Thursday, 18 January 2018

Telugu Murli 13/01/18

13-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - పవిత్రత లేకుండా భారతదేశము స్వర్గముగా అవ్వజాలదు. గృహస్థములో ఉంటూ పవిత్రముగా అవ్వండి అని మీకు శ్రీమతము ఉంది, రెండు వైపులా తోడు నిభాయించండి. '' 

ప్రశ్న :- ఇతర సత్సంగాలు లేక ఆశ్రమాలతో పోల్చినప్పుడు ఇచ్చటి ఏ విధానము పూర్తిగా భిన్నమైనది ?
జవాబు :- అచ్చటి ఆశ్రమాలలో మనుష్యులు వెళ్ళి ఉంటారు. అచ్చట మంచి సాంగత్యము లభిస్తుందని ఇల్లు మొదలైన వాటి గొడవలు ఏవీ ఉండవని భావిస్తారు. అక్కడ లక్ష్యము గాని, ఉద్ధేశ్యము గాని ఏదీ లేదు. కాని ఇచ్చట మీరు మరజీవాలుగా అవుతారు. మీచే ఇల్లు-వాకిళ్లను విడిపించరు. ఇంటిలో ఉంటూ మీరు జ్ఞానామృతాన్ని త్రాగాలి, ఆత్మిక సేవ చేయాలి. ఈ విధానము, ఆచారము ఆ సత్సంగాలలో లేదు.

ఓంశాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎందుకంటే ఇచ్చట తండ్రే స్వయంగా అర్థము చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. అందుకే పదే పదే శివభగవానువాచ అనడం కూడా అంత బాగుండదు. ఆ గీతను వినిపించేవారు కృష్ణ భగవానువాచ అని అంటారు. కృష్ణుడు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయాడు. కృష్ణుడు గీతను వినిపించాడని, రాజయోగాన్ని నేర్పించాడని అంటారు. ఇచ్చటైతే శివబాబా మాకు రాజయోగము నేర్పిస్తున్నారని, రాజయోగము నేర్పించే ఏ ఇతర సత్సంగము లేదని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను రాజులకు రాజుగా తయారుచేస్తాను. వారైతే కేవలము కృష్ణ భగవానువాచ - '' మన్మనాభవ '' అని అంటారు. ఎప్పుడు అన్నారు? అని అడిగితే 5 వేల సంవత్సరాల క్రితమని కొందరు, క్రీస్తు పూర్వము 3 వేల సంవత్సరాల క్రితమని కొందరు అంటారు. 2 వేల సంవత్సరాలని ఎవ్వరూ అనరు. ఎందుకంటే మధ్యలో గల 1000 సంవత్సరాలలో ఇస్లామ్‌, బౌద్ధ మతాలు వచ్చాయి. అందువలన క్రీస్తు పూర్వము 3 వేల సంవత్సరాల క్రితము సత్యయుగము ఉండేదని ఋజువౌతుంది. ఇప్పటికి 5 వేల సంవత్సరాల క్రితము గీతను వినిపించే భగవంతుడు వచ్చారని, వారు వచ్చి దేవీ దేవతా ధర్మము స్థాపన చేశారని మనము అంటాము. ఇప్పుడు 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ వారు రావలసి వచ్చింది. ఇది 5 వేల సంవత్సరాల చక్రము. బాబా ఇతని ద్వారా అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ప్రపంచములో అయితే మనుష్యులు అనేక రకాలైన సత్సంగాలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆశ్రమాలకు వెళ్ళి అచ్చటనే ఉంటారు కూడా. అప్పుడు వారిని మాతా-పితల వద్దకు వెళ్ళి జన్మ తీసుకున్నారని గాని, వారి నుండి వారసత్వము లభిస్తుందని గాని అనరు. కేవలం అచ్చట మంచి సాంగత్యము లభిస్తుందని భావిస్తారు. అచ్చట ఉన్నంత కాలము ఇల్లు మొదలైనవాటి హంగామా ఏదీ ఉండదు. అంతేకాని లక్ష్యమంటూ ఏదీ లేదు. ఇచ్చటైతే మేము మాతా-పితల వద్దకు వచ్చామని మీరంటారు. ఇది మీ మరజీవా జన్మ. అచ్చట జనులు పిల్లలను దత్తత చేసుకుంటారు. దానితో అతడు వెళ్ళి వారి ఇంటిలో నివసిస్తాడు. ఇచ్చట పుట్టింటిని, అత్తవారి ఇంటిని వదిలి ఇక్కడే కూర్చునే ఆచారము లేదు. అది జరగదు. ఇక్కడైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి. కుమారి గాని లేక ఎవరైనా గాని, ఇంటిలో ఉంటూ ప్రతి రోజూ జ్ఞానామృతము త్రాగేందుకు రమ్మని ఇచ్చట చెప్పబడ్తుంది. జ్ఞానము అర్థము చేసుకొని మళ్లీ ఇతరులకు అర్థము చేయించమని, రెండు వైపులా తోడు నిభాయించండని చెప్తారు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. చివరి వరకు రెండు వైపులా తోడు నిభాయించాలి. చివర్లో ఇక్కడున్నా, అక్కడున్నా మృత్యువైతే అందరికీ రావలసిందే. రాముడూ పోయాడు, రావణుడూ పోయాడు.......... అని అంటారు. అందరూ ఇక్కడకు వచ్చి ఉండాలని కాదు. ఎప్పుడైతే విషం కొరకు వారిని విసిగించడం జరుగుతుందో అప్పుడు అక్కడ నుండి(ఇంటి నుండి) బయటకు వస్తారు. కన్యలు కూడా తమ ఇళ్లలోనే ఉండాలి, బంధు-మిత్రులకు సేవ చేయాలి. సమాజ సేవకులైతే చాలామంది ఉన్నారు. ప్రభుత్వం వారు ఇంతమందినైతే తమ వద్ద ఉంచుకోలేరు. వారు తమ గృహస్థ వ్యవహారములో ఉంటారు. మళ్లీ ఏదో ఒక సేవ కూడా చేస్తారు. ఇక్కడ మీరు ఆత్మిక సేవ చేయాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. అయితే వికారాల కోసం బాగా విసిగిస్తారో అప్పుడు వచ్చి ఈశ్వరీయ శరణు తీసుకుంటారు. ఇక్కడ విషం కారణంగా(కొరకు) పిల్లలు చాలా దెబ్బలు తింటారు. ఇంకెక్కడా ఇటువంటి విషయాలు ఉండవు. ఇక్కడైతే పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. ప్రభుత్వము కూడా పవిత్రతను కోరుకుంటుంది. కాని గృహస్థ వ్యవహారంలో ఉండేవారిని పవిత్రంగా తయారు చేసే శక్తి ఈశ్వరునిలో మాత్రమే ఉంది. సమయం ఎలా ఉందంటే ప్రభుత్వము కూడా పిల్లలు ఎక్కువగా జన్మించరాదని చెప్తూ ఉంది. ఎందుకంటే చాలా పేదరికం ఉంది. కనుక భారతదేశంలో పవిత్రత ఉండాలని, పిల్లలు తక్కువ అవ్వాలని కోరుకుంటుంది.

తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, పవిత్రంగా ఉంటే పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఈ విషయం వారి(ప్రభుత్వం) బుద్ధిలో లేదు. భారతదేశం పవిత్రంగా ఉండేది. ఇప్పుడు అపవిత్రంగా ఉంది. ఆత్మలందరూ స్వయం వారు కూడా పవిత్రంగా అవ్వాలని కోరుకుంటారు. ఇక్కడ చాలా దు:ఖముంది. పవిత్రత లేకుండా భారతదేశము స్వర్గంగా అవ్వజాలదని పిల్లలైన మీకు తెలుసు. నరకంలో అంతా దు:ఖమే ఉంది. ఇప్పుడు నరకమంటూ వేరే ఎక్కడా లేదు. ఎలాగైతే గరుడ పురాణంలో విషయ వైతరిణీ నది ఉందని, అందులో మనుష్యులు మునకలు వేస్తూ ఉంటారని చూపిస్తారో(వ్రాశారో) అలా మనుష్యులు శిక్షలు అనుభవించే నది ఏదీ లేదు. శిక్షలైతే గర్భ జైలులో లభిస్తాయి. సత్యయుగంలో అయితే శిక్షలు లభించేందుకు గర్భ జైలు ఉండనే ఉండదు. అక్కడ గర్భము మహలు వలె ఉంటుంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా చైతన్యములో ప్రత్యక్షముగా ఉన్న నరకము. ఇక్కడ మనుష్యులు దు:ఖముతో, రోగాలతో బాధపడ్తున్నారు. ఒకరికొకరు దు:ఖమునిచ్చుకుంటూ ఉంటారు. స్వర్గములో ఇవేవీ ఉండవు. నేను మీ అనంతమైన తండ్రిని, నేను రచయితను. కనుక తప్పకుండా నేను కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తానని బాబా అర్థం చేయిస్తున్నారు. స్వర్గం కొరకు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని రచిస్తాను. నీవే తల్లివి, తండ్రివి........... అని అంటారు. కల్ప-కల్పము ఈ రాజయోగము నేర్పించాను. బ్రహ్మ ద్వారా కూర్చొని సర్వ వేద శాస్త్రాల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. పూర్తిగా చదువురాని వారికి కూర్చొని చదివిస్తారు. ఓ భగవంతుడా! రండి అని మీరు పిలుస్తూ ఉండేవారు కదా. పతితులైతే అచ్చటికి వెళ్లలేరు. అందువలన పావనంగా చేసేందుకై వారు ఇచ్చటికి తప్పకుండా రావలసి వచ్చింది. పిల్లలైన మీకు స్మృతినిప్పిస్తున్నారు - కల్పక్రితము కూడా మీకు రాజయోగము నేర్పించాను. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ జ్ఞానము తీసుకున్నారా? అని అడగబడ్తుంది. అప్పుడు 5 వేల సంవత్సరాల ముందు మేము ఈ జ్ఞానము తీసుకున్నామని అంటారు. ఇవన్నీ కొత్త విషయాలు. నూతన యుగము, నూతన ధర్మము మళ్లీ స్థాపన అవుతుంది. ఈశ్వరుడు తప్ప ఈ దైవీ ధర్మాన్ని ఎవ్వరూ స్థాపన చేయలేరు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా స్థాపన చేయలేరు. ఎందుకంటే వారు కూడా రచన అయిన దేవతలు. స్వర్గ రచయిత మాతా-పితలుగా ఉండాలి. మీకు అపారమైన సుఖము కూడా ఇక్కడే ఉండాలి. తండ్రి అంటున్నారు - నేను కూడా రచయితనే. మిమ్ములను కూడా బ్రహ్మ ముఖము ద్వారా నేనే రచించాను. నేను మానవ సృష్టికి బీజరూపుడను. భలే ఎంత గొప్ప సాధు-సత్పురుషులు మొదలైన వారైనా, వారెవ్వరి నోటి నుండి ఈ మాటలు రావు. ఇవి గీతలోని పదాలు. అయితే ఈ మాటలు అన్నవారే మళ్లీ అనగలరు. ఇతరులెవ్వరూ చెప్పలేరు. కేవలం నిరాకారునికి బదులు కృష్ణుని భగవంతుడు అని అనేశారు. తండ్రి అంటున్నారు - నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. పరంధామములో ఉండే నిరాకార పరమాత్మను. మీరు కూడా అర్థము చేసుకోగలరు. సాకార మనుష్యులైతే స్వయాన్ని బీజరూపమని చెప్పుకోలేరు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా అలా అనజాలరు. అందరినీ రచించేవారు శివబాబాయే అని తెలుసు. నేను దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తున్నానని చెప్పే శక్తి కూడా ఇతరులెవ్వరిలోనూ లేదు. భలే స్వయాన్ని కృష్ణుడని, బ్రహ్మ అని, శంకరుడని పిలిపించుకుంటారు,............... అనేకమంది స్వయాన్ని అవతార పురుషులు అని కూడా పిలిపించుకుంటారు. కాని అదంతా అసత్యము. ఇచ్చటకు వచ్చి విన్నప్పుడు తప్పకుండా తండ్రి ఒక్కరేనని, అవతారము కూడా ఒక్కటేనని అర్థము చేసుకుంటారు. వారు నేను మిమ్ములను వెంట తీసుకెళ్తానని అంటున్నారు. ఇలా చెప్పే శక్తి కూడా ఎవ్వరిలోనూ లేదు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా గీతా భగవానుడైన శివబాబాయే ఈ మాట చెప్పారు. వారే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. వారే ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. దోమల గుంపు వలె ఆత్మలు వెళ్ళిపోయాయనే గాయనముంది. అందువలన తండ్రి మార్గదర్శకులై వచ్చి అందరినీ లిబరేట్‌ చేస్తున్నారు. ఇప్పుడిది కలియుగ అంతిమ సమయము. దీని తర్వాత సత్యయుగము రానున్నది. అందువలన వారు తప్పకుండా వచ్చి పవిత్రంగా తయారు చేసి పవిత్ర ప్రపంచములోకి తీసుకెళ్తారు. గీతలో ఏవో కొన్ని పదాలు ఉన్నాయి. ఈ ధర్మము కొరకు శాస్త్రము కావాలి కదా అని భావిస్తారు. అందువలన వారు కూర్చొని గీతా శాస్త్రాన్ని తయారు చేశారు. సర్వ శాస్త్రాలకు శిరోమణి నెంబర్‌వన్‌ గీతా మాతయే. కాని పేరు మార్చేశారు. ఈ సమయములో ఏ తండ్రి అయితే ఈ కర్తవ్యాన్ని చేస్తున్నారో, వారే ద్వాపర యుగములో మళ్లీ కూర్చొని వ్రాయరు కదా. మళ్లీ అదే గీత వెలువడ్తుంది. డ్రామాలో ఈ గీతయే ఫిక్స్‌ అయ్యి ఉంది. ఎలాగైతే తండ్రి మళ్లీ మనుష్యులను దేవతలుగా చేస్తారో అలాగే శాస్త్రాలు కూడా తర్వాత ఎవరో కూర్చొని మళ్లీ వ్రాస్తారు. సత్యయుగములో ఏ శాస్త్రమూ ఉండదు. తండ్రి కూర్చొని మొత్తము చక్రము రహస్యమంతా అర్థం చేయిస్తున్నారు. మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని మీరు భావిస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారే అత్యధికంగా 84 జన్మలు తీసుకుంటారు. మిగిలిన మనుష్యులైతే తర్వాత వృద్ధి చెందుతారు. వారు ఇన్ని జన్మలు తీసుకోరు. తండ్రి కూర్చొని ఈ బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తున్నారు. నేను ఎవరి శరీరాన్ని అప్పుగా తీసుకున్నానో ఆ దాదాకు కూడా తన జన్మల గురించి తెలియదు. ఇతడు వ్యక్తములో ఉన్న ప్రజాపిత బ్రహ్మ, అతడు అవ్యక్తము కాని ఇరువురూ ఒక్కటే. మీరు కూడా ఈ జ్ఞానము వలన సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవుతున్నారు. సూక్ష్మవతన వాసులను ఫరిస్తాలని(సూక్ష్మ దేవతలని) అంటారు. ఎందుకంటే ఫరిస్తాలకు మాంసము, ఎముకలు ఉండవు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా మాంసము, ఎముకలు లేవు. అయితే మరి వారి చిత్రాలు ఎలా తయారు చేస్తారు? శివుని చిత్రము కూడా తయారు చేస్తారు. నిజానికి వారు ఒక నక్షత్రము వంటి వారు. నిరాకారులైన వారికి కూడా రూపాన్ని తయారు చేస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులైతే సూక్ష్మమైనవారు. ఎలాగైతే మనుష్యుల రూపాన్ని తయారు చేస్తారో అలా శంకరుని రూపాన్ని తయారు చేయలేరు. ఎందుకంటే వారికి మాంసము, ఎముకల శరీరము లేనే లేదు. మనము ఇతరులకు అర్థము చేయించేందుకు ఇటువంటి స్థూల శరీరాన్ని తయారు చేస్తాము. కాని వారు సూక్ష్మమైనవారని మీరు కూడా చూస్తారు. మంచిది.

రాత్రి క్లాసు - 13-7-68

మనుష్యులు తప్పకుండా రెండు విషయాలు కోరుకుంటారు. మొదటిది - శాంతి, రెండవది - సుఖము. విశ్వములో శాంతి మరియు స్వయము కొరకు శాంతి కావాలి. మనుష్యులకు విశ్వములో సుఖము స్వయానికి కూడా సుఖము కావాలనే కోరిక ఉంటుంది. శాంతి కావాలంటున్నారు అనగా తప్పకుండా ఒకప్పుడు శాంతి ఉండనే ఉంటుంది. అయితే అది ఎప్పుడు, ఎలా అవుతుందో అశాంతి ఎందుకు అయ్యిందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే గాఢాంధకారము(అజ్ఞానము)లో ఉన్నారు. ఇది పిల్లలైన మీకు తెలుసు. శాంతి, సుఖాల కొరకు మీరు చాలా మంచి దారిని తెలుపుతారు. వారికి చాలా సంతోషము కలుగుతుంది. అయితే అందుకు పావనంగా కూడా అవ్వాలని విన్నప్పుడు చల్లబడిపోతారు(నిరుత్సాహపడతారు). ఈ వికారాలు అందరికీ శత్రువులే. అయితే అందరికీ ప్రియమైనవి కూడా. వీటిని వదలాలంటే హృదయము విదీర్ణమవుతుంది (పగిలిపోతుంది, అంగీకరించదు). దాని పేరే విషము. అయినా వదిలిపెట్టరు. మీరు ఎంతో తలబద్దలు చేసుకుంటారు. అయినా ఓడిపోతారు. విషయం కూడా పవిత్రత గురించే. ఇందులో చాలామంది ఫెయిల్‌ అవుతారు. ఎవరైనా కన్యను చూస్తే ఆకర్షణ కలుగుతుంది. క్రోధము గాని, లోభము గాని, మోహము గాని ఆకర్షించదు. కామము మహాశత్రువు. దీని పై విజయము పొందడం మహావీరుల పని. దేహాభిమానము తర్వాత మొదట కామమే వస్తుంది. దీని పై విజయం పొందాలి. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారికి కాముకులైన మనుష్యులు నమస్కరిస్తారు. మేము వికారులము, మీరు నిర్వికారులు అని అంటారు. మేము క్రోధులము, లోభులము,......... అని అనరు. ముఖ్యమైన విషయమంతా ఈ వికారానిదే. వివాహము వికారము కొరకే చేసుకుంటారు. తల్లిదండ్రులకు ఈ వివాహ చింతే ఉంటుంది. పిల్లలు పెద్దవారవుతే ధనము కూడా ఇస్తారు, వికారాలలోకి కూడా వెళ్తారు. వికారాలలోకి వెళ్లకుంటే జగడాలు కూడా జరుగుతాయి. చిత్రము చూపించి ఈ దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మీ లక్ష్యము మీ ఎదుటనే ఉంది. నరుని నుండి నారాయణునిగా, రాజాధి రాజులుగా అవ్వాలి. ఆ చిత్రము ఎదుటే ఉంది. దీనిని సత్సంగము అని అనరు. ఇది పాఠశాల. అక్కడ సత్సంగము లేనే లేదు. సన్ముఖములో రాజయోగము నేర్పినప్పుడే సత్యమైన సత్సంగము. సత్యమైన తోడు కావాలి, సత్యమైన సాంగత్యము కావాలి. వారే గీత అనగా రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి ఏ గీతనూ వినిపించరు. గీతా పాఠశాల అని పేరుంది. కనుక అక్కడకు వెళ్లి గీత వింటామని భావిస్తారు. ఇంత ఆకర్షణ ఉంటుంది. ఇది ఒక్క సెకెండులో సద్గతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము లభించే సత్యమైన గీతా పాఠశాల. సత్యమైన గీతా పాఠశాల అని ఎందుకు వ్రాస్తారు అని అడుగుతారు. కేవలం గీతా పాఠశాల అని వ్రాయడం సాధారణము. సత్యమైన అను పదము వ్రాయడం వలన ఆకర్షణ కలగవచ్చు. బహుశా అసత్యమైనవి కూడా ఉంటాయి. కనుక సత్యమైన అను పదము తప్పకుండా వ్రాయాల్సి ఉంటుంది. పవిత్ర ప్రవంచమని సత్యయుగమును, పతిత ప్రపంచమని కలియుగమును అంటారు. సత్యయుగములో వీరు పవిత్రంగా ఉండేవారు. అలా ఎలా అయ్యారో నేర్పిస్తారు. తండ్రి బ్రహ్మ ద్వారా చదివిస్తారు లేకుంటే ఎలా చదివిస్తారు? కల్పక్రితము అర్థము చేసుకున్నవారే దీనిని యాత్ర అని భావిస్తారు. భక్తి మార్గము అనే ఊబిలో కూరుకొని పోయి ఉన్నారు. భక్తిలో చాలా ఆడంబరముంది. ఇక్కడ ఏమీ లేదు. కేవలం ఇప్పుడు వాపస్‌ వెళ్లాలని స్మృతిలో ఉంచుకోండి. పవిత్రమై వెళ్లాలి. పవిత్రంగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి. స్వర్గానికి అధికారులుగా చేసే తండ్రిని స్మృతి చేయలేరు. ఇదే ముఖ్యమైన విషయము. అందరూ ఇదే కష్టమని అంటారు. పిల్లలు చాలా బాగా ఉపన్యసిస్తున్నారు. కాని యోగములో ఉండి అర్థం చేయిస్తే ప్రభావము కూడా బాగుంటుంది. స్మృతి ద్వారా మీకు శక్తి లభిస్తుంది. సతోప్రధానంగా అవ్వడం వలన సతోప్రధాన విశ్వానికి అధికారులుగా అవుతారు. స్మృతినే నేష్ఠా అని అంటారా ? మేము అర్ధ గంట నేష్ఠాలో కూర్చుంటాము అని అంటారు. ఇది తప్పు. తండ్రి కేవలం స్మృతిలో ఉండమని అంటారు. ఎదురులో కూర్చుని నేర్పించే అవసరము లేదు. అనంతమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఎందుకంటే చాలా ఖజానాలనిస్తారు. స్మృతి వలన అపారమైన ఖుషీ పాదరస మట్టము పైకి ఎక్కాలి. అతీంద్రియ సుఖము అనుభవమవుతుంది. తండ్రి చెప్తున్నారు - మీ జీవితము చాలా విలువైనది. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎంత కాలము బ్రతుకుతారో అంత ఖజానా తీసుకుంటారు. మనము సతోప్రధానమైనప్పుడు ఖజానా పూర్తిగా లభిస్తుంది. మురళీలో కూడా బలము వస్తుంది. కత్తికి పదును ఉంటుంది కదా. మీలో కూడా స్మృతి అను పదును ఉంటే కత్తి తీవ్రమవుతుంది. జ్ఞానములో అంత పదును లేదు. అందుకే కొంతమందికి ప్రభావము పడదు. మళ్లీ వారి కళ్యాణము కొరకు బాబా రావాలి. ఎప్పుడైతే మీరు స్మృతిలో పదును నింపుకుంటారో అప్పుడు పండితులు, ఆచార్యులు మొదలైనవారికి బాణము తగులుతుంది. అందుకే బాబా చార్టు వ్రాయమని అంటారు. చాలామంది బాబాను మేము చాలా స్మృతి చేస్తామని అంటారు. కాని నోరు విప్పరు. మీరు స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమవుతాయి. అచ్ఛా. పిల్లలకు గుడ్‌ నైట్‌.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇంటిలో ఉంటున్ననూ ఆత్మిక సేవ చేయాలి. పవిత్రముగా తయారై, ఇతరులను కూడా పవిత్రముగా తయారు చేయాలి.
2. ఈ ఆడంబరయుక్త నరకములో ఉంటున్ననూ అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వమును తీసుకోవాలి. ఎవ్వరికి కూడా దు:ఖమును ఇవ్వరాదు. 

వరదానము :- '' ఒక్క ' బాబా ' అను శబ్ధాన్ని స్మృతి చేయడం ద్వారా ' బలహీనత ' అను శబ్ధాన్ని సమాప్తము చేసే సదా సమర్థ ఆత్మా భవ ''
ఏదైనా బలహీనతను వర్ణించునప్పుడు అది సంకల్పము, మాట, సంస్కార-స్వభావాలలోని బలహీనత ఏదైనా కావచ్చు, - '' నేనిలా అనుకున్నాను, నా భావమది కాదు, నా సంస్కారమే ఇలా ఉంది అని అంటారు. కాని తండ్రి సంస్కారమే నా సంస్కారము, తండ్రి సంకల్పమే నా సంకల్పము అని 'బాబా'ను స్మృతి చేయాలి. సమర్థతకు గుర్తు - '' తండ్రి సమానము. '' కనుక సంకల్పము, మాట, ప్రతి విషయంలో ' బాబా ' శబ్ధము న్యాచురల్‌గా(సహజంగా) ఉండాలి. ఇక కర్మలు చేస్తూ చేయించేవారి స్మృతి ఉంటే ' బాబా ' ముందు మాయ అనగా బలహీనత రాజాలదు. 

స్లోగన్‌ :- '' ఎవరి వద్ద ' గంభీరత ' అను విశేషత ఉంటుందో, వారికి ప్రతీ కార్యంలో స్వతహాగా సిద్ధి (సఫలత) ప్రాప్తిస్తుంది ''
 

No comments:

Post a Comment