముంది. ఎవరైతే దాన-పుణ్యాలు, మంచి కర్మలు చేస్తారో వారికి రాజ కుటుంబములో జన్మ లభిస్తుంది. ఆ కర్మల శక్తి వారిలో ఉంటుంది. ఇప్పుడైతే మీరు చాలా శ్రేష్ఠమైన కర్మలు చేస్తారు. మీరు మీ సర్వస్వాన్ని(తనువు, మనస్సు, ధనములను) శివబాబాకు అర్పణ చేస్తారు. కనుక శివబాబా కూడా తన సర్వస్వాన్ని పిల్లలకు అర్పణ చేయవలసి వస్తుంది. మీరు వారి నుండి శక్తిని ధారణ చేసి సుఖ-శాంతుల అఖండమైన, స్థిరమైన రాజ్య పాలన చేస్తారు. ప్రజలలో అయితే ఎలాంటి శక్తి లేదు. ధనము దానము చేసినందున ఎమ్‌.ఎల్‌.ఎ మొదలైన పదవి లభించిందని అనరు. ధనాన్ని దానము చేసినందున ధనవంతుల ఇంటిలో జన్మ లభిస్తుంది. ఇప్పుడైతే ఏ రాజరికమూ లేదు. ఇప్పుడు బాబా మీకు ఎంత శక్తినిస్తారు! మేము నారాయణుని వరిస్తాము. మేము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరంటారు. ఇవన్నీ కొత్త-కొత్త విషయాలు. నారదుని విషయము ఇప్పటిదే. రామాయణము మొదలైనవి కూడా ఈ సమయములోనివే. సత్య-త్రేతా యుగాలలో ఏ శాస్త్రాలూ ఉండవు. అన్ని శాస్త్రాలకు ఈ సమయముతోనే సంబంధము ఉంది. వృక్షాన్ని చూస్తే మఠాలు, మార్గాలన్నీ తర్వాత వస్తాయి. ముఖ్యమైనది బ్రాహ్మణ వర్ణము, దేవతా వర్ణము, క్షత్రియ వర్ణము......... బ్రాహ్మణుల జుట్టు(శిఖ) ప్రసిద్ధమైనది. ఈ బ్రాహ్మణుల వర్ణము సర్వ శ్రేష్ఠమైనది. కాని దీనిని గురించి శాస్త్రాలలో వర్ణించలేదు. విరాట రూపములో కూడా బ్రాహ్మణులను తీసేశారు. డ్రామాలో అలా నిర్ణయించబడింది. భక్తి ద్వారా క్రిందికి దిగజారుతామని ప్రపంచము వారికి అర్థం కాదు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని వారు అంటారు. చాలా పిలుస్తారు. దు:ఖములో స్మరణ చేస్తారు. ఇందులో మీరు అనుభవజ్ఞులు. అక్కడ దు:ఖము మాటే లేదు. ఇక్కడ అందరిలో క్రోధముంది. ఒకరినొకరు నిందించుకుంటూ, తిట్టుకుంటూ ఉంటారు.

ఇప్పుడు మీరు శివాయ నమ: అని అనరు. శివుడైతే మీ తండ్రి కదా. తండ్రి సర్వవ్యాపి అని అనడం వలన భ్రాతృత్వపు మాటే ఉండదు. హిందూ - చీనీ భాయి-భాయి(సోదరులు), చీనీ- ముస్లిమ్‌ భాయి-భాయి(సోదరులు) అని భారతదేశములో చాలా బాగా అంటూ ఉంటారు. అందరూ సోదరులే కదా. అందరూ ఒక్క తండ్రి సంతానమే. మేము ఒక్క తండ్రి సంతానమేనని ఇప్పుడు మీకు తెలుసు. ఈ బ్రాహ్మణుల వంశము మళ్లీ స్థాపన అవుతోంది. ఈ బ్రాహ్మణ ధర్మము నుండి దేవీ దేవతా ధర్మము వెలువడ్తుంది. దేవీ దేవతా ధర్మము నుండి క్షత్రియ ధర్మము, క్షత్రియ ధర్మము నుండి మళ్లీ ఇస్లామ్‌ ధర్మము...... వెలువడ్తాయి. వంశ వృక్షము కదా. తర్వాత మళ్లీ బౌద్ధులు, క్రైస్తవులు వెలువడ్తారు. ఇలా వృద్ధి అవుతూ అవుతూ ఇంత పెద్ద వృక్షమైపోయింది. ఇది బేహద్‌(అనంతమైన) వంశ వృక్షము. అది హద్దులోనిది. విస్తారమైన ఈ విషయాలు ఎవరికైతే ధారణ చేసుకునేందుకు సాధ్యము కాదో, వారి కొరకు తండ్రి సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు - తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చేయండి. అలా చేస్తే స్వర్గములోకి తప్పకుండా వస్తారు. కాని ఉన్నత పదవిని పొందాలంటే అందుకు పురుషార్థము చేయాలి. శివబాబా కూడా మీకు అర్థం చేయిస్తారు, ఈ బాబా కూడా అర్థం చేయిస్తారని పిల్లలైన మీకు కూడా తెలుసు. అదే మీ బుద్ధిలోనూ, నా బుద్ధిలోనూ ఉంది. భలే మనము శాస్త్రాలు మొదలైనవి చదివాము కాని వీటి ద్వారా భగవంతుడేమీ లభించడని తెలుసు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! శివబాబాను, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. బాబా మీరు చాలా మధురమైనవారు. మీరు ఎంత అద్భుతము చేస్తారు! ఇలా బాబాను మహిమ చేయాలి. పిల్లలైన మీకు ఈశ్వరీయ లాటరీ లభించింది. ఇప్పుడు జ్ఞాన-యోగాల శ్రమ చేయాలి. ఇందులో జబర్‌దస్త్‌(చాలా గొప్ప) బహుమానము లభిస్తుంది. కనుక పురుషార్థము చేయాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అమృతవేళ శుద్ధమైన శాంతియుత సమయములో లేచి తండ్రిని స్మృతి చేయాలి. దేహ సహితంగా అన్నీ మర్చిపోయే అభ్యాసము చేయాలి.
2. గతం గత: అని ఈ అంతిమ జన్మలో తండ్రికి పవిత్రత ద్వారా సహయోగమివ్వాలి. తనువు, మనస్సు, ధనములను భారతదేశాన్ని స్వర్గముగా చేసే సేవలో ఉపయోగించాలి. 

వరదానము :- '' మీ ఆది మరియు అంతిమ స్వరూపాలను ముందుంచుకొని ఖుషీ మరియు నషాలో ఉండే స్మృతి స్వరూప భవ ''
ఎలాగైతే ఆది దేవుడైన బ్రహ్మ, ఆది ఆత్మ అయిన శ్రీకృష్ణుడు - ఇరువురి వ్యత్యాసాన్ని చూపించునప్పుడు కూడా ఇరువురిని జతలో చూపిస్తారో, అలా మీరంతా మీ బ్రాహ్మణ స్వరూపాన్ని, దేవతా స్వరూపాన్ని రెండిటినీ ముందుంచుకొని ఆది నుండి అంతము వరకు మేము ఎంత శ్రేష్ఠ ఆత్మలుగా ఉండినామని చూసుకోండి. అర్ధకల్పము రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు, అర్ధకల్పము మాననీయ(గౌరవింపదగిన), పూజ్యనీయ శ్రేష్ఠమైన ఆత్మలుగా అయ్యారు. ఈ నషా మరియు ఖుషీలో ఉండుట వలన స్మృతి స్వరూపులుగా అయిపోతారు. 

స్లోగన్‌ :- ''అపారమైన జ్ఞాన ధనము ఎవరి వద్ద ఉంటుందో, వారికి సంపన్నత అనుభవమవుతుంది''
 

No comments:

Post a Comment