Thursday, 18 January 2018

Telugu Murli 18/01/18

18-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

పితాశ్రీ వారి పుణ్య స్మృతి దినమున క్లాసులో వినిపించే౦దుకు బాప్‌దాదా మధుర మహావాక్యాలు
''మధురమైన పిల్లలారా - మీ స్వభావాన్ని చాలా మధురంగా, చాలా శాంతిగా చేసుకోండి, మీ మాటలు, నడవడికలు ఎలా ఉండాలంటే, అందరూ '' వీరు దేవతల వలె ఉన్నారు '' అని అనాలి '' 

ప్రశ్న :- హృదయాన్ని శుద్ధంగా తయారు చేసుకునేందుకు ఏ ఆసక్తి ఉండాలి ?
జవాబు :- హృదయాన్ని శుద్ధంగా చేసుకునేందుకు స్వయాన్ని యోగులుగా చేసుకొని, ఇతరులను యోగులుగా తయారు చేయాలనే ఆసక్తి ఉండాలి. యోగ స్థితి ద్వారానే హృదయము శుద్ధంగా అవుతుంది. ఒకవేళ దేహము పై మోహముంటే, దేహ అభిమానముంటే మా స్థితి చాలా కచ్ఛాగా (అపరిపక్వము)గా ఉందని అర్థము చేసుకోండి. దేహీ-అభిమానులుగా ఉండు పిల్లలే సత్యమైన వజ్రాలుగా అవుతారు. అందువలన దేహీ-అభిమానులుగా అయ్యే అభ్యాసము వీలైనంత ఎక్కువగా చేయండి, తండ్రిని స్మృతి చేయండి.  

ఓంశాంతి. ఇప్పుడు భగవంతుడు సన్ముఖములో కూర్చొని మనకు జ్ఞాన గీతాలు వినిపిస్తారని లేక జ్ఞాన డ్యాన్స్‌ చేయిస్తారని పిల్లలకు తెలుసు. ఈ జ్ఞాన డాన్స్‌ వలన మీరు దేవతల వలె సదా సుఖంగా, హర్షితంగా ఉంటారు. అనంతమైన తండ్రి అని, విశ్వ రచయిత అని భగవంతుడినే అంటారు. మన కొరకు బాబా స్వర్గాన్ని బహుమతిగా తెచ్చారని ఆత్మకు తెలుసు. వారే రచయిత. స్వర్గానికి అధికారిగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రిని, విశ్వాధికారాన్ని స్మృతి చేయమని చెప్తారు. తండ్రి అనంతమైన యజమాని కనుక తప్పకుండా అనంతమైన గొప్ప ప్రపంచాన్నే రచిస్తారు. పిల్లలైన మీకు విశ్వమంతా ఇల్లే అనగా పాత్రను అభినయించే స్థానము. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన విశ్వాన్ని లేక ఇంటిని తయారు చేస్తారు, అదే స్వర్గము. అటువంటి తండ్రికి పిల్లలు ఎన్ని కృతజ్ఞతలు తెలపాలి! విశ్వ రచయిత అయిన తండ్రి నేరుగా చెప్తున్నారు - నేను మిమ్ములను విశ్వానికి అధికారులుగా చేసేందుకు వచ్చాను కనుక మీ స్వభావము చాలా ఫస్ట్‌క్లాస్‌గా ఉండాలి. మీ నడవడిక ఎలా ఉండాలంటే అందరూ '' వీరు దేవతల వలె ఉన్నారు '' అని అనాలి. దేవతలు ప్రసిద్ధి చెందినవారు. వీరి స్వభావము పూర్తి దేవతల వలె ఉంది, మిక్కిలి మధురమైన శాంత స్వభావము గలవారని అంటారు. ఇటువంటి పిల్లలను చూచి తండ్రి కూడా సంతోషిస్తారు. బాబా స్వర్గానికి అధికారులుగా చేసేందుకు వస్తారు. కనుక మీరు ఎంత సహాయకారులుగా అవ్వాలి. సేవలో మీ అంతకు మీరే లగ్నమైపోవాలి. నేను అలసిపోయాను, ఫుర్సత్తు(తీరిక) లేదు అని అనరాదు. సమయానికి అందరూ పని చేయడంలో కళ్యాణముంది. యజ్ఞ సేవ చేస్తే ఫలితము శివబాబా ఇస్తారు. పిల్లల దైవీ నడవడికను చూచి బలిహారమౌతారు.
మధురమైన పిల్లలూ, మనలను చదివించేవారెవరో మీకు తెలుసు. ఈ చైతన్య డబ్బీలో చైతన్యమైన వజ్రమై కూర్చొని ఉన్నారు. వారే సత్‌-చిత్‌-ఆనంద స్వరూపులు. సత్యమైన తండ్రి మీకు సత్య-సత్యమైన శ్రీమతమునిస్తారు. తండ్రి వారైనారంటే అడుగడుగునా శ్రీమతమును అనుసరించాలి. నిశ్శబ్ధముగా(మౌనంగా) ఉండి చదువుకోవాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. పదే పదే ఈ బ్యాడ్జిని చూస్తూ ఉంటే తండ్రి మరియు వారసత్వము గుర్తుకొస్తుంది. స్మృతి ద్వారానే మీరు మొత్తం విశ్వమంతటికీ శాంతిని దానము చేస్తారు. ప్రతి పుత్రుడు తన ప్రజలను కూడా తయారు చేసుకోవాలి, వారసులను కూడా తయారు చేసుకోవాలి. ఏ మురళినీ మిస్‌ చేయరాదు. బాబా చాలా ప్రీతిగా అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, మీ పై మీరు దయ చూపుకోండి, ఏ ఆజ్ఞనూ పాటించకుండా ఉండరాదు(అవజ్ఞ చేయరాదు).
తండ్రి హృదయములో పిల్లలందరినీ సదా సుఖంగా తయారు చేయాలనే ఫస్ట్‌ క్లాస్‌ ఆశ ఉంటుంది - పిల్లలు అర్హులై స్వర్గానికి అధికారులుగా అవ్వాలనే ఆశ ఉంటుంది. ఎవరైతే సుగంధభరిత పుష్పాలుగా ఉంటారో, వారు ఆకర్షిస్తారు. ఎవరు ఎటువంటివారుగా ఉంటారో అటువంటి సర్చ్‌లైట్‌ తీసుకునేందుకు ఆకర్షిస్తారు. సుగంధ భరితమైన, గుణవంతులైన పిల్లలను చూచి ప్రేమతో, సంతోషముతో కనులు చెమ్మగిల్లుతాయి. వారికేమైనా కష్టము కలుగుతే బాబా వారికి సర్చ్‌లైట్‌ ఇస్తారు.
బాబా అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, మీరు ఈ పాత ప్రపంచములో ఎలాంటి ఆశలూ ఉంచుకోరాదు. ఇప్పుడిక సుఖధామానికి వెళ్లాలనే ఒకే ఒక శ్రేష్ఠమైన ఆశ ఉంచుకోవాలి. ఇంకెక్కడా నిలబడరాదు, చూడరాదు, ముందుకు వెళ్తూ ఉండాలి. ఒకేవైపు చూస్తూ ఉండండి. అప్పుడే చలించని, స్థిరమైన స్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచము సమాప్తమవ్వనే అవుతుంది. దీని స్థితి చాలా సీరియస్‌గా ఉంది. ఈ సమయములో ప్రకృతికి అందరికంటే ఎక్కువ కోపము ప్రకృతికి వస్తుంది. అందువలన అన్నీ సమాప్తము చేసేస్తుంది. ఇప్పుడీ ప్రకృతి తన కోపాన్ని చాలా జోరుగా చూపిస్తుందని మీకు తెలుసు. మొత్తం పాత ప్రపంచాన్నంతా ముంచేస్తుంది. భూకంపములో ఇండ్లు మొదలైనవన్నీ క్రింద పడిపోతాయి. అనేక విధాలుగా మృత్యువు సంభవిస్తుంది. ఇదంతా డ్రామా ప్లానులో తయారై ఉంది. ఇందులో ఎవ్వరి దోషమూ లేదు. వినాశనమైతే జరిగే తీరాలి. అందువలన మీరు ఈ పాత ప్రపంచము నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. మీరేమో మీ సర్వస్వము ఇన్‌ష్యూర్‌ చేసేశారు కనుక మీకు ఎలాంటి చింతా లేదు. మీ సర్వస్వమూ సఫలమౌతూ ఉంది.
ఇప్పుడు మీరు ''వాహ్‌! సద్గురూ వాహ్‌!'' అని అంటారు. ఆ సద్గురువు మనకు ఈ దారి తెలిపించారు. ''వాహ్‌! నా భాగ్యము వాహ్‌!'' ''వాహ్‌! డ్రామా వాహ్‌!''. మీ హృదయము నుండి - ''థాంక్స్‌(ధన్యవాదాలు) బాబా, మీరు మా నుండి పిడికెడు అటుకులు తీసుకొని మాకు భద్రంగా భవిష్యత్తులో నూరు రెట్లు రిటర్న్‌ ఇస్తారు అయితే ఇందులో కూడా పిల్లలకు చాలా విశాల బుద్ధి ఉండాలి. పిల్లలకు అపారమైన జ్ఞాన ధన ఖజానా లభిస్తూ ఉంటే అపారమైన ఖుషీ ఉండాలి కదా. వారి హృదయము ఎంత శుద్ధంగా ఉంటుందో, ఇతరులను కూడా అంత శుద్ధంగా చేస్తారు. యోగ స్థితి ద్వారానే హృదయము శుద్ధంగా అవుతుంది. పిల్లలైన మీకు యోగులుగా అయ్యి యోగులుగా చేసే ఆసక్తి ఉండాలి. ఒకవేళ దేహములో మోహము, దేహాభిమానము ఉంటే మా స్థితి చాలా కచ్ఛాగా ఉందని అర్థము చేసుకోండి. దేహి-అభిమానులుగా ఉన్న పిల్లలే సత్యమైన వజ్రాలుగా అవుతారు. అందువలన ఎంత ఎక్కువగా వీలైతే అంత దేహి-అభిమానులుగా అయ్యే అభ్యాసము చేయండి. తండ్రిని స్మృతి చేయండి. బాబా అనే పదము అన్నిటికంటే ఎక్కువ మధురమైనది. తండ్రి చాలా ప్రేమతో పిల్లలను కనురెప్పల పై కూర్చోబెట్టుకొని(క్షేమంగా) వెంట తీసుకెళ్తారు. ఇటువంటి తండ్రి స్మృతి అను నషాలో చూర్ణమైపోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంతోషములో మునిగిపోవాలి. తండ్రి ఎలాగైతే అపకారులకు కూడా ఉపకారము చేస్తారో - అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి. సుఖదాతలుగా అవ్వండి.
పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా ఎంత గొప్ప సంపాదన చేస్తారు! మీరు పదమాపతులుగా అవుతారు. బాబా మిమ్ములను ఎంత ధనవంతులుగా చేస్తారు! తండ్రి మిమ్ములను ఎంత తరగని ఖజానాలతో తూచుతారంటే 21 జన్మలు ఆ ఖజానాలు మీ వెంటనే ఉంటాయి. అక్కడ దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. ఎప్పుడూ అకాలమృత్యువు పాలు కారు. మృత్యువుతో ఎప్పుడూ భయపడరు. ఇక్కడ ఎంతగానో భయపడ్తారు, ఏడుస్తారు. ఈ పాత శరీరాన్ని వదిలేసి వెళ్లి కొత్త ప్రపంచములో రాకుమారులుగా అవుతామని మీకు సంతోషముంది. మీరు ఈ పాత ప్రపంచము పై మమకారాన్ని తొలగిస్తూ ఈ దేహమును కూడా మర్చిపోతూ వెళ్లండి. మేము ఆత్మలము, స్వతంత్రులము. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. జీవించి ఉండే మరణించిన స్థితిలో ఉండాలి. ఈ ప్రపంచము నుండి మరణించారు. మీరు మరణిస్తే ప్రపంచము మరణించిందని అంటారు కదా(ఆప్‌ ముయే మర్‌ గయీ దునియా). శరీర భావమును తొలగిస్తూ ఉండండి. ''బాబా ఇక చాలు, ఇప్పుడు మేము మీ ఒడిలోకి వచ్చేస్తాము'' అని ఏకాంతముగా కూర్చొని అభ్యాసము చేయండి. ఒక్కరి స్మృతిలోనే శరీరము అంతమవ్వాలి - దీనినే ఏకాంతము అని అంటారు.
ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా రహస్యము కూడా తెలుసు. తండ్రి మిమ్ములను నిరాకార, ఆకార, సాకార ప్రపంచాల సమాచారమంతా వినిపిస్తారు. ఆత్మ చెప్తుంది - '' ఇప్పుడు మేము నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నాము.'' స్వర్గములోకి వెళ్లేందుకు తప్పకుండా అర్హులుగా అవుతాము. మా కళ్యాణము, ఇతరుల కళ్యాణమును చేస్తాము. అచ్ఛా - తండ్రి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - తండ్రి దు:ఖహర్త - సుఖకర్త కనుక పిల్లలు కూడా అందరికీ సుఖమునివ్వాలి. తండ్రికి కుడి భుజముగా(రైట్‌ హ్యాండ్‌గా) అవ్వాలి. ఇటువంటి పిల్లలే తండ్రికి ప్రియమనిపిస్తారు. శుభకార్యములో కుడిచేతినే ఉపయోగిస్తారు. కనుక తండ్రి చెప్తున్నారు - ప్రతి కార్యములో న్యాయయుక్తముగా అవ్వండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే అంతమతి సో గతి అయిపోతుంది. ఈ పాత ప్రపంచము పై మమకారాన్ని తొలగించండి. ఇది శ్మశానమైపోయింది. వృత్తి, వ్యాపారాలు, పిల్లలు మొదలైనవాటి చింతలో మరణిస్తే అనవసరంగా స్వయం మీరే నష్టపోతారు. శివబాబాను స్మృతి చేస్తే మీరు చాలా లాభపడ్తారు. దేహాభిమానము వలన చాలా నష్టము వాటిల్లుతుంది. దేహీ-అభిమానులుగా అవుతే లాభపడ్తారు. ధనము పై కూడా ఎక్కువ ఆశ ఉంచుకోరాదు. అదే చింతలో శివబాబాను కూడా మర్చిపోతారు. సర్వమూ తండ్రికి సమర్పించి శ్రీమతమును ఎంతగా అనుసరిస్తున్నారో శివబాబా చూస్తారు. ప్రారంభములో తండ్రి(బ్రహ్మాబాబా) కూడా ట్రస్టీగా ఉండి చూపించారు కదా. సర్వమూ ఈశ్వరార్పణ చేసి స్వయం ట్రస్టీగా అయిపోయాడు. ఈశ్వరుని కార్యములోనే ఉపయోగించాలి. విఘ్నాలకు ఎప్పుడూ భయపడరాదు. వీలైనంత వరకు సేవలో మీ సర్వస్వము సఫలము చేసుకోవాలి. ఈశ్వరార్పణ చేసి ట్రస్టీలుగా అయ్యి ఉండాలి. అచ్ఛా. 

సృష్టి పరివర్తనకు ఆధారము - సంఘటిత రూపంలో అందరి సంకల్పమూ ఒక్కటిగానే ఉండాలి
(అవ్యక్త మహావాక్యాలు) - 1975
సంఘటిత రూపముతో బ్రాహ్మణులందరిలో దయా భావన, విశ్వకళ్యాణ భావన, సర్వ ఆత్మలను దు:ఖాల నుండి విడుదల చేసే శుభ కామనలు ఎంతవరకు ప్రతి ఒక్కరి హృదయము నుండి ఉత్పన్నము అవ్వవో అంతవరకు విశ్వపరివర్తన కార్యము ఆగి ఉంటుంది. ఇప్పుడు సంఘటిత రూపంలో ఒక్క సంకల్పాన్ని చేయండి. అనగా దృఢ సంకల్పమనే సహయోగాన్ని అందరూ కలిసి ఇవ్వండి. అప్పుడు ఈ కలియుగ పర్వతాన్ని పరివర్తన చేసి బంగారు ప్రపంచాన్ని తీసుకు రాగలరు.
కనుక మా ఈ సంఘటన ఒకే సంకల్పము గలదిగా ఎంతవరకు తయారయ్యింది అని చెక్‌ చేసుకోండి. శాస్త్రాలలో బ్రహ్మకు సృష్టి రచించాలనే సంకల్పము కలిగినప్పుడు సృష్టి రచింపబడిందని వ్రాయబడింది. ఇక్కడ కేవలం ఒక్క బ్రహ్మ మాట కాదు. బ్రహ్మ సహితంగా బ్రాహ్మణులందరికి ఒకే సంకల్పము కలగాలి - ఇప్పుడు మేమందరమూ ఎవరెడీగా ఉన్నాము, నూతన ప్రపంచము స్థాపనయ్యే తీరాలి లేక అవ్వనే అవుతుంది - ఇటువంటి దృఢ సంకల్పము ఎప్పుడైతే బ్రాహ్మణులందరిలో ఉత్పన్నమవుతుందో అప్పుడే ఈ సృష్టి పరివర్తన అవుతుంది అనగా నూతన సృష్టి రచన ప్రాక్టికల్‌గా కనిపిస్తుంది. ఇందులో కూడా సంఘటన బలము అవసరము. ఒకరిద్దరు లేక కేవలం ఎనిమిది మందిది కాదు, మొత్తం సంఘటనలో ఒకే సంకల్పము కావాలి. సంకల్పము ద్వారా సృష్టి రచన జరుగుతుంది. దీని రహస్యము ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే అందరిలో సంకల్పము ఉత్పన్నమవుతుందో అప్పుడు ఒక సెకండులో సమాప్తి ఢంకా మ్రోగడం ప్రారంభమైపోతుంది.
ఒకవైపు సమాప్తి ఢంకా, రెండవ వైపు నూతన ప్రపంచ దృశ్యము జత జతలో కనిపిస్తుంది. అక్కడే వినాశనము అతిగా జరుగుతుంది. అక్కడే జలమయము మధ్య నలువైపులా వినాశనములో ఒక భాగము భూమి, మిగిలిన 3 భాగాలు జలము కనిపిస్తుంది. వెనుక వచ్చిన అనేక ధర్మాల కారణంగా అనేక ఖండాలు ఏవైతే తయారయ్యాయో అవన్నీ సమాప్తమైపోతాయి. కొన్ని దేశాలు ఒక విహార స్థలము రూపంలో నీటి మధ్యలో ఒక ద్వీపము వలె అయిపోతాయి. కనుక ఒకవైపు అతి వినాశనము జరిగే ఢంకా మోగుతుంది. రెండవ వైపు మొదటి రాకుమారుడు(శ్రీకృష్ణుడు) జన్మించిన శబ్ధము పెద్దగా వ్యాపిస్తుంది. శ్రీకృష్ణుడు రావి ఆకు పై రాడు. జలమయం తర్వాత ఆకు పైన శ్రీకృష్ణుడు వచ్చాడని చూపిస్తారు కదా. దీని రహస్యము కూడా ఉంది. భారతదేశము ఫరిస్తాన్‌గా అయినప్పుడు 3 భాగాలు జలమయమైన కారణంగా దానిని జలమయంగా చూపించారు. ఇటువంటి జలమయము మధ్య మొదటి ఆకు ఎవరైతే ఫస్ట్‌ ఆత్మగా ఉంటారో, వారి జన్మ స్థలానికి నలువైపులా ఫస్ట్‌ రాకుమారుడు ప్రత్యక్షమైపోయాడు, వారి జన్మ జరిగిందనే శబ్ధము ప్రసిద్ధమైపోతుంది. కనుక అది కూడా అతిగా జరుగుతుంది. అనగా 3 భాగాలు జలమయమైన దృశ్యము కనిపిస్తుంది. ఒక భాగముగా భారతదేశము స్వర్గము రూపంలో ప్రకటితమవుతుంది. దానినే బంగారు ద్వారక నీటి నుండి వెలువడింది అని చూపిస్తారు. కాని నీటి నుండి రాదు. 3 భాగాలు నీరు ఉంటుంది. ఆ నీటి మధ్య బంగారు ద్వారక కనిపిస్తుంది. అందువలన బంగారు ద్వారక నీటి నుండి బయటకు వచ్చిందని చూపిస్తారు. ఆ సమయంలోనే ఫస్టు ఆత్మ జన్మించిన జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. ఇటువంటి దృశ్యము కనిపిస్తోందా? కనుక పాత ప్రపంచ మహావినాశనమయ్యే ఢంకా, కొత్త ఫస్ట్‌ రాకుమారుని జన్మ దృశ్యము జత జతలో కనిపిస్తుంది. ఎలాగైతే ఢంకా మోగించేందుకు ముందు ఢంకాను వేడి చేస్తారు. అప్పుడు శబ్ధము గట్టిగా వ్యాపిస్తుంది. అలాగే ఇది కూడా ఢంకా మోగేందుకు ముందే యోగాగ్ని ద్వారా తయారవ్వాలి. అప్పుడు ఢంకాలోని శబ్ధము గట్టిగా వినిపిస్తుంది. ఈ ఏర్పాటులో లగ్నమై ఉన్నారు కదా. వేచి ఉండేవారిని కూడా ఏర్పాట్లలో ఉపయోగించండి. అప్పుడు జయ జయ ధ్వనులు వినిపిస్తాయి.
ఎప్పుడైతే శరీరాన్ని నడిపించడం వచ్చేస్తే అప్పుడు రాజ్యాన్ని నడిపించడం కూడా వచ్చేస్తుంది. శరీరాన్ని నడిపించడం అనగా రాజ్యము చేయడం. కనుక రాజ్యము చేసే సంస్కారాన్ని నింపుకోవాలి కదా. నాలెడ్జ్‌ఫుల్‌ అని అంటారు కదా. కనుక ఫుల్‌ నాలెడ్జ్‌ అనగా తనువు, మనసు, ధనము, జనము అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ దాని గురించిన నాలెడ్జ్‌ తక్కువగా ఉండినా నాలెడ్జ్‌ఫుల్‌ అని అనరు. అర్థమయ్యిందా? సదా సఫలతా మూర్తులుగా అయ్యేందుకు ఆధారము కూడా నాలెడ్జ్‌ఫుల్‌గా ఉండడమే. నాలెడ్జ్‌ లేకుంటే సఫలతా మూర్తులుగా కూడా అవ్వలేరు. సమయానుసారము పురుషార్థ వేగము తీవ్రంగా ఉండాలి. సమయ వేగము ఎక్కువగా ఉండి నడిచేవారి వేగము ఢీలాగా ఉంది. కనుక సమయానికి ఎలా చేరగలరు? ఒకే బలము, ఒకే నమ్మకము - ఇదే ముఖ్యమైన సబ్జక్టు. ప్రతీ సమయంలో ఒక్కరి స్మృతిలోనే ఏకరసంగా ఉండాలి. ఈ పురుషార్థములో సదా సఫలంగా ఉంటే గమ్యానికి చేరుకుంటారు. ఎవరైతే స్థిరమైన స్నేహంలో ఉంటారో, వారికి సహయోగము కూడా స్వతహాగానే ప్రాప్తి అవుతుంది. మురళి అనగా లాఠీ వంటిది. దీని ఆధారముతో ఏదైనా లోపముండినా అది పూర్తి అవుతుంది. ఈ ఆధారమే మన ఇంటి వరకు, మన రాజ్యము వరకు చేరుస్తుంది. కాని లక్ష్యముండాలి. నియమానుసారము కాదు, లగ్నముతో మురళి చదవడం లేక వినడం అనగా మురళీధరుని లగ్నములో ఉండడం. మురళీధరునితో స్నేహానికి గుర్తు మురళి. మురళితో ఎంత స్నేహముందో అంత మురళీధరుని పై కూడా స్నేహముందని భావించండి. సత్యమైన బ్రాహ్మణులను మురళితో గుర్తించవచ్చు. మురళి పై లగ్నముంటే వారు సత్యమైన బ్రాహ్మణులని అర్థము. లగ్నము తక్కువగా ఉంటే వారు హాఫ్‌కాస్ట్‌ బ్రాహ్మణులు. 

వరదానము :- ''మస్తకం మధ్యలో సదా తండ్రి స్మృతిని ఎమర్జ్‌గా(ఉత్పన్నంగా) ఉంచుకొను మస్తకమణి భవ''
మస్తకమణి అనగా మస్తకంలో సదా తండ్రి స్మృతి ఉండేవారు. దీనినే ఉన్నతమైన స్థితి అని అంటారు. స్వయాన్ని సదా ఇటువంటి ఉన్నతమై స్థితిలో స్థితమై ఉండే శ్రేష్ఠమైన ఆత్మగా భావించి ముందుకు వెళ్తూ ఉండండి. ఎవరైతే ఈ ఉన్నతమైన స్థితిలో ఉంటారో, వారు క్రింద ఉండే అనేక ప్రకారాలైన విషయాలను సులభంగా దాటుకుంటారు. సమస్యలు క్రింద ఉండిపోతాయి, స్వయం పైన ఉంటారు. మస్తకమణి ఉండే స్థానమే ఉన్నతమైన మస్తకము. అందువలన క్రిందికి రాకండి. సదా పైనే ఉండండి. 

స్లోగన్‌ :- ''చింతలేని చక్రవర్తి స్థితిని అనుభవం చేయాలంటే 'నాది' ని ' నీది ' లోకి పరివర్తన చేయండి''
 

No comments:

Post a Comment